Sunday 5 February 2017

హిందూ ధర్మం - 236 (గ్రీకు సాహిత్యంలో వైదిక ధర్మం)



గ్రీకు పండితుడు సెక్యులస్ అంటాడు, 'పోలిబ్రోత (పాటలిపుత్ర, ఈనాటి పాట్నా) నగరం శాండ్రకోటస్‌కు (చంద్రగుప్త మౌర్యునికి గ్రీకులు పెట్టిన పేరు) 138 తరాల ముందు హెర్కులస్ (శ్రీ కృష్ణుడు) స్థాపించాడు'. దీనిని అనుసరించి కృష్ణుడు క్రీస్తు పూర్వం 3300 కాలమానికి చెందినవాడని గ్రహించవచ్చు.

కృష్ణుడి జీవితంలో జరిగిన సంఘటనలనే గ్రీకులు తీసుకుని, తమకు అనుగుణంగా కధలు రాసుకున్నారు. అందులో కొన్ని;
కృష్ణుడు కాళీయ మర్దనం చేసి, కాళింగుడనే సర్పం యొక్క అహంకారాన్ని అణిచివేస్తాడు. దాన్ని చంపకుండా వదిలేసి, యమునను విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. అలగే హెర్కులస్ కూడా హైడ్రా అనే సర్పాన్ని చంపకుండా, దాని నెత్తి మీద పెద్ద బండరాయిని పెడతాడు.

కృష్ణుడు పక్షి రూపంలో వచ్చిన బకాసురిని చంపుతాడు. హెర్కులస్ కూడా రాకాసి పక్షులను మట్టుపెడతాడు.
కృష్ణుడు అరిష్టాసురుడనే ఎద్దును వధిస్తాడు, హెర్కులస్ క్రెటన్ అనే ఎద్దును వధిస్తాడు.
రాక్షసుడు కేశి అనే పేరుతో గుఱ్ఱం రూపంలో రాగా, దాన్ని మట్టు పెడతాడు కృష్ణ పరమాత్ముడు. హెర్కులస్ జీవితంలో కూడా ఈ ఘటన చూపిస్తారు.

కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని గోవులను, గోపాలకులను, వారి పరివారాలను రక్షిస్తాడు. దీన్నే గ్రీకులు హెర్కులస్ భూమిని మోసినట్లుగా చూపించారు.

దేవకీ దేవి 8 వ గర్భంలో జన్మించే పిల్లవాడు తనకు మృత్యువని, అతడి పట్ల శత్రుత్వం పెంచుకుంటాడు మేనమామ అయిన కంసుడు. కృష్ణుడిని చంపటానికి ఎంతో మంది రాక్షసులను పంపుతాడు. పిల్లలకు విషమున్న పాలిచ్చి చంపమని పూతనను పంపుతాడు. సరిగ్గా అటువంటిదే హెర్కులస్ జీవితంలో కూడా జరుగుతుంది. అతడి సవతి తల్లి హీరా, అతడిని చంపమని రెండు విష సర్పాలను పంపుతుంది.

ఇలా గ్రీకుల నోట సనాతన సంస్కృతికి చెందిన విషయాలు ఆ కాలంలోనే పశ్చిమాన వినిపించాయి. అయితే ఇవన్నీ చూపి, మనమే గ్రీకుల నుంచి అన్నీ కాపీ కొట్టామని, మనవన్నీ కల్పితాలని, మనకంటూ ఏదీ లేదని మన దేశపు కుహనా- మేధావులు, మతమార్పిడి వెధవులు చెప్తారు. కధలను కాపీ కొట్టామని వారు వాదించవచ్చు, కానీ కృష్ణుడు ఏలైన ద్వారక ఈ నాటికి భారతదేశంలో పశ్చిమాన ఉన్న గుజరాత తీరంలో, అరేబియా సాగర గర్భంలో ఉన్నది. దాని మీద పురావస్తు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. దేశవిదేశాల్లో ఉన్న ఎందరో శాస్త్రవేత్తలు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఆ ద్వారకను కూడా కాపీ కొట్టామంటారా ఈ మేధావులు? మనమే ఓ నగరం కట్టి సముద్రంలో ముంచేశామని చెప్పుకొస్తారా? మన దేశంలో పరీక్షిత్తు మహారాజు జరిపిన సర్పయాగానికి సంబంధించి దొరికిన ఆనవాళ్ళు, ఇతర రాజులు వేసిన తామ్ర శాసనాలు ఆకాశం నుంచు ఊడిపడ్డాయని చెప్తారా? (ఈ శాసనాల గురించి, ద్వారక గురించి ఇదే శీర్షికన 138 నుంచి వరుసగా 142 వరకు ప్రచురించడం జరిగింది. అది చూడగలరు.)

క్రీ.పూ. 190-188 మధ్య అగాతోక్లస్ ఆఫ్ఘనిస్థాన్ లో  అనే ప్రాంతాన్ని పాలించాడు. అతడు చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే కొన్ని బంగారు, వెండి, కంచు నాణేలను ముంద్రించాడు. వాటిపై శివ, విష్ణు, బలరామ, బుద్ధుడి ముద్రలు ఉన్నాయి. వీటి మీద బ్రాహ్మీ లిపిలో ఇవి రాజు అగాతోక్లయసకు చెందినవని ఉంది. 180 కాలానికి చెందిన డేటింగ్ లో నిర్ధారించబడిన చత్రురస్రాకార నాణేలు ఈ మధ్యే ఆఫ్ఘనిస్తాన్ తవ్వకాల్లో బయటపడ్డాయి. అందులో ఒకవైపు బలరాముడు, ఇంకో వైపు కృష్ణుడు ముద్రించబడి ఉన్నారు. దీన్ని బట్టి అంతకు పూర్వమే ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లలో కృష్ణుడి ఆరాధన ఉండేదని తెలుస్తున్నది.

గ్రీకు రాయబారి హెలియోడొర్స్‌కు కృష్ణుడంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన గరుడ ద్వజాలు పాతించాడు. అందులో తనకు కృష్ణుడంటే ఇష్టమని, తాను భగవతుడినని, సనాతన ధర్మాన్ని అవలంభిస్తున్నానని, భాగభద్రుడు ఆస్థానికి వచ్చానని శాసనం వేయించుకున్నాడు. అది క్రీ.పూ.113 కు చెందినది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉంది.

చంద్రగుప్త మౌర్యుడు ఆశోకుని తాత. ఆయన ఒక యుద్ధంలో గ్రీకు పాలకుడైన సెక్యులస్‌ను ఓడించాడు. ఆ తర్వాత సెక్యులస్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. దీనివలన భారతదేశం యొక్క ప్రభావం అతిదూరాన ఉన్న గ్రీకుపై కూడా బలంగా పడింది.

భారత్, గ్రీకు నుంచి ఏమీ తీసుకోలేదని, గ్రీకుకే జ్ఞానదానం చేసిందని చెప్పడానికి ఇలా చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు తారపడతాయి.

To be continued ........

Source: http://experiencehinduism.com/interesting-stories/heracles-derived-from-krishna

1 comment: