Wednesday 20 August 2014

పత్రి పూజ గుర్తు చేస్తోంది

ఆయుర్వేదం ఒక ఉపవేదం. వేదం ప్రణవం నుంచి పుట్టింది. గణపతి ప్రణవస్వరూపుడు. అందుకే వినాయకుడికి అయుర్వేదమంటే ఇష్టం. ఆ కారణం చేతనే వినాయకచవితి రోజున మనం గణపతికి పత్రి పూజ చేస్తాం.

భూమి శివస్వరూపం, ప్రకృతి పార్వతీ స్వరూపం, భూమధ్య కేంద్రం గణపతి, భూమ్యాకర్షణ శక్తి కార్తికేయుడు/కూమారస్వామి. శివుడు పురుషుడైతే, పార్వతీ దేవి ప్రకృతి. ప్రకృతిపురుషుల బిడ్డగా అవతరించిన గణపతి ఈ రెండు తత్వాలకు అతీతమైనవాడని అంటోంది గణపతి అథర్వశీర్షం. అటువంటి సర్వాతీతమైన పరబ్రహ్మాన్ని శివ స్వరూపమైన మృత్తికతో గణపతిగా మలిచి, పార్వతీ స్వరూపమైన ప్రకృతిలో భాగమైన పత్రితో అర్చించిస్తున్నాం.

పత్రం అంటే ఆకు మాత్రమే కాదు, ఆత్మ కూడా. మనం పరమాత్మకు ఆత్మనివేదనం చేయాలి అంటే మనల్ని మనం ఆ పరమాత్మునకు సమర్పించుకోవాలి. ఆత్మనివేదనం నవవిధం భక్తులలో 9 వది. అత్యంత ఉత్కృష్టమైనది. అందుకు ప్రతీకగా పత్రిని సమర్పిస్తాం.

ఆయుర్వేదం గురించి చెప్పుకున్నాం కనుక ఒక్క మాట చెప్పుకుందాం. ప్రపంచంలోనే ఎటువంటు సైడ్-ఏఫెక్ట్స్ లేని ఔషధవిధానం ఆయుర్వేదం. ప్రకృతికి విరుద్ధంగా జీవించడం వలన మనిషిలో కలిగే వికృత మార్పే రోగం. ప్రకృతితో కలిసి సహజీవనం చేసే మనిషికి ప్రకృతిలో కలిగిన మార్పుల కారణంగా సంక్రమించే వ్యాధులను ప్రకృతి ద్వారా సహజమైన పద్ధతులలో నివారించడం, నయం చేసుకోవడం మన ఆయుర్వేదం యొక్క గొప్పతనం.  ఆయుర్వేదశాస్త్రాన్ని భరద్వాజ మహర్షి స్వర్గం నుంచి భూలోకానికి తీసుకువచ్చారట. భగవంతుని సృష్టిలో వ్యర్ధమన్న మాట లేదు. ఆయన చేసిన సృష్టిలో ప్రతీదీ ఉపయోగకరమైనదే, తన పాత్ర పోషించేదే. అట్లాగే ప్రకృతి ప్రసాదించిన అనేక వృక్షాల్లోనీ ఔషధ గుణాలను తెలుసుకున్న గొప్పతనం మహర్షులకే చెందుతుంది.

ప్రపంచదేశాలు మన దేశం మీద బయో-పైరసి అనే సరికొత్త యుద్ధం చేస్తున్నాయి. మన ఋషులచే రచించబడిన ఆయుర్వేద గ్రంధాలను దొంగిలించి వాటిలోని ఔషధ గుణాలను తెలుసుకుని ఆయా దేశాలు మన దేశంలో దొరికే ఆయుర్వేద మూలికల మీద మేధోహక్కులు, పేటెంట్ హక్కులు పొందుతున్నాయి. ఆయుర్వేద మూలికలలో మెగ్నీషియం శాతం అధికంగా ఉందని నివేదిక ఇచ్చిన అమెరికా, వాళ్ళ దేశంలో లభ్యంకాని, కేవలం భారత్‌లో మాత్రమే పెరిగే 30,000 భారతీయ ఆయుర్వేద మూలికల మీద అక్రమంగా పేటెంట్ హక్కులు పొందింది. 2007-08 మధ్య ఒకప్పుడు చైనా అధ్యక్షుడు భారత్‌కు వచ్చినప్పుడు, మన ప్రధానికి చైనా అధ్యక్షునికి వేప చెట్టును పరిచయం చేశారు. ఒక వేప చెట్టు 10 ఏసీలకు సమానమైన చల్లదనాన్ని ఇస్తుందని, వేపలోని ప్రతి భాగం ఔషధమేనని చెప్పారు. ఆ తర్వాత చైనా వెళ్ళి, దాదాపు 10 లక్షల వేప మొక్కలను చైనా వారు భారత్ నుంచి తీసుకుని అక్కడ నాటుకున్నారు. అక్కడితో ఆగకుండా వేప మూలాలు తమవేనని అబద్దాలు చెప్పి, వేప, కలబంద మీద హక్కులు పొందారు. అంతేందుకు మనం నిత్యం ఇంట్లో వాడే పసుపు మీద, మనం పవిత్రంగా భావించే దేశావాళీ ఆవు పేడ, మూత్రం మీద కూడా పేటెంట్‌లు పొందిందంటే మనం మన దేశ పట్ల ఎంత జాగ్రతతో వ్యవహరిస్తున్నామో అర్దమవుతుంది. మనకు సంబంధించిన అన్నిటిని విదేశాలు దోచుకుపోతుంటే మనం మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసం. అవేమి పిచ్చి మొక్కలు కాదు, ఇంగ్లీష్ మందులకు తగ్గని వ్యాధులు కూడా ఆయుర్వేదపద్ధతులలో సమూలంగా తగ్గిపోతాయి. కనీసం ఇప్పటికైనా మనం(భారతీయులం) తిరిగి మన సంస్కృతి వైపు పయనించాలి. ప్రకృతిలో ఉన్న శక్తిని గ్రహించాలి. మనది అనుకున్న ప్రతిదానిని మన కాపాడుకోవాలి. మన ఆయుర్వేదం, మన ఆత్మగౌరవం.        

ఎబోలా, స్వైన్ ప్లూ మొదలైన వికృత రోగాలను మన దరిదాపులకు రాకుండా చేయగల శక్తి ఆయుర్వేద మూలికలకు ఉంది. వినాయకచవితికి కల్పంలో చెప్పబడిన పత్రిని కనుక సంపాదించి, 9 రోజులు పూజించినటైతే, ఎబోలా కాదు కదా, దాని జేజెమ్మ కూడా భారత్ జోలికి రాదు.

No comments:

Post a Comment