Wednesday 30 January 2013

గంగ - హిందూధర్మం

ఓం
జై గంగామాత! జై జై గంగామాత!

గంగానదికి, భారతదేశం, హిందూధర్మం అనే మూడు అంశాలు విడదీయరానివి.

నెహ్రూ, తన పుస్తకమైన డిస్కవరి ఆఫ్ ఇండియా లో గంగను ఉద్ద్యేశించి చెబుతూ కొని లక్షలమందిని తన తీరంకు ఆకర్షిన గంగ భారతదేశానికి గుండేకాయ. గంగోత్రి నుండి సముద్రంలో కలిసేవరకు, పురాతనకాలం నుండి ఆధునిక కాలం వరకు, భారత్ లో ఏర్పడిన అనేక సామ్రాజ్యాలు, నాగరికతలు, ప్రజల చరిత్ర మొత్తం గంగతోనే ముడిపడి ఉంది. ఈ దేశం గొప్పతనం గంగ నదియే.

ఇప్పుడు ఆ మాటలు గుర్తుచేసుకోవడానికి కారణం మీకు తెలుసా? గంగమ్మతల్లి  భారతదేశంలో హిందూధర్మ స్థాపన కోసం తపించింది. దాదాపు 1000 ఏళ్ళ పైగా భారతదేశం మీద ఇస్లామిక్ దండయాత్రలు జరిగాయి. అటువంటి సమయంలోనే దక్షిణభారతంలో హిందువుల మీద అనేక దాడులు జరుగాయి, అనేకమంది చంపబడ్డారు, కొందరు మతం మార్చివేయబడ్డారు. అటువంటి సమయంలో మహానుభావులు శ్రీ విద్యారణ్య స్వామివారు గంగా తీరం వెంబడి నడుస్తున్నప్పుడు గంగమ్మ తల్లి ప్రత్యక్షమై " విద్యారణ్య, దక్షిణభారతంలో దండయాత్రల కారణంగా అనేకమంది హిందువులు చంపబడ్డారు. వారి రక్తం ఏరులైపారుతోంది. ఈ పరిస్థితిని నేను చుడలేకపోతున్నా. నీవు తక్షణమే వెళ్ళి అక్కడ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించు, హిందూ ధర్మస్థాపన చెయ్యి " అని చెబుతూ భోరున విలపించింది. కన్నీటి పర్యంతమైంది.

ఆ గంగమ్మ తల్లి రోదన విన్నాక, ఆమె కన్నుల వెంట నీరు కారడం చూసిన, విద్యారణ్య మహాస్వామివారు దక్షిణభారతదేశానికి వచ్చి హరిహర రాయులు, బుక్కరాయులను నిమిత్తంగా చేసుకుని,వారిచే అతిపెద్ద హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిచినవారిలో ఒకరే శ్రీ కృష్ణదేవరాయలు. యావత్ ప్రపంచంలో పేరుప్రఖ్యాతులు గాంచింది విజయనగర సామ్రాజ్యం. బంగారం, రత్నాలు, వజ్రవైడూర్యాలు వీధుల్లో పోసి కూర్యగాయల వలే అమ్మేవారు ఈ రాజ్యంలో. మార్గంలో వజ్రం పడివున్నా, అది తమది కాదని తీసుకునే వారు కాదు బాటసారులు. దాన్ని రాయిని చూసినట్టే చూసేవారు. మొత్తం దక్షిణ భారతాన్ని ఆదీనంలో ఉంచుకుని హిందూ ధర్మ ఉద్దరణ చేశారు విజయనగర ప్రభువులు. ఇదంతా గంగమ్మ తల్లి ప్రేరణ వల్లనే. ఈరోజు మన హిందూధర్మం బ్రతకడానికి ఒక కారణం గంగమ్మ.

అటువంటి గంగమ్మతల్లిని పూజిద్దాం. మన హిందూ ధర్మాన్నే ఆచరిద్దాం. హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడిని ఐక్యంగా తిప్పికొడదాం. భారతదేశాన్ని కాపాడుకుందాం. గంగానది కాలుష్యం, భూతాపం బారి నుండి పరిరక్షించుకుందాం. మనం హిందుధర్మాన్నే ఆచరించడమే గంగమ్మ తల్లికి ఇచ్చే గౌరవం.

జై గంగామాత! జై జై గంగామాత!  

No comments:

Post a Comment