Thursday 4 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (163)



గోపూజలో దానిని పూజించడంతోనే సరి. గజ పూజలో దానిని పూజించడమే కాకుండా అదీ పూజ చేస్తుంది.


అన్ని పెద్ద ఆలయాలలోనూ ఏనుగులుంటాయి. కేరళలో త్రిచూర్లో భగవంతుని కంటే ఏనుగులకే ప్రాముఖ్యం ఉన్నట్లు కన్పిస్తుంది. అట్లా ఏనుగులకు దైవానికి సంబంధం ఉంది. ఏనుగు మొఱ పెడితే వైకుంఠం నుండి విష్ణువు రాలేదా? గజేంద్ర మోక్షకథ తెలుసుకదా. అన్ని జంతువులలో పెద్ద శరీరం కలది, దొడ్డ గుణాలున్నది ఏనుగు ఒక్కటే. పరమాత్మ అందరి శరీరాలలోనూ ఉన్నా అతని విభూతి ఇందు వ్యక్తీకరింపబడుతుంది.


అన్ని ప్రాణులూ వినాయకునిలో ఉన్నాయి. అతణ్ణి ముందుగా అర్చిస్తారు కనుక దేవగణాలకు చెందినవాడు. దేవుడని చెప్పడానికి గుర్తేమిటంటే సేవించిన వారికి ఆశీస్సులనందించే శక్తి కలిగి యుండడడమే. గణపతికి ఆ శక్తి యుంది.


అతడు భూతగణాలకు చెందినవాడు. ఆ పెద్ద బొజ్జ, పొట్టికాళ్ళు మొదలైన లక్షణాలు సూచిస్తున్నాయి కదా.

No comments:

Post a Comment