Saturday 22 March 2014

రాజ్యాధికారమే లక్ష్యంగా మతమార్పిడులు

రెండు వందల ఏళ్ళ తీవ్రప్రయత్నం తరువాత కుడా హిందూ ధర్మం నాశనం కాకపోవడాన్ని క్రైస్తవ మిషనరీలు అంగీకరించలేకపోయాయి. స్వతంత్రం వచ్చినా, ఇంకా భారత్‌ను మతం మర్చాలనీ, తమకు బానిస చేసుకోవాలనీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  భారతదేశంలో జరిగే మత మార్పిడుల వెనుక విదేశీ హస్తం ఉంది. అది ఎలాగంటారా? దేశవ్యాప్తంగా జరుగుతున్న మతమార్పిడుల వెనుక పెద్ద పధకమే ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ప్రతి పార్లమెంటు స్థానంలో తమ మతస్థులు కనీసం 30-35% తగ్గకుండా ఉండేలా మరమార్పిడులు చేస్తున్నారు. అంతకుమించినా అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మతమార్పిడి జరిగిన తరువాత వారికి ఇచ్చే భోధనలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎక్కువగా హిందూ సంస్కృతికి, భారతదేశ సమగ్రతకు వ్యతిరేకంగానే ఉంటాయి. అది తెలియని అమాయకజనం అవే నిజమని నమ్ముతారు.

మన దేశంలో ఓటుబ్యాంకు రాజకీయాలు మనకు తెలిసిందే. దానికి తోడు హిందువుల్లో ఐక్యత ఉండదు. ముస్లింలు, క్రైస్తవులు అందరూ తమకు సంబంధించిన ఒక రాజకీయపార్టికి గంపగుత్తగా ఓటు చేసినట్టు హిందువులు ఓటు వేయరు. పైగా రాజకీయనాయకులే హిందువులను కులం, ప్రాతం పేరున విడిదీస్తారు. కనుక ఎన్నికల సమయంలో ఈ 30% ఓట్లు రాజకీయ పార్టీల జయాపజయాలకు కీలకంగా మారతాయి. మతపెద్ద ఎవరికి ఓటు వేయమంటే వారికే ఓటు వేసేలా ఆయా మతస్థులను తయారు చేస్తారు. అందుకే రాజకీయ పార్టీలు ఈ 30-35% ఉన్న జనాన్ని ఆకర్షించడానికి వారికి అనుగుణంగా పనిచేసే రాజకియ నాయకులను నిలబెడతారు.

ఉదాహరణకు ఒక నియోజవర్గంలో, 100 భారతీయుల్లో 70 మంది హిందువులు, వేరే మతస్థులు 30 మంది ఉన్నారనుకుందాం. 70 మంది హిందువులు ఐక్యత లేని కారణంగా 7 రాజకీయపార్టీలకు ఓటు వేస్తారు. ఫలితంగా ఓట్లు చీలిపోతాయి. మిగితా 30 మంది ఒకే పార్టికి తమ ఓటు వేసి, తమ మతానికి సంబంధించిన అభ్యర్ధిని గెలిపించుకుంటారు. రానున్న కొద్ది కాలంలో దేశమంతా ఇదే జరగాలని విదేశీయులు ఆశిస్తున్నారు. ఈ గెలిచిన అభ్యర్ధులు కూడా దేశానికి మేలు చేసే విధంగా నడుచుకోరు, వారికి ముందే బోధనలతో బ్రెయిన్ వాష్ చేసిన కారణంగా మానసికంగా బలహీనపడి, విదేశీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటారు, వారికి బానిసలవుతారు. ఇలా ఎప్పుడైతే మన దేశపు సార్వభౌమాధికారం ఇతర దేశాలవారి పాదాల దగ్గర పడుతుందో, అప్పుడు ఒక 20 సంవత్సరాలలో దేశం విదేశాలకు బానిస అయిపోతుంది. పార్లమెంటులోకి విదేశియులు ప్రవేశిస్తే, చట్టాలు మారిపోతాయి, క్రమక్రమంగా భారతదేశం బలహీనపడుతుంది. ఒకసారి విదేశీయులు వెనుక ఉండి నడిపిస్తున్న ఇతర మతస్థుల చేతుల్లోకి అధికారం వెళ్ళిదంటే హిందూ సంస్కృతి, భారతదేశం అస్థిత్వం కోల్పోతుంది. ఒకప్పుడు దక్షిణ కొరియా బౌద్ధమతస్థులు అధికంగా ఉన్న దేశం. కానీ దాని మీద క్రైస్తవ మిషనరీలు దృష్టి పెట్టి, దాన్ని క్రైస్తవ మెజారటి దేశంగా మార్చేశాయి. ఇప్పుడు అవే మిషనరీలు భారతదేశం మీద దృష్టి పెట్టాయి. మనం మేల్కొనకపోతే హిందువులు స్వదేశంలో మైనారటిలు అవుతారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు మొదలైంది. ఇటువంటి అనేక విషయాలను Rajiv Malhotra గారు Breaking India అనే తన పుస్తకంలో వివరిచారు. కనీసం ఇప్పటికైనా హిందువులంతా ఐక్యంగా ఉండాలి, భారతదేశాన్ని రక్షించుకోవాలి. మత మార్పిడిలను అరికట్టాలి. విదేశీయుల చేతిలో మోసపోకుండా మన సోదరులు, భారతీయులైన ఇతర మతస్థులను కాపాడుకోవాలి. హిందువులు కూడా ఓటు బ్యాంకుగా మారాలి. మన ఉమ్మడి హక్కులను రక్షించుకోవాలి.   

No comments:

Post a Comment