Sunday 3 January 2016

హిందూ ధర్మం - 190 (గోవు ప్రాముఖ్యత - 2)

వేదాలు ఆవునెయ్యి, ఆవుపాలను అమృతం అన్నాయి. పసిపిల్లలకు తల్లిపాలు పట్టే పరిస్థితి లేనప్పుడు ఆవుపాలనే పడతారు. ఎందుకంటే ఆవుపాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండడమే కాక అవి తల్లి పాలతో సమానమైనవిగా పిల్లలపై పని చేస్తాయి. అందుకే ఆవును అమ్మగా భావిస్తారు. దేశీ ఆవుపాలను ఎ2 పాలుగా పరిగణిస్తారు. గోమాత అంటారు. ఇవి క్యాన్సర్ కలిగించే కణాలను నశింపజేస్తాయి, శరీరంలో కొవ్వు పేరుకోనివ్వవు, మంచి బలవర్ధకమైన, పోషక విలువలు కలిగిన ఆహారం. దేశీ గోవు వీపుపై నూపురం ఉంటుంది. ఇందులో సూర్యకేతు నాడి అనే ప్రత్యేకమైన నాడి ఒకటి ఉంటుంది. ఇది సూర్యుని సంబంధం కలిగి ఉండి, సూర్యుడి నుంచి వచ్చే శక్తిని నేరుగా  గ్రహిస్తుంది. ఆ కారణంగా ఆవుపాలు కొద్దిగా లేత బంగారు వర్ణం కూడా కలిగి ఉంటాయి. ఇది విటమిన్ డి దేహానికి అందిస్తుంది. ఈ సూర్యకేతు నాడి కేవలం భారతీయ గోసంతతికి మాత్రమే ఉంటుంది. ఆవుపాలు మేధో వృద్ధిని కలిగిస్తాయి. నిత్యం ఆవుపాలనే త్రాగడం, 3 జన్మల కాలం పట్టే జ్ఞానాన్ని కేవలం 30 ఏళ్ళలో పొందినట్టుగా హిమాలయల్ల వద్ద నివసిస్తున్న ఒక విదేశీయుడు వెళ్ళడించాడు. అది ఆవుపాలకున్న శక్తి.

పసిపిల్లలకు జ్వరాలు వచ్చినప్పుడు గోపుఛ్ఛాన్ని(ఆవు తోకను) వాళ్ళ చుట్టూ తిప్పుతారు. అలా చేయడం వలన పిల్లలపై పడిన చెడు దృష్టి తొలగిపోతుంది. ఆవును స్పృశించినప్పుడు అది మనలో ఉన్న నకారాత్మక శక్తి (Negative Energy) ని తీసుకుని, సకారత్మక శక్తి (Positive Energy) ని ప్రసాదిస్తుంది. అందుకే ప్రతి నిత్యం గోవును స్పృశించి, నమస్కరించి బయటకు వెళ్ళమంటారు. మనుష్యులలో ఉన్న నకారాత్మక శక్తిని ఏ ప్రతిఫలం ఆశించకుండా, రూపాయి ఖర్చు లేకుండా తీసుకునే ప్రాణి భారతీయ గోవు మాత్రమే. ఉదయం నిద్రలేచిన తర్వాత గోవును దర్శనం చేసుకున్నవారి రోజు ఎంతో ప్రశాంతంగా గడుస్తుందని అనేకుల నిత్య జీవితానుభవం.

ఈ ప్రపంచంలో ఏ జీవి మలం, మూత్రాదులైనా హానికారక క్రిములు కలిగి ఉంటాయి. కానీ ఒక్క గోమయం (ఆవుపేడ), గోపంచకం (మూత్రం) మాత్రమే మిత్రజీవాలను, ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వాటికి ఎనలేని పవిత్రత ఉంది. అందుచేతనే ఇంటిని గోపంచకంతో సంప్రోక్షణ చేస్తారు. దాని వలన పవిత్రత కలగడమే కాక, క్రిమి సంహారం కూడా జరుగుతుంది. ఆవుపేడను ఇళ్ళకు అలకడం అందరికీ విదితమే. ఇప్పటీ ఈ ఆచారం పల్లెల్లో ఉంది.

1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ గారు రుజువు చేసారు. జెర్శీ ఆవుకు , దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయని కూడా ఈయన రుజువు చేసారు. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవని అయన రుజువు చేసారు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు , హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. జెర్సీఆవు 1 గ్రాము పేడలో 70 లక్షల హానికారక సూక్ష్మక్రిములు ఉన్నాయి. మిత్రక్రిములంటే భూమికి, మనిషికి, ప్రకృతికి మేలు చేకూర్చేవి. మనిషి శరీరంలో కూడా కొన్ని మిత్రక్రిములుంటాయి. పేగులు ఉంటూ, జీర్ణవ్యవస్థలో ప్రధానపాత్ర పోషిస్తాయి. యాంటి-బయాటిక్స్ అధికంగా సేవించడం వలన ఇవి నశించి, ఉదర, పేగు సంబంధిత రోగాలు వస్తాయి. అట్లాగే దేశీ ఆవుపేడలో ఉండే మిత్రజీవాలు కూడా అందరికి మేలు చేస్తాయి. జీవరాశి నుంచి వెలువడిన మలం అత్యంత రోగకారమైందిగా ఉంటుంది. కానీ దేశీ ఆవు పేడ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అది ఆరోగ్యానికి హేతువు.  

To be continued ...............

1 comment:

  1. మీ బ్లాగుకు బ్లాగ్ వేదిక లోగో జతపర్చి సహకరించగలరు.
    http://blogvedika.blogspot.in/

    ReplyDelete