Tuesday 31 August 2021

శ్రీ హనుమద్భాగవతము (28)



ఋషులు శాపము


బాలుడైన హనుమంతుడు మిక్కిలి చంచలుడు, అల్లరివాడు, పైగా ప్రళయంకరుడైన శంకరుని అవతారము, కపిశాబకము, అదీగాక ఎంతోమంది దేవతలచే అమోఘమైన వరాలను పొన్దినవాడు. ఇతని అల్లరికి తల్లిదండ్రులు ఎంతో ప్రసన్నులవుతున్నారు. సింహము తోకను ప్ట్టుకొని దానిని నలువైపుల త్రిప్పుట, ఏనుగును పరీక్షించుట అనే పనులు తఱుచుగా అతని నిత్యక్రీడలైనాయి. ఒక్కొక్కప్పుడతడు పెద్ద పెద్ద చెట్లను సమూలముగ పెఱికి వేసేవాడు, ఇతనికి తెలియని, ఎక్కని పర్వత శిఖరం ఏదీ లేదు. దుర్గమములైన వనములను, పర్వతములను సంపూర్ణముగా ఇతడు చూసి ఉన్నాడు.


వన్యప్రాణులకి ఇతడంటే భయము, కాని అవి మనస్సులో అతనిని ప్రేమించుచుండేవి. ఇతడు సర్వప్రాణులకు -- మిత్రుడు, రక్షకుడై ఉన్నాడు. బలవంతుడు ఎవ్వడైనా బలహీనుని బాధిస్తే బాలుడైన హనుమంతుడు ఊరకునేవాడు కాదు. ఇతడొక చెట్టు నుండి మఱియొక చెట్టు పైకి దూకుతు కొన్ని ఆమడల దూరము వెళ్ళేవాడు. తన బరువుచే ఏ చెట్టు కొమ్మయైన విరుగుతుందని సందేహము గలిగితే వెంటనే అతడు తేలికగా మారేవాడు.


వరముల వలన గలిగిన శక్తితో హనుమానుడు ఋషుల ఆశ్రమములలోనికి వెళ్ళేవాడు. అచట వారికి కష్టమును కలిగించే పనుల చేస్తుండేవడు. ఒక ఋషి ఆసనమును మఱియొక ఋషి సమీపమున ఉంచేవాడు. ఒకని మృగచర్మాన్ని కప్పుకొని చెట్టుపైకి ఎగిరేవాడు, లేదా దానిని అక్కడే వ్రేలాడ వేసేవాడు. ఒకరి క్మండలములోని నీరును పారబోసేవాడు, మఱియొకరి కమండలం పగులగొట్టేవాడులేదా నీటిలో పారబోసేవాడు.  


హనుమంతుడు జపము చేసుకుని మునుల ఒడులలో కూర్చున్నవాడు. అహింసాపరాయణులైన ముని ధ్యానస్థుడై 'జపం చేసుకొనుచుండగా ఇతడు ఆయన గడ్డమును లాగి పారిపోయేవాడు. ఒకరి కోపీనాన్ని, మఱియొకరి పారాయణ గ్రంథమును పండ్లతోను, చేతులతోను పట్టుకొని అటు ఇటు విసరి వేసేవాడు. స్రుక్సువాదులను విఱుగగొట్టును, మహాత్ముల యజ్ఞపాత్రలను పగులగొట్టేవాడు. కష్టముతో సంపాదించుకొన్న నారచీరలను చింపిపార వేసేవాడు. బ్రహ్మాది దేవతలు వరములిచ్చి ఉండటంతో ఋషులు బాలహనుమానుని ఏమీ అనలేక మిన్నకున్నారు, కాని అతని బాధలను మాత్రము తట్టుకొన లేకపోయేవారు. తమ మూఢాచారాలను ఖండించటం కోసం ఆంజనేయుడట్లొనఱిన్చినాడని ఋషులు తెలుసుకొన లేకపోయారు. 

No comments:

Post a Comment