Thursday, 7 May 2020

పుస్తకపఠనం గురించి భగవాన్ రమణ మహర్షి



Reading of Sastras and becoming pandits may give fame to a person but they destroy the peace of mind which is necessary for the seeker of truth and deliverance. A Mumukshu (a seeker of deliverance) should understand the essence of the Sastras but should give up the reading of Sastras as that is inimical to dhyana (meditation). It is like accepting the grain and discarding the chaff. There will be many big almirahs with many books. How many of them can be read? There are so many books and religions that one life is not enough to read all the books relating to even one religion. Where then is the time for practice? The more you read, the more you feel like reading further. The result of all that is to go on discussing with other people who have books and spend time thus, but
that will not lead to deliverance.

- Bhagavan Ramana Maharshi

Wednesday, 6 May 2020

స్వామి శివానంద సూక్తి



When all kinds of useless thoughts and emotions trouble you much, be indifferent (Udasina). Say to yourself: “Who am I?” Feel: “I am not the mind. I am the Atman, the allpervading Spirit, Suddha Satchidananda. How can emotions affect me? I am Nirlipta, unattached; I am Sakshi, witness of these emotions. Nothing can disturb me.” When you repeat these suggestions of Vichara or Vedantic reflection, the thoughts and emotions will die by themselves.

- Swami Sivananda

Monday, 4 May 2020

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (13) - తోలు వస్తువులు

మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (13)

ఇప్పుడు మనమంతా కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో తోలు (లెధర్) వాడకాన్ని తగ్గించాము, లేదా ఆపివేశాము. అసలు ముందు లెధర్ ఎలా తయారవుతుందో తెలుసుకుని, అప్పుడు మన సంస్కృతిలో దాని స్థానం ఏంటో చూద్దాము.

లెధర్ పరిశ్రమలో తోలు కోసం పంది, పాము, మేక, గేదె, మొసలి, ఆవు, కంగారు మొదలైన అనేక జంతువులు వధించబడతాయి. కానీ తోలు కోసం అత్యధికంగా వధించబడేది ఆవు. ఇది అందరూ అంగీకరించే సత్యము. ఒక్క అమెరికాలోనే ఏటా తోలు కోసం 13.9 కోట్ల అవులు, దూడలు, మేకలు, గొఱ్ఱెలు వధించబడతాయి.

గోవు నుంచి తోలు తీసే ప్రక్రియ మీకు తెలుసా?

గోవులను నీటిలో శుభ్రం చేసే నీటి పంపుల వద్దకు తెస్తారు. శుభ్రం చేసే సమయంలో నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. బయట 40 డిగ్రీలు ఉంటేనే తట్టుకోలేకపోతున్నాము. మరి దానికి 5 రెట్లు వేడి. ఇంతటి ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని గోవులపై ధారగా పోస్తారు. ఈ విధంగా చేసినందువల్ల వీటి చర్మం నునుపెక్కి వొలచటానికి సులభమౌతుంది. కానీ, ఈ సమయంలో అవి (గోవులు) ఎంతో భయంతో బిక్కచచ్చిపోయి ఉండే హృదయ విదారకమైనస్థితి. గోవుగా ఎందుకు పుట్టామా అన్నట్టు, ఇంకా ప్రాణం ఎందుకు పోలేదని రోధిస్తున్న వైనం... భూమి మీద జాలి, దయ, కరుణ అన్నవి మృగ్యమైపోయిన వైనం...రాక్షసత్వానికి పరాకాష్ట.

ఆ తర్వాత గొలుసులతో ఉన్న కొక్కాలకు ఒక్కొక్క గోవును తలక్రిందులుగా ఒక్కొక్క కాలుని ఆ కొక్కాలకు తగిలించి వేలాడదీస్తారు. రక్తం ఏకధాటిగా ఏరులై పారుతున్నా గోవు పూర్తిగా చనిపోదు. గోవులను పూర్తిగా చంపిన తర్వాత వాటి చర్మము ఉబ్బి గట్టిపడుతుంది. అటువంటి చర్మము మార్కెట్టులో తక్కువ ధర పలుకుతుంది. కాని ప్రాణమున్నప్పుడే వొలిచిన గోవుల చర్మము చాలా పలుచనగా ఉండటమే కాదు, వాటి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్టులో అత్యంత ఎక్కువ ధర పలుకుతుంది. ఒకప్రక్క గోవుల మెడలు సగం తెగి రక్తం కారుతుంటే, మరొకప్రక్క గోవుల కడుపులో రంధ్రం చేసి, అందులోకి అతివేగంగా గాలిని జొప్పిస్తారు. అప్పటికి గాని గోవు లోపలి భాగాలు ఉబ్బి, చర్మం వొలవటం అనే పక్రియ సులభతరం కాదు. చర్మం పూర్తిగా వొలిచిన తర్వాత బ్రతికి ఉన్న ఆ గోవులను నాలుగు భాగాలుగా (తల, కాళ్లు, మధ్యభాగము, తోక) ముక్కలు చేస్తారు. అప్పుడు వాటి మాంసాన్ని ప్రాసెస్ చేస్తారు.

పాములను చంపి తోలు తీసే ప్రక్రియ - బ్రతికి ఉన్న పామును చెట్టుకు మేకుతో కొట్టి, శరీరం మీద చర్మాన్ని నిలువునా వొలిచేస్తారు.

గర్భం ధరించిన ఆవులు, ఆడగొఱ్ఱెల కడుపులో ఉండే దూడల చర్మం 'విలాసం' (luxury leather item) గా చెప్పబడుతోంది. అందుకే అనేక ఆవులు మరియు గొఱ్ఱెలకు కృతిమ గర్భధారణ చేయించి, కావాలని గర్భవిచ్ఛితి (అబార్షన్) చేస్తారు.

తోలు కోసం ప్రత్యేకమైన ప్రదేశాల్లో మొసళ్ళను పెంచుతారు. వాటి జీవితకాలం ఎక్కువే అయినా, 2-4 ఏళ్ళు రాగానే వాటిని వధశాలకు పంపిస్తారు. అవి బ్రతికి ఉండగానే వాటిని సుత్తి, గొడ్డలి వంటి వాటితో కొట్టి కొట్టి చంపుతారు. చాలా సందర్భాల్లో సజీవంగానే వాటి తోలు ఒలుస్తారు. ఆ తర్వాత అవి చాలా సమయం వేదన అనుభవించి మరణిస్తాయి.

ప్రపంచంలో ఈరోజు అధిక హింసను ప్రేరేపించే పరిశ్రమల్లో డైరి ఒకటి. ఎప్పుడైతే ఆవు వట్టిపోతుందో (పాలు ఇవ్వడం ఆపివేస్తుందో) అప్పుడు దాన్ని వధశాలకు తరలిస్తారు. చాలా సందర్భాల్లో డైరీ పరిశ్రమలో ఆవుకు ఆడదూడ పుడితే దాన్ని రక్షిస్తారు. అదే కోడె దూడ పుడితే, దాన్ని మరుక్షణమే వధశాలకు పంపుతారు. అప్పుడే పుట్టిన లేగదూడల మాంసానికి, వాటి తోలుకు ఉన్న డిమాండే దీనికి కారణం. కొన్ని సందర్భాల్లో వీటి మాంసాన్ని చాక్లెట్స్‌లో కలుపుతారట.  మనం ఇప్పుడు వ్యవసాయంలో ఎద్దుకు బదులు కాలుష్యం విడుదల చేసే ట్రాక్టర్ వాడుతున్నాము. కనుక ఎడ్ల అవసరం తగ్గింది, ఇక ఎడ్లను ఎవరు పెంచుతారు? ఎడ్ల వధకు ఇది కూడా ఒక కారణం.

ఇలా మనకు తోలు ఉత్పత్తులు రావాలంటే దాని వెనుక ఎంతో హింస ఉంటుంది. అలాంటి హింసతో కూడిన వస్తువులను ఆలయంలోకి తీసుకెళ్ళవచ్చా? అది మృతదేహం కాదా ? మన గోవును పూజిస్తాము, నాగదేవతను పూజిస్తాము, కాలభైరవుడిని పూజిస్తాము. మీరు వాడే తోలు వస్తువుల్లో గోవు, పాము, కుక్క తోలు ఉండదని మీకు ఖచ్ఛితంగా చెప్పగలరా ? లేదు కదా ! తోలు వస్తువులను వాడటమంటే జంతువధను సమర్ధించడం కాదా ? గోహత్యా పాతకం సంగతేంటి? 

ఒకప్పుడు మనవాళ్ళు తోలు చెప్పులను వాడేవారు వేరే ప్రత్యామ్నాయం లేక. అప్పటికీ శుభాశుభకార్యాల్లో ఎక్కడా చెప్పులు వేసుకోరు. చెప్పులు వేసుకుని వెళ్ళవద్దనే చెప్పారు. కానీ ఈరోజు మనం వాడే సెల్ఫ్‌ఫోన్ కవర్, బెల్ట్, పర్సు, హ్యాండ్ బ్యాగ్ మొదలుకుని ఇంట్లో ఉపయోగించే సోఫాల వరకు విలాసం, పరపతి పేరుతో తోలు వస్తువులు వాడుతున్నాము. దేవతలు ఆవాహన చేసిన ఆలయాలు, యజ్ఞయాగాదుల వంటివి జరిగే పవిత్ర ప్రదేశాలకు అలాంటివి ధరించి, తీసుకుని వెళ్ళడం ఎంతవరకు సమంజసం? తోలు ఉత్పత్తులను ప్రోత్సహించడమంటే హింసను సమర్ధించడమే. ఇప్పుడు తోలు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలు వచ్చాయి. వాటిని వాడవచ్చు కదా. ఆలోచించండి.

For more information :
https://www.peta.org/issues/animals-used-for-clothing/animals-used-clothing-factsheets/leather-animals-abused-killed-skins/
http://thegreenvegans.com/why-leather-is-one-of-the-most-polluting-and-cruel-products/
https://www.bornfreeusa.org/2002/09/15/slaughtered_and_skinned/

Sunday, 3 May 2020

ఆయుర్వేదం - ఆహారం స్వీకరించే పద్ధతి



మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (12) 

ఆయుర్వేదం  - ఆహారం స్వీకరించే పద్ధతి 

మన ఆచారవ్యవహారాలను తులనాడటం చాలా సులభం. నోటికి ఏది వస్తే అది అది అనచ్చు. కానీ వాటి వెనుకనున్న శాస్త్రీయతను అర్ధం చేసుకుంటే వాటిని నెత్తిన పెట్టుకుంటాము. అవి ఆచరణలోకి రావడానికి ఎంత సమయం పట్టి ఉంటుందో, కాలక్రమంలో వాటి మీద ఎంత పరిశోధన జరిగి ఉంటుందో ఆలోచిస్తే మతిపోతుంది.

ముందు మజ్జిగన్నం లేదా పెరుగున్నం తిని, ఆ తర్వాత సాంబారు, చివరలో కూర, పచ్చడి కలుపుకుని తినకూడదా? ఈ సందేహం మీకు ఎప్పుడూ రాలేదా? ఏ ఆహారం ఎలా, ఎప్పుడు స్వీకరించాలి అనేది ఆయుర్వేదం చెబుతుంది. ఆకలి కలిగినప్పుడు కడుపులో ఉదజహరికామ్లము (హైడ్రోక్లోరిక్‌ యాసిడ్) ఉత్పన్నమై, ఆహారన్ని పచనం చేయడానికి సిద్ధమవుతుంది. ముందుగా గట్టిగా ఉన్న పదార్ధాలను కలుపుకోవాలి, అంటే కూర, పొడి వంటివి. ఎందుకంటే ఈ ఉదజహరికామ్లము మనం తినే ఆహారాన్ని పచనం (అరిగిస్తూ) పలుచన (dilute) అవుతుంది. కనుక మొదట కూరను కలుపుకుంటాము, పొడి ఎండు పదార్ధము కనుక దానిలో తేమశాతం తక్కువ గనక మొదటి ప్రాధాన్యం దానికి ఇచ్చారు. ఆ తర్వాత కూర, పప్పు. కూర కంటే పప్పు కొంచం పలుచగా ఉంటుంది (ఇక్కడ గోదావరి జిల్లాల వారైతే ముందు పప్పు, ఆ తర్వాత కూరా కలుపుకుంటారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారు ముందు కూర, ఆ తర్వాత పప్పు కలుపుకుంటారు. ఈ నాలుగుజిల్లాల వంట పద్ధతిలో స్వల్ప తేడాలు కూడా ఉంటాయి).  వీటి తర్వాత వచ్చేది సాంబారు లేదా పప్పుచారు. ఆ తర్వాత రసము, పాయసము, చివరలో మజ్జిగ. మజ్జిగ అనేది చాలా పలుచని పదార్ధము. అంటే నీ ఉదరంలో జీర్ణం చేసే ఆమ్లాలు పలుచున అవుతున్న కొద్దీ, నువ్వు స్వీకరించే ఆహారం పలుచున అవుతూ వస్తుంది.

దీని గురించి కంచి పరమాచార్య స్వామి వారు ఇలా అన్నారు - "విదేశాల్లో ఆహారం అనేది చివరలో ఫలాహారముతో ముగుస్తుంది, దాన్ని వాళ్ళు డెజెర్ట్స్ (desserts) అంటారు. దక్షిణభారత దేశంలోని ఆహారపద్ధతిలో, రసం కలుపుకుని తిన్న తర్వాత మొదటలో విస్తరిలో వడ్డించిన తీపి పదార్ధాలు తింటారు. ఆ తర్వాత చివరగా మజ్జిగను కలుపుకుంటారు. తీపి పదార్ధాలు మన పళ్ళకు (దంతములకు) హాని కలిగిస్తాయి. మజ్జిగ యొక్క రుచి పులుపు. చివరలో పులుపు మరియు ఉప్పు కలిగిన మజ్జిగను స్వీకరించడంవలన దంతాలకు బలం చేకూరుతుంది. ఈ పద్ధతిని అమెరికెన్ ఆహార శాస్త్రజ్ఞుడు సైతం కొనియాడారు. పంటినొప్పి వచ్చినప్పుడు వేడినీటితో పుక్కిలిస్తాము. విదేశీయులకు చిన్న వయస్సులోనే పంటి సమస్యలురాగా, మనకు మాత్రం జీవితాంతం వరకు బలమైన దంతాలు ఉండటంలో రహస్యం ఇదే."

అదేగాక ఆయుర్వేదంలో మజ్జిగ గుణాలను బాగా కొనియాడారు. మజ్జిగ అనేది ఆయుర్వేదంలో విషహారిణి. మనం తిన్న అన్నంలో ఏదైనా విషాలు కలిస్తే, వాటిని మజ్జిగ హరిస్తుంది. పైగా జీర్ణశక్తిని పెంచుతుంది. కొవ్వును తగ్గిస్తుంది. అందుకే మనము మజ్జిగతో ఆహారం ముగిస్తాము.

కేవలం ఒకే రకమైన ఆహారం - ఉదాహరణకు కేవలం పచ్చడి అన్న, కూర అన్నం, మజ్జిగ అన్నం - స్వీకరించమని ఆయుర్వేదం చెప్పదు గతి లేకపోతే తప్పించి. ఆహారంలో ఆరు రుచులు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆయుర్వేదం చెబుతుంది. కనుక ఎప్పుడైనా పిల్లలు అడిగితే, వారికి మన పూర్వీకులు అందించిన ఈ పద్ధతిని వివరించి, దాని వెనుకనున్న శాస్త్రీయతను చెప్పండి.

రాజీవ్ మల్హోత్రా గారి స్వల్పకాలిక course ద్వారా లాక్‌డౌన్ని సద్వినియోగపరుచుకోండి.


మన మీద యుద్ధం, కానీ శత్రువు కనిపించడు. ఆయుధం మన చేతికే ఇచ్చాడు. వాడు ఇచ్చిన ఆయుధాలతో మన మీద మనమే యుద్ధం చేసుకుంటున్నాము. తెలిసీతెలియక ధర్మాన్ని, దేశాన్ని కాపాడుతున్నామనుకునే వాళ్ళు సైతం, విచ్ఛినం చేసే ప్రయత్నాల్లో భాగవమవుతున్నారు. అవును మీరు చదివింది నిజమే.... ఇప్పుడు చాలామంది పరిస్థితి అలానే ఉంది.

యూరోపులో 16 వ శతాబ్దంలో మొదలైన భారతదేశ అధ్యయనం 19 వ శతాబ్దం నాటికి తన విషపడగ విప్పడం మొదలు పెట్టింది, భారతదేశాన్ని అస్థిరపరచడం, అసలు భారతదేశమే లేదని చెప్పడం, సనాతనధర్మాన్ని నశింపజేయడం, ధర్మంలోని అంశాలను క్రైస్తవీకరించడం, ప్రత్యేక అస్థిత్వవాదాలను ప్రోత్సహించడం, విఛ్ఛినకర సాహిత్యాన్ని అందించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్రం వచ్చే వరకు బ్రిటన్ కేంద్రంగా సాగిన ఈ కుట్ర, స్వాతంత్రానంతరం అమెరికా కేంద్రంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని అస్థిరపరచడంలో తమ వంతు ప్రణాలికలను పక్కగా అమలు చేసి చాలా వరకు విజయం సాధించాయి విఛ్ఛినకర శక్తులు. ఈ శక్తుల చేతిలో భారతీయులే పావులై దేశాన్ని విఛ్ఛినం చేయాలని కంకణం కట్టుకున్నారు. అటువంటి అనేక కుట్రలను బట్టబయలు చేసిందీ పుస్తకం. విఛ్ఛినకర శక్తులు ఏవీ? వాటికి ఎక్కడి నుంచి సహాయం అందుతుంది? అవి ఎలా పని చేస్తాయి? మనం వాటిని ఎలా అనుసరిస్తూ, మనకు తెలియకుండానే దేశానికి విఘాతం కలిగితున్నామో ఈ పుస్తకం చదివితే అర్దమవుతుంది. ఈ అంశంపై రాజీవ్ మల్హోత్రా (Rajiv Malhotra) గారు 15 ఏళ్ళు పరిశోధించి, వారి జీవితాన్ని పణంగా పెట్టి, అరవిందన్ నీలకందన్‌తో కలిసి కొద్ది సంవత్సరాల క్రితం Breaking India పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.. ఇప్పటికే పలు భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.. ఈ పుస్తకం తెలుగులో ‘భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు’ పేరుతో ఎమెస్కో వారు ప్రచురించారు.. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.. ప్రధాన పుస్తకాలయాలన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంది..

ఇప్పుడు భారతీయ యువత చదువుకున్నారు, వారు విఛ్ఛినకర శక్తులకు పావులుగా మారరు, వారు చాలా తెలివైనవారని లేదా భారతదేశాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవరెన్ని చేసినా ఈ దేశానికి ఏమీ కాదు లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. సమస్యను తెలుసుకోకుండా, దానికి తగిన విధంగా స్పందించకుండా, ఎవరికి తోచిన విధంగా వారు విమర్శలు చేయడాన్ని వెర్రితనం అంటారు. శరీరంలో జబ్బు ఉంది, అయినా అది లేదని, నాకేం కాదని దాటవేస్తూ కూర్చుంటే ఎప్పుడో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇది కూడా అంతే.

మరి మనకు కావల్సింది బౌద్ధిక క్షత్రియులు (intellectual kshatiryas). అందుకోసం ఈ లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ రాజీవ్ మల్హోత్రా గారి ఆలోచన. అందుకే బౌద్ధిక క్షత్రియ (intellectual kshatiryas) అనే స్వల్పకాలిక పాఠ్యక్రమాన్ని (short term course) ని రూపొందించారు. ₹ 500/- రూపాయల నామమాత్రపు ధరతో దీన్ని అందిస్తున్నారు. చివరలో సర్టిఫికెట్ కూడా అందిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి.

క్రింది పేర్కొన్న లింక్‌లో నమోదు చేసుకోవచ్చు.

Know what is happening in your own backyard by signing up for it today.



Friday, 1 May 2020

పని సంస్కృతి నేర్పిన భగవాన్ రమణ మహర్షి

భగవాన్ ప్రతీ రోజు తెల్లవారుఝామున 3 గంటలకు లేచి తమ కాల కృత్యాలు తీర్చుకున్నాక వంటగది లోకి వెళ్లి చట్నీ రుబ్బడం చేసేవారు ఉదయము అల్పాహారం కొరకు.

ఇలా రోజూ చేస్తుండడము వల్ల భగవాన్ చేతికి బొబ్బలు వచ్చినవి. ఇది గమనించిన విశ్వనాథ స్వామి అనే భక్తుడు ఎన్నో సార్లు భగవాన్ కి నచ్చ చెప్పేవారు చేతికి బొబ్బలు పెట్టుకుని ఇలా రుబ్బడము వంటి పనులు చేయవద్దు అని. కానీ భగవాన్ ఆ మాటలు లెక్క చేయకుండా రోజు వంట గదిలో ఈ చట్నీ రుబ్బడము చేసేవారు.

ఇంక ఇది చూడలేని విశ్వనాథ స్వామి ఒక రొజు భగవాన్ కంటే ముందే లేచి చట్నీ రుబ్బడము, మరియు భగవాన్ ఏయే పనులు చేసేవారో అవి అన్నీ పూర్తి చేసారు. వంట గది నుండి బయటికి రాగానే భగవాన్ ఎదురు పడి తన పనిని ఎందుకు చేసావు అని నిలదీశారు. దానికి విశ్వనాథ స్వామి కంట నీరు పెట్టుకుని "భగవాన్ మీరు బొబ్బలు ఎక్కిన చేతితో రుబ్బడము నేను చూడలేక పోతున్నాను" అన్నాడు .

అప్పుడు భగవాన్ అన్నారు "ఇంతకు ముందు నేను బిక్షకు వెళ్ళేవాడిని. ఇప్పుడు ఆశ్రమము వారు నాకు ఉచితముగా భోజనము పెడుతున్నారు. అందుకే నేను వంట గదిలో ఏదో ఒక పని చేస్తుంటాను. ఈ రోజున నువ్వు నా వంతు పనిని చేసావు కావున కనీసము నీ ధోతీని ఇవ్వు ఉతికి పెడతాను" అన్నారు. ఇది విన్న విశ్వనాథ స్వామి కన్నీళ్లు పెట్టుకుని భోరున ఏడ్చేసాడు.

-----

ఏ పని చేయకుండా జీతం తీసుకోవడం, తిని కూర్చోవడం తప్పని లోకానికి చాటి, పని సంస్కృతి నేర్పారు భగవాన్ రమణ మహర్షి.