Friday 14 August 2015

స్వాతంత్ర దినోత్సవం - సద్గురు మలయాళ స్వామి వారి సందేశం

సద్గురు మలయాళ స్వామి వారి స్వాతంత్ర సందేశం

1947 ఆగష్టు 15 న దేశానికి స్వతంత్రం లభించింది. సెప్టెంబరులో ఒక సందేశం ఇస్తూ స్వామి వారు ఇలా అన్నారు ..............

"గతమాసము 15 వ తేదీన స్వరాజ్యము వచ్చినందుకు దేశమంతటా ఆబాలవృద్ధము మహానందముగా ఉత్సవాలు, ఉపన్యాసాలు, దానధర్మాలు జరిపారు. ఇవన్నీ శుభసూచనలే. రోగ పీడితుడు రోగ విముక్తి కలిగినప్పుడు ఎలా ఆనందం పొందుతాడో, అలా మాత్రమే జరిగినది. కానీ దేనివలన రోగము కలిగినదో, ఆ కీలకము (కారణము) తెలుసుకుని మెలిగినపుడే మరల ఆరోగ్యహాని కలగదు. దీనిలో రహస్యమిదే......... ప్రజలలోనూ, పాలకులలోనూ ఐకమత్యము లేనందువల్లనే పతనము సభవించినదని కొందరు తెలియజేసినా అది చాలదు. ఇంకోక ముఖ్యకారణం కూడా ఉంది. అదే వర్ణాశ్రమ ధర్మాలను ఆధారంగా చేసుకుని కొన్ని జాతులకు మాత్రమే శాస్త్రపఠనమునకు, అస్త్ర శస్త్రములు ధరించి యుద్ధం చేయుటకు అధికారము కలిపించుట. శారీరిక, మానసిక ప్రజ్ఞలను అనుసరించి సర్వజనులకు, వారికి అనుగుణమైన కార్యములలో ప్రవేశం ఏర్పడాలి. అప్పుడే భారతమాతను బంధించిన పిశాచము వదిలిపోతుంది".  - సద్గురు మలయాళ స్వామి

--------------------------------------------
నిజానికి అప్పటితో మన నాయకులు కులవ్యవస్థను అంతం చేయాల్సింది. కానీ దాన్ని చట్టబద్ధం చేశారు, ఇప్పుడు మతం మారే అవకాశం ఉంది కానీ, కులం మార్చుకునే అవకాశం లేదు. ఒకప్పుడు ఏ కారణం చేతనో వచ్చిన ఈ జన్మ ఆధారిత వర్ణవ్యవస్థ సమాజంలో స్వాతంత్రం తర్వాత బలంగా పాతుకుపోయి, హిందువుల్లో అనైక్యతకు కారణమవుతోంది. అలా కాక వేదం చెప్పిన గుణకర్మల ఆధారిత వర్ణవ్యవస్థ మాత్రమే దేశాన్ని తిరిగి పరిపుష్టం చేయగలదు.

No comments:

Post a Comment