Sunday 28 February 2016

హిందూ ధర్మం - 197 (వేదంలో గోసంరక్షణ - 2)

ఋగ్వేద సామవేదాలు ఆవుని అఘ్న్యా, అదితి అన్నాయి. అనగా వధింపకూడనిద, పూజించదగినది అని అర్థం. ఋగ్వేదంలో 9 సార్లకు పైగా (1.64.27, 5-83-8, 7-68-9, 1-164-40, 8-69-2, 9-1-9, 9-93-3, 10-6-11, 10-87-16) ఆవును అఘ్న్యా అంటూ వధించకూడదని తేల్చి చెప్పింది. గోవు వధించ రానిది, అగౌరవపరచ రానిదని, ఆవుపాలు మనసును శుద్ధి చేసి, పాపముల నుంచి దూరంగా ఉంచుతాయని చెప్పింది.

అఘ్న్యేయం సా వర్ధతాం మహతే సౌభగాయ - ఋగ్వేదం 1.164.27

గోవు - వధింపకూడనిది. అది మాకు ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను తీసుకువస్తుంది.

సుప్రపానం భవత్వఘ్న్యాయః - ఋగ్వేదం 5.83.8

అఘ్న్యా అయిన గోవుకు చక్కని నీటి సదుపాయం ఉండాలి.

అనగో హత్యావై భీమక్రియతే
మా నో గామశ్వం పురుషూం వధీః - అధర్వణ వేదం 10.1.29

అమాయకులను చంపటం మహాపాపం. మన ఆవు లను, గుర్రాలను, మనుష్యులను చంపకండి.

మా గామనాగా మదితిం వధిష్ట - ఋగ్వేదం 8.101.15

ఆవును చంపకండి. ఆవు అమాయకురాలు. అదితి - ముక్కలు చేయకూడనిది అంటూ గోవధకు దేశబహిష్కారం శిక్ష వేయమని చెప్పింది.

యః పౌరుషేయేణ క్రవిషా సమఙ్క్తే యో అశ్వ్యేన పశునా యాతుధానః
యో అఘ్న్యాయా భరతి క్షీరమగ్నే తేషాం శీర్షాణి హరసాపి వృశ్చ - ఋగ్వేదం 10.87.16

ఎవరైతే మనిషి, గుర్రం లేదా ఇతర జంతువుల మాంసం తింటారో, ఎవరైతే పాలతో జనులను పోషించే అఘ్న్యాలను - గోవులను (గోజాతిని) నశింప జేస్తారో వారిని కఠినంగా శిక్షించాలి (capital punishment).

అథర్వణవేదం 8-3-16 మంత్రమైతే గోహత్య మహాపాపం చేసినవారికి శిరశ్చేదనం (తల నరకమని) చేయమని చెప్పింది.

పై మంత్రాన్ని అనుసరించి గోవులను చంపేవారికి కఠినమైన శిక్ష విధించాలని వేదమే చెప్పింది. #వేదం అనగా భగవంతుని ఊపిరి, వేదం - భగవంతుడు, ఇద్దరూ వేరు కాదు. ఒక్క గోవులనే కాదు, ఏ జంతువును చంపినా శిక్ష విధించమంటోంది. మనదేశంలో కొన్ని రాష్ట్రాలు గోవును వధించినవారికి కఠిన శిక్ష ఉండాలని చట్టాలు చేస్తే, అది నేరమని, ఘోరమని కొందరు ధర్మద్వేషులు, అధర్మీయులు తెగ గొడవ చేస్తారు. ఈ దేశంలో ఆయా మతస్థులకు వారి వారి మతగ్రంధాలను అనుసరించి, వాటికి అనుగుణంగా చట్టాలున్నాయి. ఉదాహరణకు ముస్లిమకు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం భారతదేశంలో నేరం కాదు. ఎందుకంటే బహువివాహాలను ఖురాన్ అంగీకరించింది. ఖురాన్‌కు అనుగుణంగానే వారికి షిరియా చట్టం ఏర్పడింది. అలాగే విడాకుల విషయంలో కూడా వారికి వేరే పద్ధతి ఉంది. భారతదేశంలో ఇస్లామేతర ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు కాగా, వారికి కనీస వయసు 15 సంవత్సరాలు.

వారి మతగ్రంధాన్ని అనుసరించి చట్టం ఏర్పడినప్పుడు హిందువులు, తమ ధార్మిక గ్రంధాలకు అనుగుణమైన చట్టం కావాలని అడగడంలో తప్పేంటి? ధర్మం ప్రకారం గోవధ సహిచరాని నేరం. ఈనాడు కొన్ని రాష్ట్రాలు గోవధకు కఠిన శిక్షలు వేయడమంటే ధార్మిక గ్రంధాలకు అనుగుణంగా చట్టం ఏర్పడిందని అర్దం కదా. మరి ఈ ఒక్క విషయాన్నే వ్యతిరేకించడం ఎందుకు? ఇది ఆ కుహన మేధావులది ద్వంద్వనీతి కాదా అని హిందువులు ప్రశ్నించాల్సి ఉంటుంది.

To be continued ....................

Source: http://agniveer.com/no-beef-in-vedas/

No comments:

Post a Comment