Monday 16 August 2021

శ్రీ హనుమద్భాగవతము (12)



యౌవనమంతా గడచిపోయి వార్థక్యము వచ్చినా తనకు ఎలాంటి సంతానము కలుగకుండుటచే రఘుకులశిరోమణి ఐన దశరథమహారాజు చింతామగ్నుడయ్యాడు. ఆయన వశిష్ఠుని ఆదేశాన్ని అనుసరించి ఋష్యశృంగ మహర్షిచే 'పుత్రకామేష్టి' అనే యజ్ఞము చేయించాడు. ఋషి భక్తితో హోమము చేశాడు. ప్రసన్నుడై అగ్ని దేవుడు చరువు (హవిష్యాన్నము, పాయసము) ను తీసుకుని ప్రత్యక్షమై 'రాజా ! నీ కార్యము సిద్ధించినది. నీవీ పాయసమును రాణులకు పంచు' అని పలికి అంతర్ధానమయ్యాడు.


దశరథుడు పాయసములోని సగ భాగాన్ని తన పెద్ద భార్య అయిన కౌసల్యా దేవికి ఇచ్చాడు, మిగిలిన సగాన్ని రెండుభాగాలుగా చేశాడు. వాటిలో ఒక భాగాన్ని కైకేయికి ఇచ్చాడు. మిగిలిన దానిని రెండుభాగాలుగా చేసి కౌసల్యా కైకేయిల చేతులలో ఉంచి వారిని సంతోషపరిచాడు. అనగా వారి అనుమతిను తీసుకుని సుమిత్రకు ఇచ్చాడు.


కైకేయి పాయసమును చేతిలో ఉన్చుకొని ఆలోచించసాగింది. ఇంతలో ఒక గ్రద్ద ఆకాశమునుండి వేగముగా వచ్చి ఆమె చేతిలోని పాయస భాగాన్ని ముక్కున బట్టుకొని ఎగిరిపోయింది.


కైకేయి కలత చెందింది. అపుడు దశరథుని ప్రేరణనను అనుసరించి కౌసల్యా సుమిత్రలు తమ దగ్గర ఉన్న పాయసములోని కొంత భాగాన్ని కైకేయికి ఇచ్చారు. ముగ్గురు రాణులు గర్భములు దాల్చారు. కౌసల్యకు శ్రీరామచంద్రుడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణశతృఘ్నులు జన్మించారు.

వానర రాజైన కేసరి తన సహధర్మచారియైన అంజనా దేవితో కలసి సుమేరుపర్వతముపై నివసించుచున్నాడు. అంజన పుత్రప్రాప్తికై ఏడు వేల సంవత్సరములు ఉమానాథుని ఉపాసించింది. శివుడు ప్రసన్నుడై 'వరమడుగా మని అంజనతో పలికాడు.

No comments:

Post a Comment