Tuesday 19 December 2023

శ్రీ గరుడ పురాణము (38)

 


ఓంకారం ప్రతి మంత్రానికీ ముందు వాడుతూ విష్ణువు అంగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ క్రింది దేవతలకి ఈయీ బీజ మంత్రాలను (బీజాక్షరాలను) వాడాలి. ఓం


కం టం పం శం              గరుడుడు

జఖం వం                   సుదర్శనం

షం చం ఫం షం              గద

వం లం మం క్షం             శంఖ

ఘం ఢం భం హం             లక్ష్మి

గం జం వం శం              పుష్టి

ఘం వం                   వనమాల

దం సం                   శ్రీవత్సం

ఛం డం పం యం           కౌస్తుభం


గరుడుడు కమలం వలె ఎఱ్ఱనివాడు. గద నల్లనిది. పుష్టి శిరీష పుష్ప వర్ణంలో, లక్ష్మి బంగారం వలె పచ్చని కాంతులతో వుంటారు. శంఖానిది పూర్ణచంద్రుని వర్ణకాంతి. కౌస్తుభమణి అప్పుడే వికసించిన సూర్యుని అరుణ వర్ణంలో వుంటుంది. సుదర్శునునిది సహస్ర సూర్యకాంతి. శ్రీవత్సం కుందపుష్పసమాన వర్ణితం, అనగా శ్వేతం. వనమాల పంచవర్ణశోభితం. అనంత భగవానుడు నీలమేఘశ్యాముడు. అస్త్రాలది విద్యుత్కాంతి 'పుండరీకాక్ష' విద్య సహాయంతో పద్ధతిని తెలుసుకొని విష్ణువు యొక్క ఈ సమస్తాంగాలకీ అర్ఘ్య పాద్యాదులను సమర్పించాలి.


(అధ్యాయం 11)


No comments:

Post a Comment