Friday 24 August 2012

ధ్యాయేత్ 
అంటే ధ్యానం చేయడం ద్వారా అని అర్ధం.అసలు ధ్యానం అంటే ఏమిటి?స్వాస మీద ధ్యాస.మనకు అనువుగ ఉన్న ప్రదేశంలొ కూర్చుని,కన్నులు ముసి,మన రెండు కళ్ళ దృష్టీ బృకుటి అంటే మన రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలొ ఉంచి మన మనస్సును స్వాస మీద నిలిపి,ఉచ్చ్స
్వాస,నిస్వాసలను గమనించే ప్రక్రియను ధ్యానం అంటారు.ఈ శ్లొకాన్ని ధ్యానం చేసె ప్రక్రియలొ మన మనస్సును ఆ పరమాత్మ పై నిలిపి,ఈ శ్లొకంలొ చెప్పిన స్వరూపాన్ని ధ్యానం ద్వార అంటే మానసికంగా పరమేస్వరుడ్ని దర్శించాలి.ఆ పదాల అర్ధం తెలుసు కనుక ప్రతి పదాన్ని స్మరిస్తున్నప్పుడు మనకు వాటి అర్ధలు గుర్తుకురావలి.ఇల చేస్తె ఏమి అవుతుంది.ధ్యానంలొ పరమేశ్వరుని దివ్యమంగళ రూపం దర్శనం అవుతుంది.అలా అవ్వాలంటే ముంది మనం మౌనంగా ఉండాలి.మన మౌనంగ ఉంటే మన దేహం మనస్సుతొ మాట్లాడ్డం మొదలుపెడుతుంది. మనస్సును మౌనంగ ఉంచాలి.మనస్సు మౌనంగా ఉంటే అది మన అత్మతొ మట్లాడుతుంది.ఆ ఆత్మను తెల్సుకొని దానిని కూడా మౌనంగా పరమేశ్వరుని యందు ఉండేలా చేయగలిగితే అది ఆ పరమాత్మ లొ ఐక్యం అవుతుందని రహస్యార్ధం.మరి ఇంతా చేస్తూ కూర్చొవడానికి సమయం ఉండదు కదా మరి మనం ఏం చేయాలి?ఆ శ్లొకం లొ చెప్పిన పదాలను గుర్తుచేసుకుంటూ ఈ శ్లొకాన్ని పఠించడం చేత తత్ఫలితం కలుగుతుంది.మరి ఈ శ్లొక పఠనంవల్ల కలిగే ఫలితం ఏంటొ,అది ఎలా కలుగుతుందొ తరువాయి భాగంలొ చెప్పుకుందాం.

No comments:

Post a Comment