Tuesday, 5 January 2016

మిమ్మల్ని మీరు మార్చుకోండి - చిన్న కధ - సద్గురు జగ్గీ వాసుదేవ్

శంకరన్ పిళ్ళై ఉద్యోగార్ధం అరేబియా దేశం వెళ్ళాడు. రాజుగారికి క్షవరం చేసే పని దొరికింది.

జీతం మంచిది. శంకరన్ పిళ్ళై తను దాచిన మొత్తానికి బంగారం కొన్నాడు. అది ఒక బత్తాయిపండు సైజులో వుంది. దానిని తన క్షురకపెట్టేలో దాచాడు.
ఒకసారి రాజు క్షవరం చేయించుకుంటూ, అడిగాడు, "మన పాలనలో మనుషులేలాగున్నారు?" అని.

"బాదుషా, మీ పాలనకేం కొరత? ఒక్కోకడి దగ్గరా కనీసం బత్తాయంత బంగారం వుంది" అన్నాడు.

రాజు తన మంత్రికిది చెప్పి, సంతోషపడ్డాడు. "రేపు ఇదే ప్రశ్న శంకరన్ పిళ్ళైను అడిగి చూడండి" అన్నాడు.

ఆ రాత్రి శంకరన్ పిళ్ళై దాచిన బంగారాన్ని దొంగలించడానికి మంత్రి తగిన ఏర్పాట్లు చేశాడు. మర్నాడు శంకరన్ పిళ్ళైను రాజు అదే ప్రశ్న వేశాడు.
శంకరన్ పిళ్ళై ముఖం వేలాడబడింది. "చెప్తే తప్పుగా అనుకోరు కదా బాదుషా! మీ పాలనలో ఎక్కడ చూసినా దొంగతనం, కొల్లగొట్టడం, దారికాయడమే! కనీసం బత్తాయంత బంగారం కూడా దాచుకోలేకపోతున్నారు ప్రజలు" అంటూ బాధపడ్డాడు.

శంకరన్ పిళ్ళై తన పరిస్థితిని ఆధారంగా చేసుకుని, ఒక రాజ్యం స్థితిగతుల్ని లేక్కించినట్టే మీరూ, మిమ్మల్ని దృష్టిలో వుంచుకొని, చుట్టూ వున్న అందరి జీవితాలు నాశనమయ్యాయని తీర్పు చెప్తున్నారు.

ఆర్దికంగా వెనుకబడి వున్న మన దేశం ఊపందుకొని కదంతోక్కుతూ ముందంజ వేయడాన్ని మీరు రెండు చేతులూ జాచి ఆహ్వానించండి. ఈ పరిస్థితికి వ్యతిరేకమైన ఆలోచన కూడా మీ మనసులో రానియకండి.
మీ వసతిని తగ్గించారని, ఎవరినో ఏదో అనడం మానండి. అన్ని అయిపొయాయను కోవద్దు.

మీరు ఎదగడానికి, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. మార్పులకి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఏ క్షణమూ అలాగే వుండిపోదు, మార్పే జీవితానికందం. మార్పును మనసారా అంగీకరించడానికి తయారవకపోతే జీవితంలో బాధా, వేదనా మిగులుతాయంతే! మీరూ నేర్చుకోవలసిన ప్రాకృతిక రహస్యం ఇది.
------ సద్గురు జగ్గీ వాసుదేవ్ -----

Sent by Ashwin Kumar Dulluri

Sunday, 3 January 2016

హిందూ ధర్మం - 190 (గోవు ప్రాముఖ్యత - 2)

వేదాలు ఆవునెయ్యి, ఆవుపాలను అమృతం అన్నాయి. పసిపిల్లలకు తల్లిపాలు పట్టే పరిస్థితి లేనప్పుడు ఆవుపాలనే పడతారు. ఎందుకంటే ఆవుపాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండడమే కాక అవి తల్లి పాలతో సమానమైనవిగా పిల్లలపై పని చేస్తాయి. అందుకే ఆవును అమ్మగా భావిస్తారు. దేశీ ఆవుపాలను ఎ2 పాలుగా పరిగణిస్తారు. గోమాత అంటారు. ఇవి క్యాన్సర్ కలిగించే కణాలను నశింపజేస్తాయి, శరీరంలో కొవ్వు పేరుకోనివ్వవు, మంచి బలవర్ధకమైన, పోషక విలువలు కలిగిన ఆహారం. దేశీ గోవు వీపుపై నూపురం ఉంటుంది. ఇందులో సూర్యకేతు నాడి అనే ప్రత్యేకమైన నాడి ఒకటి ఉంటుంది. ఇది సూర్యుని సంబంధం కలిగి ఉండి, సూర్యుడి నుంచి వచ్చే శక్తిని నేరుగా  గ్రహిస్తుంది. ఆ కారణంగా ఆవుపాలు కొద్దిగా లేత బంగారు వర్ణం కూడా కలిగి ఉంటాయి. ఇది విటమిన్ డి దేహానికి అందిస్తుంది. ఈ సూర్యకేతు నాడి కేవలం భారతీయ గోసంతతికి మాత్రమే ఉంటుంది. ఆవుపాలు మేధో వృద్ధిని కలిగిస్తాయి. నిత్యం ఆవుపాలనే త్రాగడం, 3 జన్మల కాలం పట్టే జ్ఞానాన్ని కేవలం 30 ఏళ్ళలో పొందినట్టుగా హిమాలయల్ల వద్ద నివసిస్తున్న ఒక విదేశీయుడు వెళ్ళడించాడు. అది ఆవుపాలకున్న శక్తి.

పసిపిల్లలకు జ్వరాలు వచ్చినప్పుడు గోపుఛ్ఛాన్ని(ఆవు తోకను) వాళ్ళ చుట్టూ తిప్పుతారు. అలా చేయడం వలన పిల్లలపై పడిన చెడు దృష్టి తొలగిపోతుంది. ఆవును స్పృశించినప్పుడు అది మనలో ఉన్న నకారాత్మక శక్తి (Negative Energy) ని తీసుకుని, సకారత్మక శక్తి (Positive Energy) ని ప్రసాదిస్తుంది. అందుకే ప్రతి నిత్యం గోవును స్పృశించి, నమస్కరించి బయటకు వెళ్ళమంటారు. మనుష్యులలో ఉన్న నకారాత్మక శక్తిని ఏ ప్రతిఫలం ఆశించకుండా, రూపాయి ఖర్చు లేకుండా తీసుకునే ప్రాణి భారతీయ గోవు మాత్రమే. ఉదయం నిద్రలేచిన తర్వాత గోవును దర్శనం చేసుకున్నవారి రోజు ఎంతో ప్రశాంతంగా గడుస్తుందని అనేకుల నిత్య జీవితానుభవం.

ఈ ప్రపంచంలో ఏ జీవి మలం, మూత్రాదులైనా హానికారక క్రిములు కలిగి ఉంటాయి. కానీ ఒక్క గోమయం (ఆవుపేడ), గోపంచకం (మూత్రం) మాత్రమే మిత్రజీవాలను, ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వాటికి ఎనలేని పవిత్రత ఉంది. అందుచేతనే ఇంటిని గోపంచకంతో సంప్రోక్షణ చేస్తారు. దాని వలన పవిత్రత కలగడమే కాక, క్రిమి సంహారం కూడా జరుగుతుంది. ఆవుపేడను ఇళ్ళకు అలకడం అందరికీ విదితమే. ఇప్పటీ ఈ ఆచారం పల్లెల్లో ఉంది.

1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ గారు రుజువు చేసారు. జెర్శీ ఆవుకు , దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయని కూడా ఈయన రుజువు చేసారు. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవని అయన రుజువు చేసారు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు , హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. జెర్సీఆవు 1 గ్రాము పేడలో 70 లక్షల హానికారక సూక్ష్మక్రిములు ఉన్నాయి. మిత్రక్రిములంటే భూమికి, మనిషికి, ప్రకృతికి మేలు చేకూర్చేవి. మనిషి శరీరంలో కూడా కొన్ని మిత్రక్రిములుంటాయి. పేగులు ఉంటూ, జీర్ణవ్యవస్థలో ప్రధానపాత్ర పోషిస్తాయి. యాంటి-బయాటిక్స్ అధికంగా సేవించడం వలన ఇవి నశించి, ఉదర, పేగు సంబంధిత రోగాలు వస్తాయి. అట్లాగే దేశీ ఆవుపేడలో ఉండే మిత్రజీవాలు కూడా అందరికి మేలు చేస్తాయి. జీవరాశి నుంచి వెలువడిన మలం అత్యంత రోగకారమైందిగా ఉంటుంది. కానీ దేశీ ఆవు పేడ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అది ఆరోగ్యానికి హేతువు.  

To be continued ...............

Saturday, 2 January 2016

స్వామి శివానంద సూక్తి

Prarabdha is Purushartha of last birth. You sow an action and reap a habit; a habit sown results in character. You sow a character and reap a destiny. Man is the master of his own destiny. You yourself make, by the power of your thought, your destiny. You can undo it if you like. All faculties, energies and powers are latent in you. Unfold them, and become free and great.  - Swami Sivananda


Friday, 1 January 2016

శ్రీ శారదమాత జన్మతిధి

తిధి ప్రకారం నేడు శ్రీ శారదమాత పుట్టినరోజు. శ్రీ రామకృష్ణ పరమహంస గారి పత్ని అయిన శ్రీ శారదామాత సాక్షాత్తు కాళీ స్వరూపం. స్వామి సత్స్వరూపానంద మొదలైన అనేకమందికి అమ్మ కాళీ మాతగా దర్శనమిచ్చారు. అయినప్పటికి సాధారణ మహిళ వలనే జీవితం గడిపారు. రామకృష్ణుల భక్తులకు అన్నం వండడం కోసం కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని వంట చేసేవారు, కళ్ళు మండుతున్నా, పొగ గొట్టంతో ఊది త్వరగా వంట సిద్ధం చేసేవారు. భక్తుల బట్టలు ఉతికేవారు. ఇలా అమ్మ చేయని పనిలేదు. అటువంటి శారదామాత అనుగ్రహం మన అందరిపై ప్రసరించాలి.

ఓం యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః