Monday 5 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 1



మట్టే మన ఆహారం. అవును, మట్టే మన ఆహారం. మీరు విన్నది నిజమే. అదేమిటని అడుగుతారేమో! మట్టి నాణ్యతను బట్టే మొక్కలో పోషకాలు తయారువుతాయి. మొక్క తనకు కావల్సిన పోషకాలన్నీ మట్టి నుంచి తీసుకుంటుంది. 45% మినరల్స్, 25% గాలి, 25% నీరు, 5 % ఆర్గానిక్ తో తయారవుతుంది మట్టి. మీకో విషయం తెలుసా? ఉపరితల భాగంలో ఉందే ఒక అంగుళం మట్టి (Top soil) ఏర్పడటానికి 100 ఏళ్ళు పడుతుంది. అదే మట్టి కలుషితమైతే? సారం కోల్పోతే? మానవుడి చర్యల వలన వికృతమైతే? మానవులు తీసుకునే ఆహారం కలుషితమవుతుంది, సారహీనమవుతుంది. ఆరోగ్యం, బలం ఇవ్వాల్సిన ఆహారం, అనారోగ్యాన్ని ఇచ్చి బలహీనులను చేస్తుంది. బలహీనమైన జాతి నశిస్తుంది. మానవసమాజం కుప్పకూలుతుంది. మానవ అకృత్యాల వలన సారం, జీవం కోల్పోతున్న మట్టిని సంరక్షించడానికి ఐక్యరాజ్య సమితి డిసెంబరు 5 ను ప్రపంచ మృత్తికా దినోత్సవంగా ప్రకటించింది. ఒకసారి మట్టికి మన హిందూ సంస్కృతిలో ఉన్న వైశిష్ట్యం తెలుసుకుందాం.

రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ ............. కృష్ణ యజుర్వేదంలో శ్రీ రుద్రంలో ఉన్న మంత్రమిది.  ధర్మమార్గంలో నడించేవారిని రక్షించువాడు, మా పొలాలను/ మట్టిని/ భూమిని రక్షించువాడు, అందరిని నడిపించువాడు, శత్రువుల చేత హతం చేయబడనివాడు, అడవుల రూపంలో ఉన్నవాడు/ వనాలను రక్షించువాడు, వాక్కును ప్రసాదించినవాడు, విశ్వాన్ని నిర్మించి పోషిస్తున్నవాడు, వృక్షరూపంలో ఉన్నవాడు/ వృక్షాలకు అధిపతి అయిన రుద్రునకు మా నమస్కారాలు అని పదేపదే నమస్కరించడం కనిపిస్తుంది. అందులో ఎంతో చక్కగా చెప్పారు, దీన్ని ఎన్నో కోణాల్లో దర్శించవచ్చు. ఇప్పటికి ఈ అంశానికే పరిమితమవుదాము. క్షేత్రానికి ఒక అర్దంలో మట్టి కూడా వస్తుంది. మట్టిరూపంలో ఉన్న శివునకు నమస్కారాలు అని, ఇంకో అర్దంలో మృత్తికకు అధిపతి, రక్షకుడైన శివునకు నమస్కారాలు అని అర్దం. దీనిబట్టి మనమేం అర్దం చేసుకోవాలి, మట్టిని కలుషితం చేయడం, భూసారం క్షీణించే చర్యలకు దిగడం రుద్రునకు చేసే అపచారం.

చమకంలోనికి వెళితే, అశ్మా చ’ మే మృత్తి’కా చ మే గిరయ’శ్చ మే పర్వ’తాశ్చ మే - అనే మంత్రంలో ఋషి, మాకు మంచి సారవంతమైన మృత్తికను ఇవ్వు అని అడుగుతున్నాడు.

అఘమర్షణ సూక్తం అనే సూక్తం వేదంలో ఉంది. అది స్నానం సమయంలో పఠిస్తారు. అది మట్టి విలువను ఎంతో గొప్పగా ప్రతిపాదిస్తోంది.

అశ్వక్రాంతే రధక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా 
శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదేపదే

అంటూ ఉండే మంత్రం మట్టి శిరస్సుపై ధరించి స్నానం చేయడం వలన రక్షణ కలుగుతుందని చెప్తోంది. ఒకప్పుడు మట్టినే స్నానానికి వాడేవారు, బట్టల మురికి వదిలించడానికి కూడా మట్టినే వాడేవారని రాజీవ్ దీక్షిత్ గారు పలు ఉపన్యాసాల్లో చెప్పారు. దానికి కారణం మట్టిని ఉపయోగించడం వలన భూమి, నీరు కలుషితం కావు, రెండవది, అది సహజసిద్ధంగా తయారైనది. శరీరానికి హాని చేయనిది, పైగా పోషకాలను అందించేది. ఇప్పుడు మనం వాడే సబ్బులు చర్మానికి మంచివికావు, బట్టలకు మంచివికావు, పర్యావరణానికీ మంచివి కావు. అంతేనా? ఆ స్నానానికి వాడే సబ్బులను తయారు చేశాక, పరీక్షల కోసమని వాటిని జంతువుల మీద రకరకాలుగా ప్రయోగిస్తారు. కొన్నిటిని వాటి కంట్లోకి చొప్పించి, కళ్ళు పోతాయా లేదా అని పరీక్షిస్తారు. షాంపూల గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీలేదు. అంత హింసతో కూడుకున్నవి వాడటం అవసరమా? అలాంటి హింసకు పరోక్షంగా కారణమవుతున్న వాటి వినియోగదారులు మోక్షాన్ని పొందగలరా? కనీసం అలా ఆలోచించడానికి పాత్రులా?

To be continued ..............
http://techfactslive.com/world-soil-day-theme-quotes-history/15869/

No comments:

Post a Comment