Thursday 8 February 2024

శ్రీ గరుడ పురాణము (84)

 


మహేశా! ఈశానదేవునికి కూడా అయిదు కళలుంటాయి. ముందుగా ఆ స్వామిని ఓం ఈశానాయ నమః అనే మంత్రంతో పూజించిన అనంతరం ఆ కళలను ఈ క్రింది మంత్రాలతో పూజించాలి. 

ఓం హాం సమిత్యై నమః

ఓం హాం అంగదాయై నమః

ఓం హాం కృష్ణాయై నమః

ఓం హాం మరీచ్యై నమః

ఓం హాం జ్వాలాయై నమః


శంకరా! ఆ తరువాత ఓం హాం శివపరివారేభ్యో నమః అంటూ పరమశివుని పరివారాన్నీ ఆ తరువాత ఈ క్రింది మంత్రాలతో దిక్పాలకులనూ, అనంతునీ, బ్రహ్మనీ, చండేశ్వరునీ ఆవాహన చేసి స్థాపన, సన్నిధాన, సంనిరోధ, సకలీకరణాలను గావించాలి.


ఓం హాం ఇంద్రాయ సురాధిపతయే నమః, 

ఓం హాం అగ్నయే తేజోధిపతయే నమః, 

ఓం హాం యమాయ ప్రేతాధిపతయే నమః, 

ఓం హాం నిరృతయే రక్షోఽధిపతయే నమః, 

ఓం హాం వరుణాయ జలాధిపతయే నమః, 

ఓం హాం వాయవే ప్రాణాధిపతయే నమః, 

ఓం హాం సోమాయ నేత్రాధిపతయే నమః, 

ఓం హాం ఈశానాయ సర్వవిద్యాధిపతయే నమః, 

ఓం హాం అనంతాయ నాగాధిపతయే నమః, 

ఓం హాం బ్రహ్మణే సర్వలోకాధిపతయే నమః, 

ఓం హాం ధూలి చండేశ్వరాయ నమః,


అనంతరము తత్త్వ న్యాస, ముద్రాప్రదర్శన, ధ్యానాలను నిర్వర్తించి పాద్య, ఆసన, అర్ఘ్య, పుష్ప, అభ్యంగ, ఉద్వర్తన, స్నాన, సుగంధానులేపన, వస్త్ర అలంకార, భోగ, అంగన్యాస, ధూప, దీప, నైవేద్యార్పణ, తాంబూల నివేదనల ద్వారానూ, నృత్య, వాద్య, గీతాలతోనూ మహేశ్వరుని సంతుష్టపఱచాలి. దేవదేవుని రూపాన్ని మనసులో ధ్యానిస్తూ జపం చేయాలి. పూజనూ, జపాన్నీ ఆయనకే సమర్పించి వేయాలి.


ఈ ప్రకారంగానే వివిధ కామనల సిద్ధికై విశ్వావసు అను గంధర్వునీ కాళరాత్రీ దేవినీ కూడా ఉపాసిస్తారు.


(అధ్యాయాలు 38-41)


No comments:

Post a Comment