Tuesday 19 March 2024

శ్రీ గరుడ పురాణము (124)

 


ముకుంద నిధి లక్షణాలున్నవాడు రజోగుణ సంపన్నుడై వుంటాడు. రాజ్య సంపాదన, విస్తరణేచ్ఛలను కలిగివుంటాడు. భోగాలను బ్రహ్మాండంగా అనుభవిస్తాడు. గాయకులనూ, వేశ్యాదులనూ పోషిస్తుంటాడు.


నందనిధీశునికి రాజస తామస గుణాలు రెండూ వుంటాయి. తన వర్ణం వారికి ఆధారభూతుడై వుంటాడు. ఎవరైనా పొగిడితే పొంగిపోతాడు. బహుపత్నీవ్రతుడై వుంటాడు. మిత్రులను మార్చేస్తూ వుంటాడు.


నీలనిధి చిహ్నాలతో సుశోభితుడైన నరుడు సాత్త్విక తేజంతో విరాజిల్లుతుంటాడు. వస్త్ర, ధాన్యాదులను బాగా సంపాదించి తటాకాది నిర్మాణాలను గావించి జాతికి అంకితం చేస్తుంటాడు. జనహితం కోరి మామిడి వంటి ఫలవృక్షాల తోటలను పెంచుతాడు. వీని సంపద మూడు తరాల వఱకూ నిలబడుతుంది. (నందనిధీశుని సంపద ఒక తరందాకానే వుంటుంది).


శంఖనిధి లక్షణాలున్నవాడు తాను అన్నిభోగాలనూ అనుభవిస్తాడు. కాని ఆశ్రితులకు ఏమీ పెట్టకుండా చిరుగుపాతల బరువు బ్రతుకుల వారిని చేసి పారేస్తాడు. తన స్వంత పోషణ, భోగాలే చూసుకుంటాడు. వీని సంపద ఒక తరమే నిలబడుతుంది.


మిశ్ర (కలగాపులగపు) నిధుల వారి లక్షణాలు వైవిధ్యభరితాలు. మునులారా! విష్ణుభగవానుడు శంకరాది దేవతలకు నిధుల, అవి గల నరుల లక్షణాలను పై విధంగా ఉపదేశించాడు.


(అధ్యాయం - 53)


No comments:

Post a Comment