Wednesday 5 February 2014

ఫిబ్రవరి 6, రధసప్తమి

రధసప్తమి


హిందు ధర్మంలో ఆదివారం చాలా పవిత్రమైంద రోజు. ఎప్పుడైనా సరే అదివారం సూర్యోదయ సమయానికి నిద్రించకూడదు. సూర్యోదయ సమయానికే నిద్రలేచి స్నానం చేసి, ఉదయించే సూర్యునకు నమస్కరించాలి.

రధసప్తమి రోజు ఎవరు సూరోదయానికంటే ముందే నిద్రలేచి ఉదయించే సూర్యునకు నమస్కరిస్తారో వారికి గత 7 జన్మల పాప ఫలితంగా వచ్చే రోగాలు తొలగిపోతాయి. ఎవరు సూర్యోదయానికి నిద్రిస్తుంటారో వారికి సకల రోగాలు వస్తాయట.

అలాగే రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.

సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర

ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది.  

ఓం సూర్యాయ నమః |

No comments:

Post a Comment