Sunday 29 January 2017

హిందూ ధర్మం - 235 (గ్రీకు సాహిత్యంలో వైదిక ధర్మం)



మనకు, గ్రీకు నాగరికతకు మధ్య చక్కని సంబంధాలు ఉండేవి. గ్రీకులు మన నుంచి అనేకం తీసుకున్నారు. ముఖ్యంగా గ్రీకు కథలు సనాతన ధర్మ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని రాసుకున్నవే. ట్రోజన్ వార్ అనేది స్కూల్ పాఠ్యపుస్తకాల్లో ఆంగ్లంలో ఉంది. ఆ ట్రాజన్ వార్ మహాభారతాన్ని ప్రేరణగా తీసుకుని గ్రీకులు రాసుకున్న కథ.

  • మహాభారతంలో పాండవులు 14 ఏళ్ళు వనవాసానికి వెళతారు. ట్రాజన్ యుద్ధం 14 ఏళ్ళు జరిగింది. మహాభారతం ప్రారంభంలో అర్జునుడు యుద్ధానికి సుముఖంగా ఉండడు. 
  • ట్రాజన్ యుద్ధంలో కూడా అకిల్లిస్, యుద్ధం చేయడానికి ఇష్టపడడు. అర్జునుడు, తన కుమారుడైన అభిమన్యుడి శవం మీద పడి రోదించి, ఆ తర్వాత రోజు జయధ్రథుడిని చంపుతానని శపధం చేస్తాడు. అచిల్లిస్ కూడా తన సోదరుడు పాట్రోకులస్ మృతికి రోదించి, మరుసటి రోజు హెక్టర్ ని చంపుతానని శపధం చేస్తాడు. 
  • ఘటోత్కచుడు, కౌరవుల సైన్యంపై రాత్రి సమయంలో దాడి చేసి, తీవ్రమైన వినాశనం కలిగిస్తాడు. అగ్నిని ఆయుధంగా వాడి, కౌరవ శిబిరాలను దగ్ధం చేస్తాడు. హెక్టర్ కూడా గ్రీకు సైన్య శిబిరలపై దాడి చేసి, వినాశనం కలిగిస్తాడు. అప్పుడు కూడా అగ్నినే ఆయుధంగా వాడతాడు. 
  • సంజయుడు యుద్ధాన్ని ధృతరాష్ట్రునకు చెప్తాడు. అలాగే ట్రాజన్ రాజుకు మంత్రి యుద్ధాన్ని వివరిస్తాడు. 
  • ధృతరాష్ట్రునకు 100 కుమారులు, ట్రాజన్ రాజుకు 68 పుత్రులు, 18 పుత్రికలు. 
  • అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కలిసి పాండవుల శిబిరం వద్దకు వెళ్ళగా, కృపాచార్య, కృతవర్మ, ద్వారాల వద్దనే ఉండిపోతారు. ఆశ్వత్థామ లోపలకు వెళ్ళి, ఉపపాండవులను చంపుతాడు. రక్తపాతం సృష్టిస్తాడు. అలాగే ట్రాజన్ నగరాన్ని గెలవటానికి ట్రాజన్ గుఱ్ఱం అన్నేది కుట్రపూరితమైన చర్య. అది కూడా ఎన్నో విఫల యత్నాల తర్వాత. చివరి రోజు రాత్రి దాని ద్వారా యుద్ధం చేస్తారు. (1)
క్రీ.పూ.300 వ చెందిన మెగస్థీనిస్, శ్రీ కృష్ణ కథలను గ్రీకుకు తీసుకువెళ్ళాడని, ఆయన్ను హెర్క్యులస్ అని పిలిచాడని, అలా కృష్ణుడు హెర్క్యులస్‌గా గ్రీకు సాహిత్యంలో చేరాడని చెప్తారు. మెగస్థీనిస్ భారతదేశమంతా పర్యటించి, అతను చూసినవి, విన్నవి 'ఇండికా' అనే తన గ్రంథంలో రాసుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఆయన ఇలా చెప్పుకున్నాడు, శౌరశేనోయి అనే భారతీయ తెగ ప్రత్యేకించి హెర్క్యులస్‌ని పూజించేది, మరియు వారికి రెండు నగరాలున్నాయి, మెథోర, క్లేసిబొర, నౌకయానానికి వీలుగా ఉన్న జొబరెస్ అనే నది.

గ్రీకులకు సంస్కృతం పలకడంలో అస్పష్టత కారణంగా తప్పుగా పేరలను పలికాడని అనేకమంది పండితులు పేర్కొన్నారు. ఎడ్విన్ ఫ్రాన్సిస్ బ్రయంట్ ఏమంటారంటే 'శౌరశేనోయి అనగా కృష్నునికి చెందిన యాదవ వంశపు శూరశేనులు, హెర్కులస్ అనేది హరే కృష్ణకు అపభ్రంశ పదం, మెథోర అనేది శ్రీ కృష్ణ జన్మస్థానమైన మధుర, క్లేసిబొర అనేది కృష్ణ పురం, జోబరెస్ అనేది యమునా నదికి అపభ్రంశం. (2)

To be continued .............



2 comments: