Saturday 10 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 6



ఇంతకముందు చెప్పుకున్నాం కదా, మట్టిలో 18 రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయని. అలాగే ఈ శరీరాన్ని తగులబెట్టినప్పుడు మిగిలేది 20 గ్రాముల మట్టి మాత్రమే. మళ్ళీ అందులో కూడా అవే 18 రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయి. అది శరీరానికి, మట్టికి ఉన్న సంబంధం. రాజీవ్ దీక్షిత్ గారంటారు, మట్టి పాత్రలలో వండిన ఆహారం తినడం వలన మాన పూర్వీకులకు జీవితాంతం కళ్ళజోడు రాలేదు, పళ్ళు ఊడిపోలేదు, మోకాళ్ళ నొప్పులు, డయాబిటిస్ వంటి సమస్యలు రాలేదు. శరీరానికి కావల్సిన పోషకలు సక్రమంగా అందుతుంటే జీవితాంతం మన పనులన్నీ ఎవరి మీదా ఆధారపడకుండా చేసుకుంటూ జీవించగలం. అది ఒక్క మట్టి పత్రలలో వండిన ఆహారం భుజించడం వల్లనే సాధ్యమవుతుంది. మట్టిపాత్రలో వండిన ఆహారంలో పోషకాలు ఒక్కటి నాశనమవ్వవు, 100% శాతం అందులో రక్షించబడతాయి. ఆ తర్వాత ఉపయోగపడేది కాంస్యం లేదా కంచు. అందులో 97% పోషకాలు ఉంటాయి, 3 % నశిస్తాయి. ఆ తర్వాత ఇత్తడి పాత్ర. అందులో 93% వరకు పోషకాలు రక్షించబడతాయి. ఇదంతా మేము 3000 ఏళ్ళకు పూర్వం మన భారతదేశంలో జీవించిన మహర్షి వాగ్భటాచార్యులు పొందుపరిచిన ఆయుర్వేద సూత్రాల నుంచి గ్రహించి, వాటిని సి.డి.ఆర్.ఐ. (Central Drug Research Institute) శాస్త్రవేత్తల ద్వారా పరిశోధన చేయించాము. అందులో వారు అంగీకరిచిన మరో సత్యం ఏమిటంటే ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహారం దీర్ఘకాలంగా విషంగా పని చేస్తుందని. ఇది కూడా వాగ్భటులు చెప్పిన సూత్రల్లో ఉంది. ఇంకోటి, ఈ అల్యూమినియం అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఈ పాత్రలో ఆహరం వండుకుని, మళ్ళీ మళ్ళీ తింటూ ఉండేవారికి మధుమేహం, జీర్ణసంబంధిత వ్యాధులు, టిబి, ఆస్తమా, కీళ్ళ వ్యాధులు తప్పకుండా వస్తాయి. ఇలాంటి పాత్రలలో వండిన ఆహారంలో కేవలం 7% నుంచి 13% వరకు మాత్రమే పోషకాలు ఉంటాయి. ఇది ఆ కేంద్రప్రభుత్వ పరిశోధనా సంస్థ వారు అంగీకరించారు. కానీ వారే విషయం బయట పెడితే, ఈ ప్రెషర్ కుక్కర్ కంపెనీలు వారిని ఉండనివ్వవని చెప్పారు. అందుకే మనం ఇప్పుడు ఇండియా పద్ధతి నుంచి భారతీయ పద్ధతికి, మన అసలుసిసలైన సంప్రదాయంలోకి అడుగుపెట్టాలి. మట్టి పాత్రలలో విశిష్టత మీకు ఇంకా తెలియాలంటే డయాబిటీస్ ఉన్నవారికి ఈ పద్ధతిలో మట్టి పాత్రలో వండిన భోజనాన్ని మహర్షి వాగ్భటాచార్యుని సూత్రాల ప్రకారంగా పెట్టి చూడండి. కొన్ని నెలల్లోనే వారు మధుమేహం నుంచి విముక్తులవుతారు. అందుకే మనం మట్టికి దగ్గరగా జరగాలి.

ఈ మట్టికి మానవశరీరానికి ఉన్న సంబంధం శాస్త్రాల్లో ఇలా అనేక విధాలుగా చెప్పబడింది. నిత్యం భగవంతుని ఆరాధనలో 'లం పృధ్వీ తత్వాత్మికై గంధం సమర్పయామి' అని అమ్మవారికి లేదా భగవానునికి అర్పిస్తాము. అందులో మనం చెప్పేది పృధ్వీ తత్త్వానికి గంధం ప్రతీక. పంచభూతాల్లో భూమికి, పంచతన్మాత్రల్లో  వాసనకు సంబంధం ఉంది. ఎప్పుడైతే మనం భూమి, మట్టికి దూరంగా అసహజమైన జీవనం గడుపుతామో, అప్పుడు ముక్కుకి తన సహజ లక్షణమైన వాసనలను పసిగట్టే లక్షణం తగ్గిపోతుంది. ఇది ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనల్లో కూడా వెల్లడయ్యింది. కాలుష్యం వలన, సారవంతమైన మట్టికి దూరంగా జీవించడం వలన మానవుడి వాసనలు పసిగట్టే లక్షణం దారుణంగా పడిపోతున్నదని, కనీసం అప్పుడప్పుడైనా పల్లుటూళ్ళకు వెళ్ళి అక్కడ ప్రకృతికి దగ్గరగా జీవించాలని అందులో పేర్కొన్నారు. ఇది 3-4 క్రితం పత్రికల్లో ప్రచురితమైంది. ఇలా చూసుకుంటే మనం మట్టికి దూరంగా జరగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము.

విచిత్రమేమిటంటే మట్టిలో క్రిములున్నాయని పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వరు తల్లిదండ్రులు. వాళ్ళు ఏడవకుండా సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, టివిలు ఇస్తారు. ఒకసారి పరిశోధనలు చూడండి. మీ సెల్ ఫోన్ తెర మీద ఎన్ని క్రిములుంటాయో తెలుసా? టాయిలెట్ డోర్ హ్యాండిల్ మీద ఉన్నన్ని క్రిములు. కంప్యూటర్ కీ బోర్డు ఏమీ తక్కువకాదు. బాత్రూం దగ్గర కాళ్ళు తుడుచుకోవడానికి వేసే డోర్ మ్యాట్ మీద ఉన్నన్ని క్రిమిలు కీబోర్డు మీదుంటాయి. టివి రిమోట్ మీద కూడా దగ్గర దగ్గరగా అన్నే ఉంటాయి. అసలు మనం వాటిని వదిలి ఉండేదెప్పుడు? వాటిని ముట్టుకుని, ఆ తర్వాత ఎన్ని పనులు చేస్తామో, తినడం కూడా. చక్కగా బయట ఆడుకోకుండా వారిని అదుపు చేసి, ఇంట్లో అసహజమైన వస్తువులతో వారికి మనేమి ఇస్తున్నాం? మనమేమి పొందుతున్నాం? ఆరోగ్యమా? అనారోగ్యమా?

To be continued .................

No comments:

Post a Comment