Friday 16 December 2016

మార్కళి పిళ్ళైయార్



ధనుర్మాసం దేవతలకు తెల్లవారుఝాము కాలము. దైవశక్తిని ప్రచోదనం చేయటానికి ఈ నెల మొత్తం ఎంతో అనువైనది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఈ మాసమంతా ఆండాళ్ అమ్మవారు రచించిన పాశురాలు చదువుతూ, ధనుర్మాస వ్రతం చేస్తారు. శైవులు అరుణాచలంలో రచించబడిన తిరువెంపావై చదువుతూ, సదాశివుడిని అర్చిస్తారు. అలాగే ద్రావిడ ప్రాంతాల్లో, ముఖ్యంగా శ్రీ లంకలో, అక్కడి సంప్రదాయంలో, శైవాగమం ప్రకారం గణపతిని విశేషంగా పూజిస్తారు. అందులో ఈ ధనుర్మాసం మొత్తం వినాయక స్వామిని అరించే సంప్రదాయం ఉంది.

దాని గురించి నందినాథ సంప్రదాయం కైలాస పరంపరకు చెందిన గురుదేవులు సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి ఈ విధంగా చెప్పారు- మార్కళి పిళ్ళైయార్ అనేది గణపతిని ఈ మాసమంతా ఆరాధించే పండుగ. వేల ఏళ్ళుగా చలికాలంలో వినాయకుడిని ఉద్దేశించి ఈ పండుగ/ పూజ జరుగుతోంది. తమిళ మాసమైన మార్కళి - డిసెంబరు మధ్య నుంచి జనవరి మధ్య వరకు- మనం పిళ్ళైయార్ (గణపతి) ని ఎంతో భక్తితో, ప్రత్యేక పూజలు, జపాలు, భజనలతో పూజిస్తాము. సంవత్సరంలో ఇది అత్యంత ఆధ్యాత్మికత ఉట్టిపడే సమయం. ఈ సమయంలో ప్రయత్న పూర్వకంగా, మూఖ్యంగా తెల్లవారుఝాము 4 గంటల నుంచి 6 వరకు గణపతిని ధ్యానిస్తాము. సంప్రదాయంలో, అన్ని పూజలు, ఆధ్యాత్మిక సాధనలు మార్కళి మాసంలో మొదలవుతాయి, ఇంటిని ప్రతి రోజు శుభ్రం చేస్తారు.

ఓం శ్రీ గణేశాయ నమః 

No comments:

Post a Comment