Sunday 21 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (180)



నిర్గమే: ఏదో విడిచి వెళ్ళిపోవడం నిర్గమం. వల్లితో వివాహమైన వెనుక తన శాశ్వతమైన స్కందలోకానికి వెళ్ళాడు. భార్యలతో వెళ్ళాడు. వల్లికి ముందు దేవసేనను వివాహం చేసుకున్నాడు కదా.


ఈ లోకంలో అవతరించడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి శూరపద్ముని సంహరించుట, రెండవది తన మేనమామ పిల్లలను వివాహం చేసుకొనుట. ఒక కూతురు దేవరాజు కూతురుగా, మరొక కూతురు భిల్లరాజు కూతురుగా పెరిగారు.


తిరుచెందూర్ దాటి సముద్రంలో అసుర సంహారం చేసాడు. తరువాత దేవసేనతో వివాహం తిరప్పరన్ కున్రంలో జరిగింది. అక్కడ ఉండగా నారదుడు వచ్చి చిత్తూర్ లో వల్లి, విరహవేదన పడుతూ ఉందని వివరించాడు. అందువల్ల తిరుప్పీరన్ కున్రంలో వల్లీ దేవసేనలతో కూడి కలిసిన మూర్తి ఉండదు. కాని ఒక ప్రక్కదేవసేన ఒక ప్రక్కనారదుడూ ఉన్న విగ్రహం ఉంటుంది. పరమాత్మ యొక్క దయను జీవాత్మునిపై ప్రసరింపజేయు గురు స్వరూపునిగా ఉన్నవాడూ నారదుడే. సుబ్రహ్మణ్యుడు వల్లిపై మరులు గొనునట్లుగా చేసినవాడూ నారదుడే. అందువల్ల ఇతడు స్వామి యొక్క మూర్తి ప్రక్కన ఉంటాడు.


వల్లీ వివాహమైన వెనుక ఇద్దరు భార్యలతో తిరుత్తనిలో సాక్షాత్కరిస్తాడు. స్కంద లోకానికి వెళ్ళడం, నిర్గమనం. వల్లీ వివాహం ఇట్లా దోహదం చేసింది. ఇట్లా అవతార ప్రయోజనం నెరవేరింది.


వల్లితో వివాహానికి కారకుడైన విఘ్నేశ్వరుడు, స్కంద లోకానికి ఇతడు నిర్గమించడానికి కారకుడయ్యాడు.

No comments:

Post a Comment