Sunday 14 December 2014

హిందూ ధర్మం - 110 (వేదం)

హిందువులకు ధర్మం విషయంలో ఏదైనా సంశయం వచ్చినా, ఒక పని ఎలా చేయాలనే సందేహం కలిగినా, దేని నుంచి సందేహం నివృత్తి చెసుకోవాలనే అనుమానం వస్తుంది. పురాణాలు, శాస్త్రాలు మొదలైనవి అనేకం ఉన్నా, అన్నిటికి మూలం వేదం. అనేక చోట్ల పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు శాస్త్రంలో ఉండవచ్చు, అటువంటి సమయంలో వేదం దేన్ని అంగీకరిస్తుందో, దాన్నే హిందువులు ప్రామాణికంగా తీసుకోవాలి. వేద విరుద్ధమైనది ఆచరణయోగ్యం కాదు. వేదమే సనాతన ధర్మానికి ప్రామాణికం. సమస్త సృష్టికి మూలం వేదం. వేదమంటే ఒక గ్రంధం కాదు.

వేదం సమస్త జ్ఞానబాంఢాగారం. వేదంలో లేనేదేది సృష్టిలో లేదు, ఉండదు కూడా. సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడు కూడా వేదాన్ని అనుసరించే సృష్టి చేస్తాడు, వేదం నుంచే సమస్త కర్మలు, యజ్ఞాయాగాది క్రతువులు, వ్యవసాయం మొదలుకుని చెప్పులు కుట్టడం, వస్త్రాలు నెయ్యడం, కుండలు చేయడం వరకు, ప్రకృతి, సాంకేతిక పరిజ్ఞానం, ఖగోళ, అంతరిక్ష, భౌతిక, రసాయన, జీవ, ధాతు, ఆయుర్వేద, మంత్ర, తంత్ర, యంత్ర, గణిత, నిర్మాణ, వైద్య శాస్త్రాలు, ఇంకా అనేకం ఉద్భవించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నిటికి మూలం వేదం, అందుకే శాస్త్రం 'వేదోఖిలం జగన్మూలం' అని చెప్పింది. ఈ వేదంలో చెప్పబడనటువంటిదేదీ లోకంలో కనిపించదు, అది ఆధునిక పరిజ్ఞానమైనా సరే. ఈ రోజు కనుగొనబడనివి, ఇంకా 1000 ఏళ్ళ తర్వాత కూడా కనుగొనడం కష్టంగా భావించే అనేకానేక విషయాలు వేదంలో ప్రస్తావించబడ్డాయి. వేదం ప్రధానంగా రెండిటి గురించి చెప్తుంది. ఒకటి ప్రకృతి/ పదార్ధం (Matter) అయితే రెండవది ఆత్మతత్వం(Spirit), ఇది అగోచరమైనది. పదార్ధజ్ఞానంలో అణువుల (Atom) నుంచి విశ్వాంతరాళం వరకు అనేకానేక విషయాలు చెప్పబడ్డా అవి వేదంలో బీజ రూపంలో ఉంటాయి. బీజ రూపంలో అంటే చదివి తెలుసుకునేందుకు వీలుగా, ప్రత్యక్షంగా కాదు. చదివి, ఆలోచించి, అర్దం చేసుకుని, పరిశోధించి కనుగొనె విధంగా అన్నమాట.

ఇలా బీజరూపంలో విశ్వానికి సంబంధించిన విషయాలు చెప్పి మనిషి ఆలోచించడానికి, ఎదగడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి అవకాశం ఇస్తుంది వేదం. అన్నీ భగవంతుండే వ్యక్తపరిస్తే ఇక మానవుడికి మేధస్సు ఇవ్వడం ఎందుకు, మెదడు అనేది అవసరమే ఉండదు. అందుకే మానవ ఆలోచనకు వేదం పూర్తి స్వేఛ్ఛనిస్తుంది. మనిషి ఆలోచినాలి, నిత్యం కొత్తవి కనుగొనాలంటుంది వేదం. ఇదే ఇతర మతాలను సనాతనధర్మం నుంచి వేరు చేస్తుంది.      

To be continued .............

No comments:

Post a Comment