Friday 26 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (186)



ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలు - వినాయకుని లీలలు


కావేరీ నదీ తీరంలో శైవక్షేత్రాలంత విరివిగా వైష్ణవ క్షేత్రాలు లేకపోయినా శ్రీరంగంలోని రంగనాథాలయం ప్రసిద్ధిని పొందింది. అసలు కావేరీ నదికి దాని ఉపనదియైన 'కొల్లిడం'కు మధ్య శ్రీరంగనాథుడు వెలిసాడు. అతడు కావేరీ రంగడు, రంగరాజు.


పూర్వకాలంలో రంగనాథుణ్ణి అయోధ్య నేలిన ఇక్ష్వాకురాజులు కులదైవంగా ఆరాధించేవారట. అట్టి స్వామి, శ్రీరంగంలో ఎట్లా ప్రతిష్ఠితు డయ్యాడో అనే విషయం, రామాయాణానికి చెందింది. దానికి వినాయకునకూ సంబంధం ఉంది. శ్రీరాముని పట్టాభిషేకం పూర్తియైన తర్వాత వచ్చినవారు అయోధ్యను విచిడి పెట్టే సందర్భంలో రాముడనేకమైన కాన్కలను వారికందించాడు. వారందరూ యుద్ధంలో సాయపడ్డారు. కాబట్టి విభీషణునకు విశేషమైన కానుకలను ఈయాలనుకున్నాడు రాముడు. తన భార్యను, రాజ్యాన్ని తిరిగి పొందడానికి సుగ్రీవుడు, రాముని చెంత చేరితే ఏమీ ఆపేక్షించకుండా కేవలం శరణాగతిని పొందినవాడు విభీషణుడు. ఇదీ వారికున్న తేడా. అతణ్ణి చేరదీస్తూ ఇట్టి ప్రతిజ్ఞను చేసాడు రాముడు.


సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే 

అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ ప్రతం మమ


అట్టి త్యాగియైన విభీషణునకు తగ్గట్లుగా గొప్ప కానుకులను ఇవ్వాలి. అందుకోసం కులదైవమైన రంగనాథ విగ్రహాన్ని దానితో బాటు ప్రణవాకార విమానాన్ని లంకకు తీసుకొని వెళ్ళవలసినదిగా అన్నాడు రాముడు.


No comments:

Post a Comment