Thursday 11 December 2014

జ్యోతిష్యం సప్రామాణికమైన శాస్త్రం - రెండు ఉదాహరణలు

జ్యోతిష్యం సప్రామాణికమైన శాస్త్రం... దానికి ఒక రెండు ఉదాహరణలు చెపుతా... ఒకటి, టిప్పు సుల్తాన్ ఒక సారి మన జ్యోతిష్య శాస్త్రాలు తప్పు అని నిరూపించడానికి ఆయన దగ్గర్‌కు వచ్చిన ఒక జ్యోతిష్యూని కి ఒక పరీక్ష పెట్టాడు.. ఒక చేతిలో పంజరం లో ఉన్న చిలుక ను రెండో చేతిలో కట్టి పట్టుకుని.. "ఇప్పుడు నేను ఈ చిలకను నేను ఛంపుతానా లేక వదిలేస్తానా?" అని అడిగాడు. టిప్పు ఉధేశ్యం ఏంటంటే... జ్యోతిష్యూని చెప్పిన దానికి వ్యతిరేకం గా చేసి జ్యోతిష్యం తప్పు అని నిరూపించాలి.. ఆ విషయం జ్యోతిష్యూనికి అర్థం అయింది వెంటనే ఒక కాగితం తీసుకుని దానిలో రాసి మడత పెట్టి చెప్పాడు.."రాజా నేను దాని భవిష్యత్తు రాశాను మీరు కానీయండి" అని. టిప్పు ఆ చిలుకను పంజరం తెరిచి ఛంపబోయాడు.. కానీ ఆది.. టిప్పూ చేతిని గట్టిగా కరిచి ఎగిరి పోయింది. వెంటనే రాజు ఆ కాగితం తెరిచి చూసాడు...ఎం జరిగిందో అదే స్పష్టం గా రాయబడింది.
అప్పుడు ‪#‎జ్యోతిష్యుడు‬ చెప్పాడు.."నువ్వు కూడా ఈ చిలక లాగానే నిస్సహయ స్థితిలో ఆంగ్లేయుల చేతిలో చనిపోతావు " అని.

రెండో ఉదాహరణ : మిహిరుడు.. కానీ ఆయన వరహా మిహిరుడు అనే పేరుతో ప్రసిద్ధి............
ఆ పేరు రావడానికి కారణం కూడా ఆయన జ్యోతిష్యంలో నిపుణత ఆది నిరూపించిన సందర్భం.
విక్రమదిత్యుని కొలువులో ఉండేవాడు ఈయన... రాజు గారికి కొడుకు పుట్టిన సందర్భం లో కొడుకు భవిష్యత్తు ను రాయమని ‪#‎జ్యోతిశ్శాస్త్ర‬ పండితుల్ని కోరాడు... అందరు... ఆ బాలుడు కి ఉజ్వల భవిష్యత్తు అని రాశారు... కానీ మిహిరుడు మాత్రం... ఆ బాలుని 13 వ ఏట వరాహాం(పంది) వలన మరణం సంభవిస్తుంది అని చెప్పాడు...రాజా గారికి కోపం వచ్చింది...మిహిరుడిని తీవ్రంగా ధూషించాడు...ఆలా ఏళ్లు గడిచాయి... రాజు గారికి ఏదో ఒక మూల మిహిరుని శాస్త్రం మీద నమ్మకం ఉంది అందుకే ఆ బాలుడి ని పంది అనేది తెలియని వాతావరణం లో పెంచాడు......13 ఏడు వచ్చింది పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని.. మందిరంలో బాలుడు నిద్ర పోయాడు...తెల్లవారక చూస్తే బాలుడు విగత జీవుడై ఉన్నాడు...అతని గుండెల్లో పంది విగ్రహం గుచ్చుకుని ఉంది.........కారణం ఎంటంటే..ఆ మంచానికి నాలు వైపులా పైన వరహా విగ్రహాలు ఉన్నాయి..ఒకటి విరిగి పడి ప్రాణం తీసింది...పంది విగ్రహాలు ఎందుకున్నాయి అంటే... విక్రమాధిత్యుని రాజ్య చిహ్నం "వరాహాం".
ఆ సంఘటన జరిగాక.. రాజు పుత్రశోకం దిగమింగి, మిహిరుడిని పిలిచి సన్మానం చేసి, జ్యోతిష్య శాస్త్రాన్ని అభివృద్ది చెయ్యమని కోరాడు.
అందుకే మిహిరుని పేరు అప్పటి నుండి వరహా మిహూరుడి గా మారింది.

Source - Sekhar Reddy

1 comment:

  1. చిలక ఎగిరిపోయింది అని చెప్తూ చిలకలాగే చనిపోతావ్ అంటారేమిటి? తలా తోకా లేకుండా మాట్లాడ్డం అంటే ఇదే

    ReplyDelete