Wednesday 24 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (183)



పెద్దన్నగారితో రోజును మొదలుపెడతాం


వినాయకుడనగానే శివ-శక్తి తనయుడని చటుక్కున గుర్తుకు వస్తుంది. షోడశనామాలను స్కంద పూర్వజనామంతో పూర్తిచేసినపుడు వారి మరియొక తనయుని స్మరించగా మొత్తం వారి కుటుంబాన్ని స్మరించినట్లౌతుంది కదా. కనుక చివరి నామం అట్లా పలికి మంగళాంతంగా ముగిస్తున్నాం.


మన మందరమూ పార్వతీ సంతానమే. మన కందరికీ అన్న, వినాయకుడే. అతని తమ్ముడైన స్కందమూర్తిని స్మరించడం వల్ల అందరూ ఆ కుటుంబానికి చెందిన వారయ్యారు. కనుక లేచీ లేవగానే షోడశనామాలను కీర్తిస్తే రోజువారీ కృత్యాలు నిరాటంకంగా సాగుతాయి. అన్నిటిలోనూ నిర్విఘ్నత కల్గుతుంది. 


సర్వకార్యేషు విఘ్న:తస్య నజాయతే


ఇట్లా రోజూ నామాలు చివర ఫలశ్రుతిని చదివి చూడండి. లాభమే.

No comments:

Post a Comment