Monday 22 December 2014

హిందూ ధర్మం - 118 (మంత్రసంహిత)

ప్రతి మంత్రానికి కొన్ని శబ్దతరంగాలు, ఒక ఫ్ర్వీక్వెన్సీ ఉన్నాయి. ఉదాహరణకు ఓంకారానికి ఒక ఫ్రీక్వెన్సీ (Frequency) ఉంది. ఓంకారం నుంచే సమస్త సృష్టి ఆవిర్భించింది, ముందు శబ్దం, ఆ తర్వాత వెలుతురు ఉద్భవించాయి. అందుకే మనం శబ్దం బ్రహ్మం అంటాం. ఓంకారం నుంచి పుట్టిన సృష్టిలో భూమి యొక్క సహజ ప్రీక్వెన్సీ కూడా ఓంకారం యొక్క ప్రీక్వెన్సీతో సరిపోతుంది. దీనితో వ్యక్తి ప్రీక్వెన్సీ సరిపోయినప్పుడు, అతడు సూక్ష్మమైన, భూమికి సంబంధించిన, అనంతమైన, పారలౌకికమైన అద్భుతమైన విషయాలు కనుగొనవచ్చు. ఓంకారం, మరియు భూమి యొక్క ప్రీక్వెన్సీ 7.83 Hz. ఈ అంశం మీద శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తూ, ఈ భూముని సృష్టి చేసినప్పుడు, దైవికమైన జ్ఞానంతో సర్వజీవరాశి కలిసి ఉండటం కోసం ఒక విధమైన ప్రీక్వెన్సీని ఏర్పరిచారని చెప్పారు (.Depending on your point of view, living beings either evolved in this natural electromagnetic environment or were created with Divine Intelligence to live in harmony with it. One thing is certain: Since life began, the Earth has been surrounding all living things with this natural frequency pulsation.) ఆధునికులు అంతరిక్షంలోకి Space craft ను పంపినప్పుడు కూడా, వాటిలో Schumann device అనే ఒక పరికరం తప్పక ఉంటుంది. ఇది మనిషి ఉత్పత్తి చేసే ఇబ్బందికర వాతవరణానికి, తరంగాలకు విరుగుడట. అవి కూడా 7.83 Hz ప్రీక్వెన్సీని Schumann waves తరంగాల ద్వారా  విడుదల చేస్తాయి. భూమి ప్రీక్వెన్సీతో Space-craft ప్ర్వీక్వెన్సీ సరిపోతేనే అది సరిగ్గా పని చేయగలదు. భూమి యొక్క సహజ ప్రీక్వెన్సీ ప్రణవం అనగా ఓంకారమే.

Schumann waves గురించి ఈ లింక్‌లో చూడవచ్చు
http://www.schumannresonator.com/
http://www.natures-energies.com/health/schumann-generators-and-orgone-energy-devices
http://www.lessemf.com/schumann.html

ఏ విధంగానైతే ఓంకారానికి ప్రత్యేక ఫ్రీక్వెన్సీలు ఉన్నాయో, అదే విధంగా ప్రతి మంత్రానికి కొన్ని శబ్దతరంగాలు, కొన్ని ఫ్ర్వీక్వెన్సీలు ఉన్నాయి. వాటిని చంధోబద్ధంగా చదివినప్పుడు, అవి మనిషికి ఉన్నతమైన అనుభూతులను (elevated levels of consciousness) కలిగిస్తాయి.అట్లాగే మంత్రానికి సృష్టిలో ఒక ప్రత్యేక శక్తి, ప్రయోజనం కూడా ఉన్నాయి. అది అర్దమవ్వడం చాలా కష్టమైన పని అని అనిపించవచ్చు. అయినప్పటికి ఆధునిక పరిజ్ఞానం కనుగొన్న కొన్ని యంత్రాలు, జరిగిన పరిశోధనలు భౌతికము, ఆధ్యాత్మికం మధ్య విడదీసే రేఖను పూర్తిగా చెరిపేశాయి. కనుక ఇటువంటీ విషయాల గురించి ఈ కాలంవారికి కాస్త కష్టమైనా, అర్దమయ్యేలా చెప్పచ్చు.  ఇక మళ్ళీ విషయంలోకి వస్తే చాలా మంత్రాలు symbolic గా ఉంటాయి. వాటిని చదువగానే అర్దమవ్వవు. కొన్ని దేవతలను ఉద్దేశ్యించి చేసే సూక్తములై ఉంటాయి. కొన్ని శుభకార్యాలకు, యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించి ఉంటాయి. కొన్ని సామాజిక ధర్మాన్ని ప్రభోదిస్తూ ఉంటాయి. కొన్ని రసాయన, గణిత శాస్త్రానికి సంబంధించినవి, కొన్ని భౌతిక, జీవ, జంతు, వైద్య శాస్త్రానికి సంబంధించినవిగా ఉంటాయి. దృశ్యాదృశ్య ప్రపంచంలో కనిపించే సమస్త విషయాల గురించి మంత్రాల్లో చెప్పబడి ఉంటుంది. వేదాలు ప్రధానంగా సృష్టి మీద, ఆత్మ, పరమాత్మ, ఆధ్యాత్మిక విషయాల మీద, మనిషి ఆధ్యాత్మిక ఉన్నతి గురించి, ధర్మాల గురించి ప్రస్తావన చేస్తాయి. అయితే ఋషులు రాసిన అర్ధాలు చాలావరకు లభ్యం కాకపోవడం వలన, చాలా మంత్రాలను దైవం యొక్క నామాలు భావిస్తూ అర్ధాలు రాసారు ఈ కాలం వారు. వేదమంత్రాల్లో ఉన్న అర్ధాలను వివరించడంలో ఆధునిక కాలంలో ఆర్యసమజ స్థాపకులు దయానంద సరస్వతీగారు చేసిన కృషి చాలా గొప్పది.

To be continued ............

No comments:

Post a Comment