Sunday 10 April 2016

హిందూ ధర్మం - 203 (వేదంలో గోవధ ఖండన - 3)



వక్రీకరణ - ఇంద్రుడు ఆవు, దూడ, ఎద్దు, గుర్రం, దున్నపోతుల మాంసం తింటాడు - 6-17-1
వాస్తవం - ఆ మంత్రం ఏం చెప్తోందంటే యజ్ఞంలో అగ్నికి కలప పుష్టినిచ్చిన విధంగా గొప్ప పండితులు ఈ ప్రపంచాన్ని జ్ఞానంతో కాంతిమయం చేస్తారు. ఈ మంత్రాన్ని అనువాదం చేసిన అవతార్ గిల్ల్ సమూహానికి ఇందులో ఇంద్రుడు, ఆవు, ఎద్దు, గుర్రం ఎలా కనిపించాయో!? వారు చెప్పిన మంత్రంలో 'గవ్యం' అనే పదం ఉంది. పంచగవ్యం ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడలకు సంకేతం. కానీ వారు దానికి మాంసం అనే అర్దం కల్పించారు. రాజు గోఘృతం వంటి సాత్విక భోజనం ద్వారా పుష్టిగా తయారై దేశాన్ని శతృవులు, రాక్షసుల బారి నుంచి రక్షించాలని ఆ మంత్రం చెప్తోంది.

వక్రీకరణ - అగ్ని 100 దున్నపోతులను వండాడు. ఓ ఇంద్రా! ఇది మరుత్తులను శక్తివంతం చేస్తుంది. అతడు, పూషన్, విష్ణువు, అందులోకి మూడ పెద్దపాత్రలతో వృత్తాసుర్రున్ని చంపే రసాయనం పోశాడు - ఋగ్వేదం 6-17-11
వాస్తవం - ఓ ఇంద్రా! లోక పరిపాలకుడా! మానవాళి మరియు ప్రకృతి యందున్న సమస్త బలనమైన, సృజనాత్మకమైన శక్తులన్నీ ఏకమై నీ తేజమును, సేవను స్తుతించాలి. సర్వవ్యాపకుడు, విశ్వాన్ని పోషించువాడు, సర్వకాలాల్లో శక్తిమంతుడు, మూడూ లోకాల యందు ఉంటూ పరమానందానిచ్చు విష్ణువు దుష్టులను నశింపజేయు ఇంద్రునకు ఆనందాన్ని, శక్తిని ఇచ్చుగాకా. (ఇది ఆర్యసమాజ స్థాపకులు మహర్షి స్వామి దాయనందుల వారి అనువాద సరళిలో డా. తులసి రాం శర్మ గారి అనువాదం)

వక్రీకరణ - మనుస్మృతి జంతువధను సమర్ధిస్తుంది. 'జంతువులను తినడం పాపం కాదు, ఎందుకంటే భగవంతుడు తినేవారిని, తిను పదార్ధాలను, రెండింటిని సృష్టించాడు - 5-30
వాస్తవం - హిందూ ధార్మిక గ్రంధాల్లో అత్యత ఎక్కువగా ప్రక్షిప్తాలకు గురైంది మనుస్మృతేనని అనేకమంది తేల్చారు. క్రీ.శ. 7 వ శతాబ్దం తర్వాత మొదలైన ఈ ప్రక్షిప్తాలు ఎంతవరకు వెళ్ళాయంటే ఇప్పుడు లభించే మనుస్మృతిలో 50% ప్రక్షిప్తాలే ఉన్నాయి. ఆర్యసమాజం వారు మనుస్మృతిలో ఉన్న ప్రక్షిప్తాలను తొలగించి యదార్ధమైన మనుస్మృతిని విశుద్ధ మనుస్మృతి పేరిట ప్రచురించారు.

అసలు మనుస్మృతిలో జంతువధ గురించి ఏం చెప్పారో చూద్దాం.

अनुमन्‍ता विशसिता निहन्‍ता क्रयविक्रयी ।
संस्‍कर्ता चोपहर्ता च खादकश्‍चेति घातका: ।। – మనుస్మృతి 5 వ అధ్యాయం 51 వ శ్లోకం.

మాంసభక్షణ ప్రోత్సహించేవాళ్ళు, జంతువులను వధించువాడు, మాంసం అమ్మువాడు, వండువాడు, దాన్ని వడ్డించువాడు, తినువాడు, అందరూ ఘాతకులే. వారందరికి పాపం సమానంగా వస్తుంది.

ఏ జీవిని చంపకపోవటం చేతనే వ్యక్తి మోక్షానికి అర్హుడవుతాడు - మనుస్మృతి 6.60

నిస్సహాయ, అహింసాప్రవృత్తి కల జంతువులను తన సంతోషం కోసం వధించువాడు ఇహలోకంలోను, పరలోకంలోనూ ఎన్నటికి సంతోషాన్ని పొందడు - మనుస్మృతి 5-54.

ఎవరికైతే జంతువులను బాధించాలని, వధించాలని కోరిక ఉండదో, అతడు సవ్రజీవులకు హితుడై (సరభూతహితుడై), పరమానందాన్ని పొందుతాడు - మనుస్మృతి 5-46

ఏ జీవికి హానీ చేయనివాడు, ఏ ప్రయత్నం లేకుండానే అతడు అనుకున్నది ఏది అనుకుంటే అది పొందుతాడు, మనసు దేని మీద లగ్నం చేస్తే అది సిద్ధిస్తుంది, అతడు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది - మ.స్మృ.5-47

జీవులను హింసించకుండా మాంసం రాదు. జీవహింస ఆత్మానందానికి అడ్డంకి. కనుక మాంసభక్షణ విడిచిపెట్టండి - మ.స్మృ.5-48

దేవతలను, పితృదేవతలను పూజించకపోయినా ఫర్వాలేదు కానీ, అన్యజీవుల మాంసాన్ని భుజించి తన శరీర సౌష్టవాన్ని పెంచుకోవాలనుకునే వ్యక్తికి మించిన మహాపాపాత్ముడు వేరొకడు ఉండడు - మ.స్మృ.5-52

మనుస్మృతి ఇంత విపులంగా జీవహింస తప్పని చెప్తే, అందులో గోమాంసం భక్షణ ఉందని, వేదంలో ఎద్దులను తినమని చెప్పిందని వక్రీకరించి 'మొద్దులను' ఏమనాలి?

To be continued ................

Sources:
https://ancientindians.in/purusharthas/dharma/vegetarianism-as-per-manusmruti-a-dharma-sastra/
http://www.iskcondesiretree.com/forum/topics/about-being-vegetarian-and-not
http://www.vedicgranth.org/misconceptions-on-vedas/misconception-3---violence-against-animals-meet-eating-etc

No comments:

Post a Comment