Wednesday 3 July 2024

శ్రీ గరుడ పురాణము (224)

 


పాసిపోయిన, చలి, విలువయుండిన, రంగు మారిన, కుక్క ముట్టిన, పతితునిచే చూడబడిన, రజస్వల ముట్టిన, సంఘష్ట, పర్యాయాన్న భోజనమును సర్వదా త్యజించ వలెను. 


*సంఘష్ట - భోజనం మిగిలిపోయింది. వచ్చితినేస్తారా అంటూ పెట్టే అన్నం. 

*పర్యాన్నం - ఒకరికోసం సిద్ధం చేసి వారు స్వీకరించకపోతే మనకి పెట్టునది.


శూద్రాన్నమును భుజించవచ్చును. ఐతే, ఆ శూద్రుడు కొన్ని తరాలుగా మన వృత్తిలో సహాయపడుతున్న వారి కుటుంబం వాడై వుండాలి. మనస్సు, మాట, శరీరం, కర్మ - వీటన్నింటినీ పరిశుద్ధంగా వుంచుకొని భగవదర్పణ బుద్ధితో మెలిగే వారై వుండాలి.


తిలతండులమిశ్రిత పదార్థాలనూ, అప్పాలు, పాయసం, పండివంటలు- ఇట్టి వాటిని దేవతలకో, అతిథులకో సమర్పించాకనే మనంతినాలి.


నీరుల్లి, వెల్లుల్లి వంటి ఉగ్రపదార్థాలు తిన్న వారికి చాంద్రాయణ వ్రతం చేస్తే కాని ఆ దోషంపోదు. మితంగా తింటూ, హితంగా వుంటూ, చిన్న, తెలియని దోషాలకు భగవంతుని క్షమాపణ కోరుకుంటూ, జీవితాన్ని భగవత్ప్రసాదంగా భావించి ప్రతి కర్మనీ భగవంతునికే సమర్పిస్తూ ఆయననే ప్రార్థిస్తూ జీవించేవాడు ఆయననే చేరుకుంటాడు.


(అధ్యాయం -96)


ద్రవ్యశుద్ధి


యాజ్ఞవల్క్య మహర్షి ప్రవచనమింకాకొనసాగుతోంది. 'శ్రేష్ఠమునులారా! ఇపుడు ద్రవ్య శుద్ధిని గూర్చి వినిపిస్తాను.


బంగారం, వెండి, అబ్జ (ముక్తాఫల, శుక్తి, శంఖాములు) కూరలు, త్రాళ్ళు, గొఱ్ఱే చర్మంతో చేసిన వస్తువులు, పాత్రలు, హోమంలో వేయవలసిన ధాన్యాలు, యజ్ఞ పాత్రలు లోపల మెత్తని నున్నని లేపనం లేనివై యుండి అపవిత్ర స్పర్శకులోనైతే వీటితో బాగా కడిగితే చాలు, శుద్ధములైపోతాయి. ధాన్యాదులపై కాస్త నీళ్ళు చిలకరిస్తే చాలు. యజ్ఞంలో వాడవలసిన స్రుక్, స్రువాలు (కర్రచెంచాలు) వేడి నీటితో కడిగితే శుద్ధి జరుగుతుంది. 


No comments:

Post a Comment