Sunday 18 December 2016

హిందూ ధర్మం - 233 (జ్యోతిష్యం - 15)



ఆధునిక పరిశోధన కూడా ప్రకారం గ్రీస్, ఇతర నాగరికతలలాగే తనకంటే వైభవంగా విలసిల్లుతున్న నాగరికతల నుంచి జ్ఞానం తీసుకుని, తనలో కలుపుకుని, తన ఆలోచనలో భాగం చేసుకుందని స్పష్టం చేసింది. సోక్రటీస్‌కు ముందే గ్రీస్‌లో హిందువులు నివసించారని కొందరు పాశ్చాత్య చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గ్రీకులో సన్యాసానికి దగ్గరగా కొన్ని సంప్రదాయలుండటం గురించి Egypt మరియు Israel (1911) గ్రంధ రచయిత,  Professor Sir Flinders Patrie (1853-1942) అంటారు- క్రీ.పూ. 480 నాటికే పర్షియన్ సైన్యంలో ఎంతో పెద్ద సంఖ్యలో భారతీయ సేనలు ఉండటం, భారతదేశం మరియు గ్రీస్ మధ్య సంబంధాలు ఎంత వరకు వెళ్ళాయో చెప్తోంది. ఈజిప్ట్‌లోని Memphis అనే ప్రాంతంలో దొరికిన క్రీ.పూ. 5 వ శతాబ్దానికి చెందిన భారతీయుల modeled heads, భారతీయులు వర్తకం కోసం అక్కడ నివసించారని చెప్తున్నాయి. అందువల్ల నూతనమైన పాశ్చాత్య ఆధ్యాత్మికతకు భారతీయతే మూలమని ఎటువంటి కష్టం లేకుండా తేల్చవచ్చు.

సోక్రటీస్ శిష్యుడైన ప్లాటో, తన గురువు రచనలే కాక, కొన్ని తాను కూడా గ్రంధస్థం చేశాడు. అవన్నీ హిందూ సిద్ధాంతాలకు, ఉపనిషద్ బోధనలకు దగ్గరగా ఉంటాయి.  ప్లాటో కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మాడు. నిజానికి ఇది ప్లాటొ కంటే శతాద్బం ముందే జీవించిన పైధాగోరస్, భారతదేశంలో గంగా తీరంలో చదువుకున్న తర్వాత, అక్కడ ప్రతిపాదించాడని జెర్మన్ చరిత్రకారులు 17 వ శత్బాదంలోనే అభిప్రాయం వ్యక్తం చేశారు (ఈ విషయం ఇంతకుపూర్వ భాగాల్లో చెప్పుకోవడం జరిగింది). ఈ విధంగా ఈ రోజు పాశ్చాత్య ప్రపంచం తమ ఆలోచనకు మూలపురుషులుగా కొలుస్తున్న ముగ్గురి మీద సనాతనధర్మం యొక్క ప్రభావం ఉంది. కాకపోతే ఆ తర్వాతి వారు ఉపనిషత్తులను పరిశీలించని కారణంగా, వారి ఆలోచన వక్రమార్గం పట్టి ప్రపంచ నాగరికతల నాశనానికి దారి తీసింది. ఇది ఆ తర్వాత కూడా కొనసాగింది. క్రీ.పూ. 2 వ శత్బాదానికి చెందిన అఘతా క్లోస్ అనే గ్రీకు రాజు, శ్రీ కృష్ణుడు, బలరాముడి ముద్రలున్న వెండి నాణేలను ముద్రించాడు. ఇది అక్కడి పురావస్తుశాలలో చూడవచ్చు.

గ్రీకు రాయబారి, మెగస్తనీస్, భారతదేశ సౌభగ్యాన్ని గురించి వివరంగా రాసి పెట్టాడు. గ్రీకు పతనమైన రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన తర్వాత కూడా వాళ్ళకు, మనకు మధ్య వ్యాపారలావాదేవీలు, వాణిజ్యం ఏమాత్రం తగ్గలేదు. రోమన్లు, అప్పట్లో బ్రహ్మాండమైన నౌకాబల సంపన్న దేశంగా ఉన్న భారతదేశం నుంచి చేసుకునే దిగుమతుల నిమిత్తం, ఏడాదికి 5 కోట్ల సెస్టర్సులు (50,00,000 డాలర్లు) ఖర్చు పెట్టేవారని ప్లీనీ (క్రీ.శ. 1 వ శతాబ్ది) అంటాడు. ఆ తర్వాత అక్కడ క్రైస్తవ మతవ్యాప్తి పెరిగింది. క్రైస్తవంలో కూడా ఎన్నో ఆదర్శాలను సనాతన ధర్మం, బౌద్ధ మతాల నుంచి తీసుకున్నారని ఎందరో అభిప్రాయపడ్డారు. భారతదేశ సంపదల గురించి ప్రస్తావిస్తూ బైబిల్ ( II క్రానికల్స్ 9:21.10) అంటుంది, "తార్షీష్ ఓడలు, బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు మాత్రమే కాకుండా ఆల్గం (చందనం) చెట్ల కొయ్య, రత్నాలు కూడా సమృద్ధిగా, ఓఫిర్ (బొంబాయి తీరంలో ఉన్న సోపారా) నుంచి తెచ్చి సాలమన్ రాజుకు ఇచ్చాయని చెబుతోంది". ఆఖరికి పరమత 'దైవ' గ్రంధాల్లో కూడా హిందూదేశ వైభవం ప్రస్తావించబడింది. అంటే అప్పట్లో ఆ గ్రంధకర్తల మీద మన దేశ ప్రభావం ఎంతగా ఉండేదో గమనించవచ్చు.

To be continued .............

వివరాలకు క్రింది లింకులు పనికి వస్తాయి.
http://historydetox.com/pythagoras-plato-and-india/
http://www.hinduwisdom.info/India_and_Greece.htm
https://ramanan50.wordpress.com/2014/03/30/vedic-hinduism-in-germany-greece-russian-veda/

No comments:

Post a Comment