Saturday 29 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (8)



తమిళనాడు గొప్పదనం

తమిళనాడుకి అపారమైన సేవ చేసింది అవ్వైయార్. ఈ నాటికీ సదాచారం, భక్తి ఈ ప్రాంతంలో ఉన్నాయంటే అది అంతా ఆమె పెట్టిన భిక్షయే.

సదాచారం, భక్తి అనేవి చిన్ననాటినుండీ అలవడాలి. అవి భావి జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తాయి. ఎందరో కవులున్నా వారందరూ పెద్దలను దృష్టిలో పెట్టుకొని కావ్యాలు వ్రాసారు. వారి కవితాశక్తికి ఏమాత్రం తీసిపోకుండా, యోగశాస్త్ర నిపుణురాలైన జ్ఞానియై యుండి చిన్నపిల్లల బాగుకోసం కవితలల్లింది. ఆమె పాటలు పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దాయి. 

ఒక అవ్వ తన మనుమలనెట్లా తీర్చి దిద్దుతుందో అవ్వైయార్ కూడా జగత్కుంటుంబాన్ని అట్లా సాకింది.

అపారమైన ప్రేమవల్ల వ్రాయడంచే తరాలు గడిచినా చెక్కు చెదరకుండా, మానవుల మనస్సులలో ఆమె రాసిన 'ఆతి చూడి' ప్రాథమిక బాలశిక్షయైంది. 

ముందు పూజ చేసేది వినాయకునికే. మొదటి చదువవలసిందీ ఆ పుస్తకాన్నే. 


No comments:

Post a Comment