Sunday 10 January 2016

హిందూ ధర్మం - 191 (గోవు ప్రాముఖ్యత - 3)

ఈ కాలంలో మనం రెడియేషన్‌లో బ్రతుకుతున్నాం. అది మన మీద అనేక దుష్ప్రభావలను చూపిస్తోంది. గోమయం (ఆవుపేడ) రేడియేషన్‌ను పూర్తిగా నిరోధిస్తుంది. ఆవుపేడతో అలికిన ప్రాంతం రేడియోధార్మికశక్తిని నిరోధిస్తుందని రష్యన్ల పరిశోధనలో తేలింది. ఇంటిపై భాగంలో ఆవుపేడ అలికితే ,ఆ ఇంటి లోపలికి రేడియోధార్మికత ప్రవేశించదు. అంతటి శక్తి ఆవుపేడకు ఉంది. అందుకే ఇప్పటికి భారత్ మరియు రష్యా అణుశక్తి కేంద్రాల్లో రెడియేషన్ ప్రభావాన్ని నిరోధించడానికి/ ఎదురుకోవడానికి ఆవుపేడను ఉపయోగిస్తారని ఒక జంతుప్రేమికుల సంస్థ వెళ్ళడించింది. ఆవు పేడను నీటిలో కలిపి చల్లడం వలన ఇంటిలోనికి ఈగలు, దోమలు రావు. అదే ఇతరత్రా జంతువుల మలాన్ని చల్లితే అక్కడ క్రిములు చేరి రోగాలు వ్యాపిస్తాయి.

ఆవుపేడ యాంటి-సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. పవిత్ర ప్రదేశాల్లో, వంటగదిలో, ఇల్లంతా ఆవుపేడను అలికేది ఈ కారణం చేతనే. అందువల్ల ఇంట్లో వాళ్ళకి రోగాలు రావు. ఈ నాటికి కొన్ని తెగలవారు బాలింతలకు జ్వరం వచ్చినప్పుడు చికిత్సకు ఆవుపేడనే వాడతారు. ఆయుర్వేదంలో పంచగవ్యోప్రాశన అనే చికిత్సా విధానం కూడా ఉంది. ఇందులో ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడలను ఉపయోగించి వైద్యం చేస్తారు. కొంతకాలంగా మరుగున పడిన ఈ పద్ధతి ఈ మధ్య కాలంలో మళ్ళీ వ్యాప్తి చెందుతోంది. అద్భుతమైన ఫలితాలు కనబరచడం, దీనివలన రోగాలు తగ్గడం, ఎటువంటి సైడ్-ఏఫెట్స్ లేకపోవడం వల్లనే ఇది జరుగుతోంది.

కొన్ని పెద్ద పెద్ద యజ్ఞయాగది క్రతువుల్లో, వ్రతాలు, నోముల సమయంలో, సూర్యభగవానుడి ఆరాధన పద్ధతుల్లో పంచగవ్యాలతో చేసిన తీర్ధాన్ని స్వీకరిస్తారు.

ఇల్లు శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్, ఇతర వస్తువులు మొదలైనవి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి, పాదాల పగుళ్ళకు కూడా ఇవి కూడా ఒక కారణం. కానీ దానికి భిన్నంగా ఆవుపేడ వాసన శ్వాశకోశ సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కనుకే ఆవుపేడతో కళ్ళాపి చల్లుతారు, ఇల్లు అలుకుతారు హిందువులు.

భారతీయ గోవు యొక్క పేడకు ఇన్ని లక్షణములున్నాయి కాబట్టే లక్ష్మీదేవిని నువ్వు ఎక్కడుంటావు అని విష్ణుమూర్తి అడిగితే గోమయంలో ఉంటాను స్వామి అన్నది. అందుకే ధర్మశాస్త్రం 'అష్టైశ్వర్యమయి లక్ష్మీ వసతే గోమయేసదా' అని అంటుంది. అనగా లక్ష్మీదేవి అష్టైశ్వరములతో గోమయమందు ఉంటుందని అర్దం.

To be continued ...............

No comments:

Post a Comment