Sunday 19 March 2023

శ్రీదత్త పురాణము (83)

 


మిత్రమా, సంతోషం నువ్వు వస్తానని అన్నావు అంతే చాలు. మేము దగ్గరుండి తీసికెళ్తాం. మా ఇల్లు దగ్గరంటే దగరే. దూరమంటే దూరమే. కువలయాశ్వన్ని పిలవవలసిన అవసరం లేదు. గౌతమీ నది దారిలో వెళ్ళాలి. అన్ని దగ్గరే. దూరమంటే దూరమే. కువలయాశ్వన్ని పిలవవలసిన అవసరం లేదు. గౌతమీ నది దారిలో ముగ్గురూ బయలు దేరారు. గౌతమీ నది చేరుకున్నారు. మిత్రమా ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం పవిత్ర నదికి 'వెళ్ళాలి. అని ఆచమించి సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం మన విధి. నువ్వు నదిలో దిగి దోసిట నీళ్ళు పట్టి కళ్ళు మూసి తెరిచేలోగా మనం మా ఇంటి దగ్గర వుంటాం. నిజం నువ్వే చూస్తావుగా అన్నారు. అన్నట్లుగానే ఋతద్వజుడు కళ్ళు మూసి తెరిచే సరికి నాగలోకంలో వున్నారు. తన మిత్రులు బ్రాహ్మణ కుమారులిప్పుడు సర్పశిరస్సులతో నాగకుమారులయ్యారు. ఇదేమిటి అని ఆశ్చర్యపోతున్నాడు ఋతధ్వజుడు.


చెలికాడా! క్షమించు మేం బ్రాహ్మణ కుమారులం కాదు. నాగరాజు కుమారులం. ఇది నాగలోకం నీతో స్నేహాన్ని వదులుకోలేక నిజం చెబితే నువ్వు మాతో స్నేహం చెయ్యవని తలచి ఇంతకాలం బ్రాహ్మణ కుమారులుగా గడిపాం. ఇది మా ఆనందం కోసం చేసిందే తప్ప నిన్ను మోసగించాలని మాత్రం కాదు. ఐనా స్నేహధర్మానికి విరుద్ధంగా నీ నుండి ఈ ఒక విషయాన్ని దాచాం కనుక క్షంతవ్యులం అన్నారు. ఋతధ్వజుడు ప్రేమగా మిత్రులారా అంతమాట లెందుకు, ఫరవాలేదు. మీ ఆనందంకోసం అయినా నాకూ ఆనందం పంచారు గనుక ఇందులో క్షమార్పణల ప్రసక్తి లేదు. మన స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలని నా ఆకాంక్ష. అది సరే గాని నడవండి మీ నాగలోక అందాలన్ని నాకు చూపించండి అన్నాడు.


ముగ్గురూకలసి నాగలోక ప్రధాన వీధులన్నీ తిరిగారు. ఋతధ్వజుడు అక్కడి సిరిసంపదలకు మురిసిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నాగకుమారులు ఋతర్వజుణ్ని తమ ఇంటికి తీసికొచ్చారు. తండ్రికి పరిచయం చేసారు. ఋతధ్వజుడు వినయవిధేయతలతో సాష్టాంగ నమస్కారం చేసాడు. అశ్వతరుడు ఋతధ్వజుడ్ని ఆనందంతో ప్రేమగా లేవనెత్తి కౌగలించుకొని శిరస్సు నిమురుతూ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నాయనా మా పిల్లలు రోజు చెప్తుంటారు నీ గురించి, నీ గుణగణాలు, నీ సౌహార్థం, నీ మంచి మనస్సు, నీ గాంభీర్యం, నీ ప్రతిజ్ఞ, నీ సౌశీల్యం నీ పరాక్రమం అన్నీ విన్నాను. ఎప్పటి నుండో నిన్ను చూడాలని ఇప్పటికి ఇలా పొసగింది. రా ఇలా వచ్చి ఈ ఆసనంపై కూర్చో. ఈ రోజు మాకు పండగ, మా ప్రియమైన అతిధివి. రాక రాక మొదటిసారిగా వచ్చావు. తగ్గ మర్యాదలు చెయ్యనీ. దయచేసి దేనికీ అడ్డు చెప్పకు. ఇవి నేను ప్రేమతో చేస్తున్నవి. కాదనడానికి వీలు లేదు. స్వీకరించవలసిందే అశ్వతరుడు ఇలా మాట్లాడుతూనే ఋతధ్వజున్ని సముచితాసనంపై కూర్చుండబెట్టి గంధమాల్యాదులు అలంకరించి రత్నఖచిత నానావిధ స్వర్ణ భూషణాలు ధరింపజేసాడు. నూతన పట్టు వస్త్రాలు అందించాడు. నాయనా ఇపుడు నాకు చాలా తృప్తిగా వుంది నీకేమైనా వరమివ్వాలని అనుకుంటున్నాను. ఏమికావాలో ఇష్టమైనది కోరుకో అన్నాడు.


No comments:

Post a Comment