Saturday 13 April 2024

శ్రీ గరుడ పురాణము (147)

 


పూర్ణచంద్రుని వంటి మొగమూ, బాల సూర్య సమానమైన అరుణకాంతులు గల మేనూ, విశాలనేత్రాలూ, బింబా ఫలము వంటి క్రింది పెదవీ గల కన్య చిరకాలం పాటు సర్వసుఖాలూ అనుభవిస్తుంది. అరచేతిలో ఎక్కువ రేఖలుండే స్త్రీకి కష్టాలెక్కువ. తక్కువ రేఖలుంటే ధనహీనతా, దుఃఖాలూ వుంటాయి. అలాగే రక్తవర్ణంలోవుండే రేఖలు సుఖజీవనాన్నీ నల్లగీతలు దాస్యవృత్తినీ, దూతిక బ్రతుకునీ సూచిస్తాయి. అరచేతిలో అంకుశం, కుండలం లేదా చక్రచిహ్నంతో శోభిల్లే కన్యరాజపత్నీ, సత్పుత్ర జనయిత్రీ అవుతుంది. అలాగే ప్రాకార, తోరణ చిహ్నాలున్న తరుణి దాసి ఇంట పుట్టినా రాజపత్ని అవుతుంది. బొడ్డు కాస్త పైకి వంగి వుండి, మండలాకారంలో కపిల వర్ణంలో అక్కడ రోమాలుండే స్త్రీ రాచయింట పుట్టినా దాసిగానే బ్రతుకీడుస్తుంది.


నడిచేటపుడు రెండు కాళ్ళ అనామికలూ, చిటికెన వ్రేళ్ళూ నేలకి తగలకుండా వుండే తరుణి భర్తృవినాశినీ స్వేచ్ఛావిహారిణీ కాగలదు.


సుందర, మనోహర నయనాలున్న వారి సౌభాగ్యశాలినీ, ఉజ్జ్వలంగా మెరిసే పలువరుస గల పడతి దంత సిరి గలదీ (రుచికరమైన భోజనాదులు జీవితాంతం లభించేది), కోమల, స్నిగ్ధచర కోణాలున్న కోమలి శ్రేష్ట వాహనాల యజమానురాలు అవుతారు.


మృదువుగా మెరుస్తూ పైకి పెరుగుతూ రాగి రంగుకి దగ్గరగా మన్న ఎరుపు రంగు గోళ్ళు వుండి, మీన, అంకుశ, పద్మ, పాల చిహ్నాలతో, స్వేదరహితంగా వుండే అరికాళ్ళతో శోభిల్లు సుందరి లక్ష్మీదేవి వలె సౌభాగ్యశాలి కాగలదు.


రోమరహిత, సుందరజంఘలూ, ఏనుగు తొండాల్లా వుండే ఊరువులూ, దక్షిణావర్తమైన గంభీరనాథ్, రోమరహిత త్రివళులూ, రోమరహిత స్తన ప్రదేశం- ఇవి ఉత్తమ స్త్రీ లక్షణాలు.


(ఆధ్యాయం - 64)


No comments:

Post a Comment