Wednesday 5 March 2014

హిందూ ధర్మం - 29

కాంతి అంతరిక్షంలో ఒక వస్తువును చేరుటకు కొన్ని కోట్ల సంవత్సరములు ప్రయాణిస్తుందో, అదే విధంగా మనసును నుంచి ఉద్భవించిన ఆలోచనా తరంగాలు కూడా ఆ ఫ్రిక్వెన్సీకి చెందిన వేరే మనసును చేరే వరకు కొన్ని కోట్ల సంవత్సరములు ప్రయాణిస్తాయి. ఈ ప్రకృతి అంతా మంచి, చెడు ఆలోచనా తరంగాలతో నిండి పోయి ఉంది. మనసు కూడా రేడియో వంటిది. రేడియోని ఒక నిర్డేశిత ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేసినప్పుడు అది ఏ విధంగానైతే గాలి ఉన్నా ఆ ఫ్రీక్వెన్సి తరంగాలనే గ్రహిస్తుందో, అదే విధంగా మనసు కూడా ప్రకృతిలో స్థిరమైన ఉన్న ఆయా ఆలోచనా తరంగాలను గ్రహిస్తుంది. దాని అనుసరించే వ్యక్తి యొక్క ప్రవర్తన ఉంటుంది.

ప్రతి ఒక్కరి మనసు నుంచి ఉద్భవించిన ఆలోచన వేరే వస్తువును చేరే వరకు ప్రయాణిస్తూనే ఉంటుంది. మనసు ఎప్పుడు ప్రకృతిలో ఉన్న ఈ ఆలోచన తరంగాలను గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక వేళ ఎవరైనా ఒక వ్యక్తి, చెడు ఆలోచన చేస్తే చాలు, అతని మనసును అతను ఆ ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేసి పెడుతున్నాడన్నమాట. అటువంటి ఆలోచన కలిగిన మరుక్షణమే అంతా వ్యాపించి ఉన్న చెడు ఆలోచనా తరంగాలు అతడిని చుట్టుముట్టి అతని మనసులోకి చొచ్చుకుపోవడానికి పోరాటం చేస్తాయి. అందుకే చెడ్డవ్యక్తి రోజు రోజుకు మరింత దుర్మార్గుడిగా మారిపోతాడు. అతని చర్యలు మరింత శక్తివంతం అవుతాయి. పెద్ద వినాశకారిగా తయారవుతాడు. అదే తరహాలో మంచివ్యక్తి జీవితం కూడా ఉంటుంది. అతని మనసు ఎప్పుడూ మంచి ఆలోచనా తరంగాలను గ్రహించడానికే సిద్ధంగా ఉంటుంది, కనుక అతను మరింత మంచివాడిగా మారుతాడు.

రెండవ విషయం మనం చెడుగా ఆలోచిస్తే, మన ఆలోచనలు కూడా ప్రకృతిలో కొన్ని వందల ఏళ్ళవరకు నిలిచిపోతాయి. వేరే వ్యక్తి అటువంటి ఆలోచనలు చేసినప్పుడు వడి మనౌస్ను ఆవహించి, వాడిని తప్పు దారి పట్టిస్తాయి. అంటే మనం చెడు, అసభ్య, అశ్లీల, ఆత్మనూన్యత భావంతో, బాధతో, విచారంతో చేసే ప్రతి ఆలోచనలు కొన్ని వందల మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, మనం మనకు హానీ చేసుకోవడమే కాక లోకానికి పెద్ద అపకారం చేస్తున్నాం. మనం మంచి ఆలోచనలు చేస్తే, మంచి యొక్క శక్తి సమాజంలో పెరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం మన ఆలోచనలే మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. అందుకే ధర్మం మీ మనసును నిగ్రహించండి, చెడుగా ఆలోచించకండి, అంటూ, దమాన్ని అలవాటు చేసుకోమంటుంది.

To be continued...........

No comments:

Post a Comment