Monday 22 December 2014

బట్ట బయలైన క్రైస్తవమిషనరీల కుట్ర

దయచేసి అందరు ఇది చదవండి వాళ్ళ ధోరణి మచ్చుకి
బట్ట బయలైన క్రైస్తవుల కుట్ర.

భారత దేశాన్ని క్రైస్తవమయం చేయాలనే మిషనరీల పన్నాగం కోర్టు విచారణలో బయట పడింది. " ఇండియా ఎవ్వేరీ హొమ్ క్రుసేడ్" అనే సంస్థ చాలాసంవత్సరాల నుండి మన దేశం లో పని చేస్తూ, సంవత్సరానికి 40 లక్షల మంది హిందువులను మతం మార్చాలన్నదే ఈ సంస్థ లక్ష్యం. అందుకు 5000 వేల మంది కార్య కర్తలను నియమించి, విదేశాలనుండి వచ్చే అపరిమితమైన డబ్బుతో ఈ కార్యకర్తలను కొనుగోలు చేసి వీరి మనస్సులో క్రైస్తవమత విషాన్నినురిపోస్తుంది.

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కోర్టులో శ్రీ సుధీర్ కుమార్ అగర్వాల్ బలవంతపు మతమార్పిడుల నేరం పై కేసు దాఖలు చేయగానే " ఇండియా ఎవ్వేరీ హొమ్ క్రుసేడ్" ప్రముఖ సంచాలకుడు 'సుధీర్ జేవియర్' ను అరెస్ట్ చేసి విచారించినపుడు ఎంతో ఆశ్చర్య కరమైన సమాచారం లభించింది. 'స్వతంత్ర ధర్మపరివర్తన' చట్టం లోని 1968 అధికరణలో 3,4 సెక్షన్ల క్రింద సుధీర్ జేవియర్ పై విచారణ సాగుతుంది.
ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే 'ఇండియా ఎవ్వేరీ హొమ్ క్రుసేడ్' ప్రధాన కార్యాలయం మన సికింద్రాబాద్ లో ప్రాన్సిస్స్ట్రీట్ లో ఉంది. ఈ కార్యాలయానికి అనుగుణంగా 33 ప్రాంతీయ కార్యాలయాలు, 4 క్షేత్రీయ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. 2007 డిసెంబర్ 20 వ తేదీన ఈ కార్యాలయమునుండి సుధీర్ జేవియర్ కు ఒక నివేదిక పంపబడింది, ఆ నివేదిక ఏమంటే 2007 లో ఈ సంస్థ కార్యకర్తలు 25,10,810 ల హిందువుల ఇళ్ళకు వెళ్లి, 47,46,842 మంది హిందువులను మతం మార్చుటకు అనేక రకాలుగా ప్రలోభ పెట్టి, 1,92,868 మందిని మతం మార్చారు.

కోర్టులో విచారణ జరుగుతున్న సమయం లోనే ఇంకొక మిషనరీ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. 'వరల్డ్ ఫేయిర్ సమిత్' అనే ఈ సంస్థ మధ్యప్రదేశ్ లో ౭౦ గ్రామాల్లో మత మార్పిడులు ప్రారంభించింది. అనిల్ థామస్ దీనికి అధిపతి, 'పాంచజన్య' పత్రికా ప్రతినిధులు ఆ గ్రామస్థులను కలిసినపుడు ఆశ్చర్య కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మతం మారిన రైతుకు 5000 వేళ రూపాయలను చేల్లిస్తున్నాడు. కముద్ కేవట్ అనే రైతును మతం మారమని ప్రలోభ పెట్టాడు. నెలకు అయిదు వేళ రూపాయలే కాక అతని స్థలములో చర్చిని నిర్మించీ కముద్ ని ఫాదరీగా నియమిస్తామని అందుకు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశ చూపారు. కముద్ ఆ గ్రామం లోని 'ధర్మసేన' వారికి కబురందించారు. ధర్మసేన ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీ సుధీర్ కుమార్ అగ్రవాల్ అనిల్ థామస్ పై కేసు పెట్టాడు. పోలీసులు అనిల్ థామస్ ను అరెస్ట్ చేసి విచారణ సాగిస్తున్నారు. శ్రీ సుధీర్ కుమార్ అగ్రవాల్ మధ్య ప్రదేశ్ 'ధర్మ జాగరణ' విభాగ్ సహా సంయోజకులు.

suryam mangalamapalli

No comments:

Post a Comment