Thursday 11 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (170)



ఏనుగును పూజించిన సింహం


హేరంబ గణపతి రూపం ప్రత్యేకంగా ఉంటుంది. ఇతనికి ఐదు ముఖాలు అన్నీ గజ ముఖాలే. 'పంచమాతంగ ముఖ' అనే పాట కూడా ఉంది. తిరువారూర్ లో ఇట్టి గణపతిని చూసి ముత్తుస్వామి దీక్షితులు పాడియుంటారు.


పరమశివునకు ఐదు ముఖాలు. శివపంచాక్షరి ధ్యానంలో అలా ఉంటుంది. శంకరులిక్కడే శ్లేషను ప్రయోగించారు.


బదు ముఖాలుంటాయి. కనుక ఈశ్వరునకు పంచాస్యుడని పేరు. సింహానికీ పంచాస్యమని పేరు. ఇక్కడ పంచయనగా విస్తరించినదని (పెద్ద ముఖం కలది) అర్థం. ప్రపంచం అనినపుడు విస్తరించినది యనే అర్థంలో వాడుతున్నారు. ఈ సందర్భంలో పంచ్ అనగా ఐదని, ఐదు భూతాలతో ప్రపంచముంటుందని అర్థం చేసుకోవచ్చు కదా. సింహం అంటే భయపడుతుంది ఏనుగు. సింహాన్ని స్వప్నంలో చూసినా భయపడి చనిపోతుందని అంటారు. సింహ స్వప్నం అనే మాట ఉంది. ఏనుగును చూస్తే ఉన్న బలాన్ని అంతా పుంజుకుని మీద పడడానికి సిద్ధమౌతుంది సింహం. దాని కుంభస్థలం బ్రద్దలు కొడుతుంది. అట్టి సింహం ఏనుగునకు పూజ చేస్తే ఆశ్చర్యం. అందుకే శంకరులు మహాదంతి వక్రాపి పంచాస్యమాన్యా అని తిరుచెందూర్ లోని సుబ్రహ్మణ్యుని భుజంగ స్తోత్రంలో నుతించినపుడు, వినాయక స్తుతిగా ఈ మొదటి శ్లోకాన్ని వ్రాసేరు.


సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రీ


మహాదంతి వక్రాపి పంచాస్య మాన్యా


విఘ్నేశ్వరుడెపుడూ బాలరూపంలో ఉంటాడు. సదా బాలరూపాపి. అపి అంటే అయినా, కొండల వంటి విఘ్నాలను పిండి చేస్తున్నాడు.


దాని తరువాత అతడేనుగైనా సింహం చేత పూజింపబడ్డాడు. 'మహాదంతి వక్రాపి పంచాస్య మాన్యా'.


No comments:

Post a Comment