Tuesday 5 August 2014

గణేశుడు

ఓం గం గణపతయే నమః

"యే ప్రకృత్యాదయో జడా జీవాశ్చ గణ్యంతే సాంఖ్యాంతే| తేషామీశః స్వామీ గణేశః||"

ఈ సమస్త ప్రకృతి మొత్తం రెండు రకాల పదార్ధాలతో నిండి ఉంది. ఒకటి కదిలేవి, రెండు కదలినివి. కదిలేవాటిన చరములని, కదలనివాటిని, మార్పు చెందనివాటిని అచరములను, జడములని అంటారు. అందుకే ఈ సృష్టి మొత్తం చరాచరాత్మకమైనది అంటాం. చెట్లు, మొక్కల్లో ప్రాణమున్నప్పటికి అవి తామున ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళలేవు, కొండలు, రాళ్ళు, రప్పలు కూడా అంతే. కాబట్టి అవి అచరములు. మనుష్యులు, జంతువులు, పక్షులు మొదలనవి చరములు. అటువంటి ఈ చరాచరాత్మకమైన జగత్తు ఎవరిచే లెక్కించబడుతోందో(గణించబడుతోందో), ఎవరిచే పాలిచబడుతోందో ఆ పరబ్రహ్మమే గణపతి. గణించబడడం అంటే............. ఏదైనా ఒక వస్తువు ఉన్నది అని చెప్పడం. మనలో కూడా 'నేను' అనే భావన ఉంటుంది. అలా ఎక్కడైన ఒక వస్తువు ఉంది, లేక ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సమాజం ఉంది, ఒక దేశం, యావత్తు ప్రపంచం ఉంది అంటే నియమబద్ధంగా, క్రమబద్ధంగా సాగుతోందంటే ఈ మొత్తం జగత్తును నడిపిస్తున్న నాయకుడు/ అధికారి/ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. అతడే గణేశుడు అంటోంది పై శ్లోకం.

ఓం గం గణపతయే నమః      

No comments:

Post a Comment