Monday 25 April 2016

హిందూ ధర్మం - 206 (అశ్వమేధయాగంలో అశ్వబలి లేదు - 2)

వక్రీకరణ - అశ్వమేధయాగంలో గుర్రాన్ని చంపి యజమాని (యాగం చేసేవారు) భార్య చచ్చిన గుర్రంతో ఒక రాత్రి నిద్రిస్తుంది. ఆ తర్వాత, ఆ మృత గుర్రం నుంచి తీసిన వప అనే ఒక ప్రత్యేక రసాయనాన్ని యజ్ఞంలో అర్పిస్తారు.
వాస్తవం - అశ్వమేధయాగంలో యజమాని భార్య జ్వలిస్తున్న అగ్ని వద్ద ఒక రాత్రి శయనిస్తుంది. మరునాడు ఆ అగ్నిలో ప్రత్యేక ఆయుర్వేద మూలికల నుంచి సేకరించిన ఔషధగుణములు కలిగి రసాన్ని (వప) యజ్ఞంలో అర్పిస్తారని స్వామి దయానంద సరస్వతీ సత్యార్ధ ప్రకాశంలో వివరించారు. అశ్వన్ని బలి ఇస్తారన్న వాదనను తీవ్రంగా ఖండించారు.


వివరణ - అశ్వమేధయాగ విషయంలో ఆంగ్లేయులు, కమ్యూనిష్టులు చేసిన వక్రీకరణ క్షమించదగ్గది ఎంతమాత్రము కాదు. శతపధ బ్రాహ్మణంలోనే దీనికి సమాధనం ఉంది.
అగ్నిర్వా అశ్వం అని శతపధబ్రాహ్మణం 13.16.3 స్పష్టం చేసింది. ప్రకాశవంతంగా వెలుగుతున్న అగ్నియే అశ్వం. యాగవివరణ మంత్రాల్లో అగ్ని, అశ్వం అనే రెండు అర్దాలు వచ్చే పదాన్ని ఉపయోగించారు. అయితే ధర్మద్వేషులు చేసిందేమిటంటే అగ్ని అనే అర్దానికి బదులు గుర్రం అనే అర్దాన్ని స్వీకరించారు. వైదిక శబ్దాలకు ఎప్పుడు ఏ అర్దం ఉపయోగించాలో నిర్ధారించేది నిరుక్తం. అలా అర్దాన్ని స్వీకరిస్తేనే అది సప్రమాణికం. అదీగాక ఇక్కడ శతపధబ్రాహ్మణమే చెప్తున్నది అక్కడ అగ్నియే అశ్వమని. కానీ వారు దీన్ని విస్మరించారు. ఈ విషయంలో సాయనాచార్యుడు, మహీధరుడు మొదలైన భారతీయ భాష్యకారులు కూడా పొరబడ్డారని దయానందులు అన్నారు.  అశ్వమేధం ముగిసే ముందు రాణి ఆ రాత్రంతా జ్వలిస్తున్న అగ్ని వద్ద ఏ భయం లేకుండా, తన భర్త తన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా నిద్రిస్తుందో, అంత ధైర్యంగా నిద్రిస్తుంది. ఆ అగ్ని చల్లారకుండా, ఆ రాత్రంత్రా ఋత్విక్కులు వేదమంత్రాలతో ఆ యజ్ఞాగ్నిలో ఆహుతులిస్తూ, అగ్ని ప్రజ్వరిల్లేలా చేస్తూనే ఉంటారు.

దేశం అశ్వం వంటిది అయినప్పుడు, ఆ చిన్న, చితకా రాజపరివారం, మంత్రులు, చిన్న చిన్న జంతువుల వంటి వారు. ఆ యాగానికి అనేక పెద్ద, చిన్న సామంత రాజులు, మంత్రులు హాజరవుతారు. రాజు నుంచి మంత్రులు, సామంతరాజులు మొదలైనవారికి ఆ సమయంలోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, దేశభద్రత, సరిహద్దులు పటిష్టకు సంబంధించిన అంశాల పట్ల చర్చ జరుగుతుంది. యాగసమాప్తిలో ప్రత్యేక మూలికల నుంచి తీసిన పసరును యాగంలో సమర్పిస్తారు. అది అందరి దేహాలను శుద్ధి చేస్తుంది.

అయితే దీనికి నికృష్టులైన కమ్యూనిస్టులు, అంగ్లేయులు చేసిన అతి నీచమైన వక్రీకరణ చూసినవారు ఎవరైనా వారు కమ్యూనిష్టులు కారని, కమీనేలు, నికృష్టులని ఒప్పుకుని తీరుతారు. వారి మీద ఆవేశంతో రగిలిపోతారు. పైన చెప్పిన వక్రీకరణ కాక, వీరు దీనికి వీరుకున్న జాడ్యాలన్నీ అంటించి, వారి మనసులో అణుచుకున్న కోరికలను ఆ యాగంలో జరిగే ప్రక్రియలుగా వర్ణించారు. సాయనాచార్యుడు మొదలైన భాష్యకారులు చెప్పిందే చెప్తున్నామంటూ, మకు అర్దమైనట్లుగా సాయనుడికి వేదహృదయం అర్దం కాలేదు, అందుకని మేము చెప్పిందే స్వీకరించండి అని చెప్పేశారు. ఆ వక్రీకరణకారులు ఏమంటారంటే ఆ యగంలో చిన్న చిన్న పశువులను, పక్షులను బలి ఇస్తారు. అటు తర్వాత రాణి ఆ అశ్వానికి కత్తితో 3 గాట్లు పెడుతుంది. తర్వాత అశ్వాన్ని చంపుతారు. ఆ చచ్చిన అశ్వంతో యజమాని భార్య ఒక రాత్రి శయనిస్తుంది. తన భర్తతో శయనించిన విధంగా. ఆమె దానితో సంభోగిస్తుంది. దీనివలన ఆమెకు గర్భశుద్ధి అవుతుంది. ఇదంతా వేదపండితుల సమక్షంలోనే జరుగుతుంది. వారు అది చూస్తూ, దాన్ని ప్రోత్సహిస్తూ, చపట్లు కొడుతూ, ఆ రాత్రంతా అక్కడే ఉంటారు. మరునాడు ఉదయం ఆ అశ్వాన్ని చంపి, దాని శరీరభాగం నుంచి వపను తీసి, యజ్ఞంలో వేస్తారు. చూడండి,  విషయాన్ని ఎంత దారుణంగా పక్కదోవ పట్టించారో!.

ఇంతకంటే నికృష్టమైన, నీచాతినీచమైన వక్రీకరణ ఉంటుందా? దీన్ని మనం అంగీకరించాలా? కానీ విదేశీయుల కుట్ర ఎటువంటిదంటే ఇప్పుడు ఈ దేశంలో అనేకమంది పండితులు కూడా వక్రీకరించిన విషయమే కొన్ని సవరణలతో సత్యమని భావిస్తున్నారు. పాపం! వారికి కూడా నిజం తెలియదు. ఈ విషయంలో ఆర్యసమాజం వారు నిరుక్తం ఆధారంగా పరిశోధన చేసి, సనాతనధర్మానికి చేసిన సేవ మరువజాలనిది.

To be continued ....................

No comments:

Post a Comment