Wednesday 10 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (169)



వనవాసానికి ముందు పాండవులు ఇంద్రప్రస్థంలో రాజసూయ యోగం చేయాలనుకున్నారు. ధర్మరాజు, సోదరులను నలువైపులా పంపించాడు. అప్పుడు సహదేవుడు దక్షిణ వైపునకు వచ్చాడు. ఆ ప్రాంతాలను జయించాడు. భారతంలో హేరంబం అనే రాజ్యాన్ని జయించినట్లుంది. ఇదే కాలక్రమంలో మైసూరుగా రూపొందిందేమో! మహిషుని ఊరు, మైసూరు. మహిషం అంటే దున్నపోతే కదా! మహిషానికి, హేరంబ పదానికి దగ్గర సంబంధం ఉంది. సహదేవుని చేతిలో ఓడిపోయినా తాము గొప్ప వారమనే అహంకారంతోనే అక్కడవారు యుండి యుంటారు. ఎవడు తన గొప్పను తాను చెప్పుకుంటూ ఉంటే వాటిని హేరంబుడని పిలిచి యుంటారు. ఇట్టి ప్రాంతంలో వినాయకుడు కొలవ బడడం చేత ఇతడు హేరంబ గణపతి అయ్యాడు.


ఇది ఊహ మాత్రమే. నాకేమని తట్టుతోందంటే అర్థం కోసం ప్రాకులాడకుండయ్యా. హేరంబపదం వీనులవిందుగా లేదా? నామాదిరిగా ఆజ్ఞా సూచకంగా లేదా? నేనీ పేరుతో పిలువబడడం సబబే కదా, నా పేరుతో పిలవండి. నిఘంటువుల నెందుకు చూస్తారు? అని చెబుతున్నాడేమో! 


అతడు హేరంబ రాజ్యానికి చెందినవాడైనా కాకపోయినా పదం ప్రసిద్ధి పొందింది. షోడశనామాలలో ఇదీ ఉంది.


(హేరంబ పదం అమరంలో, హేరుద్ర సమీపే రంబతే తిష్ట తీతి హేరంబ రుద్రుని యొద్దనుండువాడు, ఋగతా హేరతే వర్ధయతి భక్తానితివా భక్తులవృద్ధి బొందించువాడు. హే వృద్ధా - అమరం - గురుబాల ప్రబోధిక-అనువక్త)


No comments:

Post a Comment