Monday 11 April 2016

పవిత్ర ప్రదేశాల్లో ఉపద్రవాలెందుకు వస్తున్నాయి? - పరమాచార్య స్వామి వారి బోధ

వ్యక్తిగత కల్మషాల దుష్ప్రభవాలు, మడి (మానసిక, శారీరిక, వస్త్రాదుల విషయంలో) యొక్క సానుకూల ప్రయోజనాలు కళ్ళకు కనిపించవు కనుక, జనం వాటిని మూఢనమ్మకాలంటున్నారు. కానీ అశౌచం ఉన్న వ్యక్తులను కలిపేసుకుని తిరగడం వలన వచ్చే పరిణామాలను ఇప్పుడు మన కళ్ళతో చూస్తూనే ఉన్నాము. మడికి విరుద్ధమైన ఆచారాల పెరుగుదల వలన రోగాలు, పవిత్ర ప్రదేశాల్లో సైతం ప్రమాదాలు, ప్రకృతివిపత్తులు, ప్రకృతి ప్రకోపం, కరువు, భూకంపాలు పెరుగుతున్నాయి. ఇదే అన్ని ఉపద్రవాలకు కారణమని ఒప్పుకోకపోవడమే పెద్ద మూఢనమ్మకమని నాకు అనిపిస్తోంది.

కంచి పరమాచార్య స్వామి


వీరేదో అంటరానితనాన్ని ప్రోతహిస్తున్నారని పెడార్దాలు తీయవద్దు. మడికి అంటరానితనానికి సంబంధంలేదు. రెండు వేర్వేరు అంశాలు. ఆధునికత పేరుతో భోజన విషయంలో అంటును కలిపేసుకోవడం, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ తినడం, స్త్రీలకు నెలసరి సమయంలో శాస్త్రం పూర్తి విశ్రాంతి ఇమ్మని చెప్పినా, అది పాటించక, వారితోనే పనులను చేయించడం, ఆ సమయంలో వారిని ఇంట్లో కలుపుకోవడం, పురుటిమైలను, బంధువులు మరణించినప్పుడు వచ్చిన సూతకాన్ని పట్టించుకోనక ఇష్టం వచ్చినట్లు జీవించడం, అటువంటి వారితో కలిసిన తర్వాత కనీస శౌచ నియమాలను పాటించకపోవడం వంటి అనేక అంశాల కారణంగా, మరలా ఇదే వ్యక్తులు సమాజంలో అన్ని ప్రదేశాల్లోకి, ఆలయాల్లోకి ప్రవేశించడం వలన అక్కడి పవిత్రత, సమాజంలో పవిత్రత దెబ్బతిని ఇలా ఉపద్రవాలు జరుగుతున్నాయని స్వామి వారి ఉద్దేశ్యం.

No comments:

Post a Comment