Wednesday 27 December 2023

శ్రీ గరుడ పురాణము (46)

 


జగదానందకారకులలో తనంతటి వాడైన పరమేశ్వరుడీ ప్రార్థనను లోక కల్యాణం కోసమే చేశాడని గ్రహించిన మహావిష్ణువు ఆనందంగా ఇలా బోధించసాగాడు. 

పరమేశా! పరమబ్రహ్మ, పరమాత్మ, నిత్యుడు, పరమేశ్వరుడునైన విష్ణుభగవానుని సహస్రనామాలతో స్తుతిస్తే మానవులు భవసాగరాన్ని దాటగలరు. ఆ పవిత్ర, శ్రేష్ఠతమ, జపయోగ్య, సమస్త పాప వినాశకర మహా స్తోత్రాన్ని వినిపిస్తాను, ఆకర్ణించండి.


ఓం

(గరుడ పురాణాంతర్గత శ్రీ విష్ణు సహస్రనామం)


వాసుదేవోమహావిష్ణుర్వామనో వాసవో వసుః ।

బాలచంద్ర నిభోబాలో బలభద్రో బలాధిపః ॥


బలిబంధన కృద్వేధా వరేణ్యో వేదవిత్ కవిః |

వేదకర్తా వేదరూపో వేద్యో వేద పరిఫ్లుతః ॥


వేదాంగ వేత్తా వేదేశో బలాధారో బలార్దనః ।

అవికారో వరేశశ్చ వరుణో వరుణాధిపః ॥


వీరహాచ బృహద్వీరో వందితః పరమేశ్వరః |

ఆత్మాచ పరమాత్మాచ ప్రత్యగాత్మా వియత్పరః ||


పద్మనాభః పద్మనిధిః పద్మహస్తో గదాధరః |

పరమః పరభూతశ్చ పురుషోత్తమ ఈశ్వరః ॥


పద్మ జంఘః పుండరీకః పద్మమాలాధరః ప్రియః ।

పద్మాక్షః పద్మగర్భశ్చ పర్జన్యః పద్మసంస్థితః ॥


అపారః పరమార్థశ్చ పరాణాంచ పరః ప్రభుః |

పండితః పండితే ద్యశ్చ పవిత్రః పాపమర్దకః ॥


శుద్ధః ప్రకాశరూపశ్చ పవిత్రః పరిరక్షకః |

పిపాసావర్ణితః పాద్యః పురుషః ప్రకృతి స్తథా ॥


No comments:

Post a Comment