Monday 8 July 2024

శ్రీ గరుడ పురాణము (229)




రోగి అంగహీనుడు, అధికాంగుడు, 1. కాణుడు 2. పౌనర్భవుడు, 3. అవకీర్ణాది ఆచార భ్రష్టులు శ్రాద్ధ యోగ్యులు కారు.


పునర్భూకి పుట్టినవాడు. పునర్భూ అనగా వివాహానికి ముందే ఒక పురుషునితో లైంగిక బంధమున్న ఆడది. బ్రహ్మచారిగా గురుకులంలో వున్నపుడే వీర్యస్థలనం జరిగిపోయినవాడు.


శ్రాద్ధాని కొకరోజు ముందే బ్రాహ్మణుని ఆహ్వానించి సిద్ధం చేసుకోవాలి. ఆ బ్రాహ్మణుడు ఆ క్షణం నుండే నియమ నియతుడైవుండాలి. (బ్రాహ్మణులను, బ్రాహ్మణులు plural) శ్రాద్ధదినం నాటి పూర్వాహ్ణంలో వారు రావాలి. రాగానే గృహస్థువారిచే అత్యంతాదరంతో ఆచమనం చేయించి ఆసనాలపై కూర్చుండపెట్టాలి. విశ్వేదేవ లేదా ఆభ్యుదయిక శ్రాద్ధానికి ఇద్దరు బ్రాహ్మణులనూ, పితృపాత్రలో వీలైనంతమంది బ్రాహ్మణులనూ కూర్చుకోవాలి. లేదా విశ్వేదేవపాత్రులుగా తూర్పు ముఖంగా ముగ్గురినీ కూర్చుండబెట్టవచ్చు. శక్తిలేనివారు దానికొకనినీ, దీని కొకనినీ తెచ్చి చేయించుకోవచ్చు. ఈ విధంగా మాతామహులకు కూడా కూర్చుండబెట్టవచ్చును.


ఆ తరువాత బ్రాహ్మణులకు హస్తార్ఘ్యము (చేతులు కడుక్కోవడానికి నీరు) నూ ఆసనానికి కుశలనూ ఇచ్చి వారి అనుమతి తోనే విశ్వేదేవాస... అనే మంత్రంతో విశ్వేదేవతలనా వాహనం చేసి భోజన పాత్రలో యవలను జల్లాలి. తరువాత పవిత్రయుక్త అర్ఘ్యపాత్రలో శం నో దేవీ.... అనే మంత్రం ద్వారా నీటినీ యవో సి.... అనే మంత్రం ద్వారా యవలనూ పోసి యా దివ్యా.... మంత్రంతో బ్రాహ్మణుని చేతిలో అర్ఘ్యోదకాన్ని ప్రదానం చేసి గంధ, దీపక, మాల, హారాది ఆభూషణాలనూ, వస్త్రాలనూ వారికి దానం చేయాలి.


తరువాత జంధ్యమును అపసవ్యం చేసుకొని అప్రదక్షిణ క్రమంలో అనగా ఎడమ క్రమంలో స్థానం ప్రదానం చేసి కుశలను అశంతస్త్వా... అనే మంత్రంతో (చేతబట్టుకొని) పితరులను ఆవాహనం చేయాలి. అనంతరం పితృస్థానంలో ఆసీనుడైయున్న భూదేవుని అనుమతిని తీసుకొని ఆయంతు నః పితరః.... అనే మంత్రాన్ని పఠించాలి.


పితృకార్యంలో నువ్వులకే ప్రాధాన్యముంటుంది. (ఇతర కార్యాల్లో యవలను వాడతారు) పితృగణాలకు తిలలతో అర్ఘ్యాన్నిచ్చిదానిని బ్రాహ్మణుడందుకోగా క్రిందపడిన జలాలను (వీటినే సంస్రవలంటారు) 'పితృపాత్ర' అని వేరే ఒక గిన్నెను పెట్టి అందులో వుంచాలి. దక్షిణాగ్రకుశస్తంభాన్ని భూమిపై పెట్టి దానిపై పితృభ్యః స్థానమసి... అనే మంత్రం చదువుతూ ఇందాక చెప్పిన అర్ఘ్య పాత్రను పితరులకు ఎడమవైపు బోర్లించి పెట్టాలి. అగ్నైకరణకి అనుమతి నివ్వమని ఆచార్యుని వేడుకొని ఆయన అనుమతించగానే శ్రాద్దకర్త నేతితో కలిపిన అన్నాన్ని అగ్నికి ప్రదానం చేయాలి. పాత్రలో మిగిలిన అన్నాన్ని నెమ్మదైన మనసుతో నిదానంగా పితరుల యొక్క భోజన పాత్రలోకి తీసివుంచాలి. స్తోమతు కలిగినవారు పితరుల భోజనానికై వెండి పాత్రలనుపయోగించాలి.


No comments:

Post a Comment