Sunday 20 January 2013

మన దేవాలయాలు-7

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం 
మన దేవాలయాలు-7
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)


మనకు దేవాలయంలో ఉండే విగ్రహాలును చాలా మంది బొమంలంటారు. సంస్కృతంలో విగ్రహానికి అర్ధం విశేషంగా శక్తిని గ్రహించేది అని.ఆలయంలో ఉన్న విగ్రహం క్రింద యంత్రం పెడతారు. మంత్రం ప్రకృతిలో కలిగించే తరంగాల ఆకారం యొక్క సాకార రూపమే యంత్రం. అటువంటి రాగి యంత్రాన్ని విగ్రహం క్రింది భాగంలో పెట్టి దాని మీద విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. క్రింద పంచలోహాలు వేస్తారు. పంచలోహాలు,రాగి యంత్రం భూమిలో ఉన్న విద్యుతయస్కాంత శక్తిని ఆకర్షిస్తుంది. పైన పిరమిడ్ ఆకారంలో ఉన్న గోపురం/ విమానం కూడా శక్తిని గ్రహిస్తుంది. ఈ రెండు శక్తులను కూడా విగ్రహం గ్రహిస్తుంది.

ఒక ముఖ్యమైన విషయం. చాలామంది అవి శిలలు మాత్రమే అనుకుంటారు. కాని మన దేవాలయాల్లో ఉన్నవి శిలలు కాదు. హిందువులు రాళ్ళకు పూజలు చేయటంలేదు. ఆ విగ్రహాన్ని వేదమంత్రాలు చదువుతూ వడ్లు, ధాన్యం, పాలు, పెరుగు, గోధుమలు............... ఇలా మన ప్రాణానికి ఆధారమైన ప్రాణశక్తి కలిగిన వస్తువుల మధ్యలో పెడతారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విగ్రహ ప్రతిష్ట చేసే సమయంలో తంత్రశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఆ విగ్రహానికి ప్రాణం పోస్తారు. అదే ప్రాణప్రతిష్ట. అప్పటినుంచి అది విగ్రహం కాదు. దానిలోనికి మహామహిమాన్వితమైన దైవశక్తి వస్తుంది. ఆ సమయం నుంచి ఆ విగ్రహం మన మాటలు వింటుంది, తన కళ్ళోతొ జరిగేవన్ని చూస్తుంది. మనం చెప్పుకునే కష్టాల్లన్నీ కూడా ఆ విగ్రహంలో ఉన్న దైవానికి వినిపిస్తాయి. అక్కడ శక్తి ఉందికనుకే దేవాలయంలో దేవునికి నిత్యం ధూపదీపనైవెధ్యాలు పెడతారు. ఏ ఊరిలో అయితే దేవాలయం మూతపడుతుందో, ఎక్కడైతే గుడిలో దేవునకు నిత్యం నైవెధ్యం ఉండడో ఆ ఊరి కరువుకాటకాలతో, రోగాలతో, మరణాలతో అల్లాడుతుంది.

చాలామంది విగ్రహారాధన తప్పంటారు. అంతటా భగవంతుడున్నాదు, ఆయనకు రూపం లేదు.......... ఇల రకరకాలుగా అంటారు. అది నిజమే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయనకు రూపం లేదు, ఎందుకంటే అన్ని రూపాలు ఆయనవే. అన్ని తానై ఉన్నాడు. రాయిలోనూ ఉన్నాడు, పక్షిలోనూ ఉన్నాడు, చెట్టు, పుట్ట, మనిషి, నది, అలా సర్వవ్యాపిగా ఉన్నాడు. కాని ఇది అందరు అర్ధం చేసుకోవడం కష్టం. అందరికి భగవంతుడిని అంతట చూసేంత జ్ఞానం ఉండదు. మరి కష్టాలు వస్తే ఎల చెప్పుకుంటారు? తమ భాధను ఎలా పంచుకుంటారు? తమకు భయం వేసినప్పుడు ఏ రూపాన్ని స్మరిస్తారు? ఆధ్యాత్మిక జ్ఞానం అంతగా లేనివారు తమకు వచ్చిన భాధను పంచుకోవడం కోసం పరమాత్మ ఒక విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. వారికి భాధ కలగగానే తమకంటూ ఒకడున్నాడన్న భావంతో వెళ్ళి తమ భాధను పరమాత్మతో పంచుకుంటున్నారు. రామకృష్ణ పరమహంస కూడా విగ్రహారాధన తప్పకాదు, మొదట సగుణారాధాన చేస్తుంటే కాలక్రమంలో భగవత్తత్వం అర్దం అవుతుందంటారు. విగ్రహాల్లో మాత్రమే దేవుడు లేడు, అంతటా ఉన్నవాడు విగ్రహాల్లో కూడా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి.          
 
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............
  

No comments:

Post a Comment