Thursday 28 August 2014

పాలవెల్లి

ఓం గం గణపతయే నమః

వినాయక చవితి పూజలో పాలవెల్లి కడతాం ఎందుకు?

ఎక్కడైనా ఒక ప్రదేశానికి ఒక సినీహీరోనో లేక ఒక రాజకీయనాయకుడొ వస్తుంటే, వాళ్ళని చూడటానికి జనం బారులు తీరుతారు.  మరి  వినాయకచవితికి సాక్షాత అనంతకోటి బ్రహ్మాండనాయకుడు, ఆదిమద్యాంతరహితుడైన ఆ పరంబ్రహ్మాన్ని గణపతి స్వరూపంగా చిన్న మట్టి విగ్రహంలోని ఆవాహన చేస్తున్నాం. పరమాత్ముడు మనం పూజించే విగ్రహంలోని వస్తున్నాడంటే, ఆయన్ను సేవించడానికి దేవయక్షకిన్నెరకింపురుషాదులు, గ్రహాలు ఆ పూజాప్రదేశానికి చేరుకుని ఆ పరమాత్ముడిని సేవిస్తాయి. దీనికి సంకేతంగా మనం పాలవెల్లి కడతాం. పాలవెల్లి కట్టే పండులు అంతరిక్షానికి, అక్కడ ఉండే జ్యోతిర్మండలానికి, నక్షత్ర, తారా సమూహానికి, గ్రహాలకు సంకేతం. మనం మాత్రమే కాదు, మన కట్టే పాలవెల్లి ద్వారా ఆయా శక్తులు స్వామిని సేవిస్తాయి.  

ఓం గం గణపతయే నమః    

1 comment:

  1. వేలాది సంవత్సరాల క్రితం వర్షాలు పడ్డాక చెరువుల్లోని నీళ్లతో వ్యవసాయం చేసే రైతన్నలు చెరువులోని బంకమన్నుతో తాము నచ్చిన రూపాల్లో బొమ్మల్ని చేసి తమ పంటలకు నీరందిస్తున్న చెరువులకు, తమ నేలలోని మట్టికి కృతజ్ఞతా సూచకంగా ఆరాధన చేసేవారు. అందులో బలానికి, ఎత్తుకు గుర్తుగా ఏనుగును ఎక్కువగా చిత్రీకరించుకొనేవారు. కొన్నిరోజులు (నవరాత్రులు) గడిచాక తిరిగి ఆ బొమ్మల్ని అదే చెరువుల్లో 'మట్టిలో మట్టి' అంటూ కలిపేవారు. ఇందులో వారి గ్రామీణ, రైతాంగ భౌతిక వ్యక్తీకరణ ఉంది.

    ReplyDelete