Saturday 16 February 2013

పరమాన్నం

|| ॐ || ఓం సూర్యాయ నమః || ॐ ||
ఫిబ్రవరి 17 ఆదివారం రధసప్తమి

ॐ రధసప్తమి రోజు శ్రీ సూర్యనారాయణ మూర్తికి ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు ఇంటి మిందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను ఉపయోగించి పరమాన్నం చేయాలి. ఇంటిలో చిక్కుడుచెట్టు ఉంటే దాని దగ్గర సూర్యబింబానికి ఎదురుగా కూర్చుని పరమాన్నం వండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట పాలు పొంగించాలి. పాలు పొంగు వచ్చిన తరువాతే పరమాన్నం వండాలి.

ॐ రేపే కాదు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా సూర్యనారాయణ మూర్తికి ప్రీతికరంగా "దేశవాళీ ఆవుపాలతో" చేసిన పరమాన్నం నివేదన చేయడం మంచిది.

|| ॐ || ఓం సూర్యాయ నమః || ॐ ||

No comments:

Post a Comment