Sunday 17 March 2024

శ్రీ గరుడ పురాణము (122)

 


కార్తీక శుద్ధషష్ఠినాడు ఉపవాసం చేసి సప్తమినాడు సూర్యభగవానుని పూజిస్తే ఎన్నో పాపాలూ నశిస్తాయి.


ప్రతిశుద్ధ ఏకాదశినాడూ, నిరాహారంగా వుండి ద్వాదశినాడు విష్ణుభగవానుని పూజ చేస్తే ఒక ఏడాదిలోపలే అన్ని మహాపాపాలూ నశిస్తాయి.


సూర్య,చంద్ర గ్రహణాది ప్రత్యేక సమయాల్లో మంత్రజపం, తపస్సు, తీర్థసేవనం, దేవార్చన, బ్రాహ్మణ పూజనంలలో ఏది జీవితాంతం చేసినా మహాపాతకాలన్నీ మరుగులోకి జారిపోతాయి. ఎన్ని పాపాలు చేసినవాడైనా పశ్చాత్తాపపడి పుణ్యతీర్థంలోకి పోయి నియమబద్ధంగా జీవిస్తూ ప్రాణత్యాగం చేస్తే వాని పాపాలన్నీ నశిస్తాయి.


(ఇక్కడ సతీసహగమనం గూర్చి చెప్పబడింది. పరిహరించబడింది)


పతివ్రతయై, పతిసేవ, శుశ్రూషలలో దత్తచిత్తయై వుండే స్త్రీని ఏ పాపమూ అంటదు. శ్రీరామపత్ని రావణునిపై విజయాన్ని సాధించినట్లు పతివ్రతయగు స్త్రీ సర్వపాపాలపై విజయాన్ని సాధిస్తుంది.


సంయతచిత్తులై తీర్థస్నానాలు చేస్తూ వ్రతాల నాచరిస్తూ, బ్రాహ్మణులకు దానాలిస్తూ జీవించేవారు సర్వపాప ముక్తులై ఉత్తమగతులను పొందుతారు." (అధ్యాయం 52)


No comments:

Post a Comment