Wednesday 24 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (184)

 


వినాయకుడు - తమిళం


ఒక దేవత, భారతదేశంలో అన్నిచోట్లా పూజలందుకొంటున్నా, ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంత వాసులు ఒక దేవతతో మమైకమై పూజిస్తూ ఉంటారు అట్లా తమిళ ప్రజలు, సుబ్రహ్మణ్యునితో ఐక్యమయ్యారు. ఈ స్వామియే తమిళ దైవమని. వారి భాషకు అధిదేవతయని భావిస్తారు. కాని వినాయకునకు అట్టి స్థానం ఇవ్వడంలో ఔచిత్యముందంటాను. సోదరులిద్దర్నీ విడదీయకుండా కలిపే పూజించాలంటాను.


రాజకీయాలలో ఉన్న ద్వేషానికి తోడు కొంతమంది బుద్ధిమంతులు, పరిశోధకులు, రెండు తప్పుడు తీర్మానాలను చేస్తున్నారు. తమిళనాడులో వినాయకపూజ, కంచి పల్లవులు, వాతాపి చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధకాలంలో ప్రవేశపెట్టబడిందని అన్నారు. పల్లవ సైన్యానికి అధిపతియైన నరసింహ వర్మ, పరంజోతిగా పిలువబడ్డాడు. అతడు వాతాపినుండి వినాయకుణ్ణి తీసుకొని వచ్చాడని అన్నారు. ఆ పరంజోతి, తరువాతి కాలంలో శైవసాధువయ్యాడు. మరొక అభిప్రాయం ఏమంటే కార్తికేయుడు, అసలు తమిళ దైవమే అని, ఇట్టి దేవుణ్ణి ఉత్తర దేశస్థులు స్వీకరించి అతనిపై ఎన్నో కథలల్లి అనేక పురాణాలను వ్రాసారని, ఆగమాలను సృష్టించారని వీరి వాదం. నిజం చెప్పాలంటే ఇద్దరూ సమస్త భారతీయులకు ఆరాధ్య దైవాలే.

No comments:

Post a Comment