Sunday 12 May 2024

శ్రీ గరుడ పురాణము (173)

 


ఈ మణులలో మట్టిమరకలు, మలినాలు ఉండిపోయినవి, కరకరమని శబ్దం వచ్చేవీ, నీలాకాశాన్ని కప్పే నల్లమబ్బుల రంగున్నవి మంచివి కావు. అవి వర్ణదోషదూషితాలు. వీటి మధ్యలోనే రత్నశాస్త్ర కోవిదులు ప్రశంసలతో ముంచెత్తే ఇంద్రనీలమణులు ఎక్కువగా జన్మిస్తాయి.


పద్మరాగమణిని ధరిస్తే కలిగే సత్ఫలితాలన్నీ ఇంద్రనీలమణిని ధరించినవారికీ కలుగుతాయి. ఈ మణిలో కూడా మూడు జాతులు కనిపిస్తున్నాయి. మణి యొక్క రత్న పరీక్ష కూడా రెండింటికీ ఒక్కటే.


అగ్ని పరీక్ష మణి నిర్ధారణకి మాత్రమే చేయాలి గాని మణిని మరింత వన్నెచిన్నెలతో శోభిల్లేలా చేయడానికి అగ్నిలో పడవేయరాదు. దానివల్ల మొదటికే మోసం వస్తుంది. సద్గుణయుక్తమైన మణి దోషదూషితమై తనను అగ్నిలో అతిగా వేయించిన వానికీ వేసినవానికీ కీడును కలిగించవచ్చు.


గాజు, కలువ, గన్నేరు, స్పటిక, వైఢూర్యాది మణులు (ఇవన్నీ మణుల్లో రకాలే) ఇంద్రనీలమణి యొక్క పోలికలతో, గుణాలతో వున్నా కూడా రత్నశాస్త్రజ్ఞులు ఇంద్రనీలమణి వైపే మొగ్గు చూపుతారు. అందుచేత వీటిని క్షుణ్ణంగా పరీక్షించాలి. ముఖ్యంగా గురుత్వ కఠినత్వాలను చూడాలి. ఇంద్రనీలమణికి మధ్యలో ఇంద్రాయుధమైన వజ్రాయుధం కనిపిస్తే ఇక దానిని మించిన రత్నమే లేదు.


ఒక ఇంద్రనీలమణిని తీసుకొని దానికి వందరెట్లు పరిమాణమున్న స్వచ్ఛమైన పాలలో పడేస్తే, ఆ పాలన్నీ నీలవర్ణంలోకి వచ్చివేస్తే అది అచ్చమైన మణి. దీనిని మహా నీలమణి అని కూడా అంటారు. ఎలాగైతే మాశాదులతో మహాగుణశాలియైన పద్మ రాగమణిని తూస్తారో అలాగే సువర్ణ పరిమాణ (ఎనభై రత్తీలు)ములతో మహా గుణశాలియైన ఇంద్రనీలమణిని తూస్తారు”.


(అధ్యాయం - 72)


No comments:

Post a Comment