Thursday 21 March 2024

శ్రీ గరుడ పురాణము (126)

 


(మేరు పర్వతం గూర్చి బాగా విపులంగా భవిష్యపురాణంలో చెప్పబడింది) కర్ణిక పదహారు వేల యోజనాలు.


మేరువుకి దక్షిణంలో హిమాలయం, హేమకూటం, నిషధం; ఉత్తరంలో నీలం, శ్వేతం, శృంగి- అను వర్ష పర్వతాలున్నాయి.


హే నీలకంఠా! ప్లక్షాది ద్వీపాల్లో నివసించేవారికి మృత్యువుండదు. ఏ యుగం వచ్చినా ఏ యుగం పోయినా తేడా వుండదు.


జంబూ ద్వీపాన్ని పాలించిన అగ్నీధ్ర మహారాజుకి తొమ్మండుగురు కొడుకులు. వారు నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్య, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల, నామధేయులు. తండ్రి వారికిచ్చిన రాజ్యభాగాలు వారి పేళ్ళతోనే ప్రసిద్ధమయ్యాయి. నాభి మహారాజుకి మేరుదేవి యను పత్నిద్వారా ఋషభుడను పుత్రుడు కలిగాడు. ఋషభ పుత్రుడైన (మొదటి) భరతుడు శాలగ్రామ తీర్థంలో నిత్యవ్రతరతుడై వుండేవాడు. అతని తరువాత వంశంలో తైజసుడు, ఇంద్రద్యుమ్నుడు, పరమేష్ఠి, ప్రతీహారుడు, ప్రతిహర్త, ప్రస్తారుడు, విభుడు, నక్తుడు, నరుడు, విరాటుడు, ధీమాన్, భౌవన్, త్వష్ట, విరజుడు, రజుడు, శతజితుడు, విష్వగ జ్యోతి అనేవారు పితృపుత్ర పరంపరగా జనించారు.


ఆధ్యాయం - 54


No comments:

Post a Comment